అక్కినేని నాగచైతన్య, సమంతల జోడీ చాలా ముచ్చటగా అనిపించేది అభిమానులకు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్లుగా కనిపించిన ఆ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్న నాలుగేళ్లకే విడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఈ వార్త ముందుగా బయటికి వచ్చినపుడు రూమర్ అనే అనుకున్నారు. నమ్మడానికి అభిమానులు ఇష్టపడలేదు. కానీ తర్వాత అదే నిజమని తేలింది.
ఈ వార్త బయటికి వచ్చి అప్పుడే ఆరు నెలలు దాటిపోయింది. ఇప్పటిదాకా విడాకుల గురించి, అందుకు దారితీసిన కారణాల గురించి బహిరంగ వేదికల్లో చైతూ కానీ, సమంత కానీ స్పందించలేదు. నాగచైతన్య తన లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాల ప్రమోషన్ల టైంలో విడాకుల అంశం మీద ప్రశ్నలను దాటవేయడానికే చూశాడు. ఐతే విడాకుల నిర్ణయంతో తామిద్దరం సంతోషంగా ఉన్నట్లుగా మాత్రం మాట్లాడాడు.
సమంత ఇన్ డైరెక్టుగా ఇన్స్టా పోస్టులు పెట్టడం, వ్యాఖ్యలు చేయడం తప్ప ఈ వ్యవహారంపై నేరుగా ఇప్పటిదాకా స్పందించలేదు. ఆమెను ఈ విషయమై ప్రశ్నించడానికి మీడియాకు అవకాశం కూడా దక్కలేదు. ఐతే ఇప్పుడు సమంత సౌత్ మీడియా ముందుకు రాబోతోంది. తమిళంలో నయనతార, విజయ్ సేతుపతితో కలిసి ఆమె నటించిన కణ్మణి రాంబో ఖటీజా సినిమా ప్రమోషన్ల కోసం సమంత రంగంలోకి దిగుతోంది. ఈ చిత్రం నెలాఖర్లో విడుదల కానుంది.
ఈ మధ్య ముంబయిలో ఓ ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్న సమంతకు అక్కడ విడాకుల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. కష్టపడి సమాధానాలు దాటవేసింది. కానీ సౌత్ మీడియా ఆమెను అంత తేలిగ్గా వదలకపోవచ్చు. సమంత కూడా దీనికి ప్రిపరేయ్యే మీడియాను కలిసే ఛాన్సుంది. ఇప్పటిదాకా ఇన్ డైరెక్ట్గా విడాకుల విషయంలో కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన సామ్.. ఇప్పుడు మీడియా ముందు ఈ వ్యవహారంపై ఓపెన్ అయిపోతుందేమో, సంచలన విషయాలేమైనా చెబుతుందేమో అని అంతా ఎదురు చూస్తున్నారు. చూడాలి ఏం జరుగుతుందో?
This post was last modified on April 13, 2022 6:30 am
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…
``కాంగ్రెస్ పార్టీలో నేనైనా ఆమె అయినా ఒక్కటే. పార్టీ క్రమశిక్షణ విషయంలో అందరూ సమానమే. ఎవరు ఏం చేశారన్నది పార్టీ…
ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్రతిపార్టీలోనూ ఇబ్బందులు వస్తే.. ప్రతిపార్టీపైనా…
‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…
వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…