కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన పెంగ్విన్ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ ద్వారా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. విమర్శకులు, సగటు ప్రేక్షకులు పెదవి విరిచిన ఈ థ్రిల్లర్ చిత్రం థియేటర్లలో విడుదల అయితే, వచ్చిన వసూళ్లను బట్టి హిట్టా ఫట్టా తేల్చవచ్చు. మరి ఓటిటీలో వచ్చిన ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అయినట్టా కాదా? కీర్తి సురేష్ పాపులారిటీకి తోడు ఈ చిత్రం పట్ల రేకెత్తిన ఉత్సుకత వల్ల పెంగ్విన్ చిత్రాన్ని పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు వీక్షించారు.
డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అయిన సినిమాలలో పెంగ్విన్ కి మొదటి వారాంతంలో వచ్చినన్ని వ్యూస్ మరే చిత్రానికీ రాలేదట. ఈ చిత్రాన్ని తమిళంతో పాటు, తెలుగు, మలయాళంలో కూడా రిలీజ్ చేయడం కూడా ఇందుకు కారణం అనుకోవచ్చు. ఈ చిత్రం కోసం అమెజాన్ పెట్టిన పెట్టుబడి వర్కవుట్ అయిపోయిందట. అలాగే ఇక మీదట వచ్చే వ్యూస్ నుంచి నిర్మాతకు కూడా షేర్ వెళ్తుందట.
ఒక పాపులర్ హీరోయిన్ లేదా హీరో వుంటే, డిజిటల్ రిలీజ్ కి ఉండే అడ్వాంటేజ్ ఇది. సినిమాకు నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చినా కానీ, ఫ్రీగా స్ట్రీమ్ అవుతుంది కనుక జనం అదేంటో చూడ్డానికే మొగ్గు చూపుతారు.
This post was last modified on June 22, 2020 1:50 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…