అక్కినేని నాగచైతన్య, సమంతల జోడీ చాలా ముచ్చటగా అనిపించేది అభిమానులకు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్లుగా కనిపించిన ఆ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్న నాలుగేళ్లకే విడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఈ వార్త ముందుగా బయటికి వచ్చినపుడు రూమర్ అనే అనుకున్నారు. నమ్మడానికి అభిమానులు ఇష్టపడలేదు. కానీ తర్వాత అదే నిజమని తేలింది.
ఈ వార్త బయటికి వచ్చి అప్పుడే ఆరు నెలలు దాటిపోయింది. ఇప్పటిదాకా విడాకుల గురించి, అందుకు దారితీసిన కారణాల గురించి బహిరంగ వేదికల్లో చైతూ కానీ, సమంత కానీ స్పందించలేదు. నాగచైతన్య తన లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాల ప్రమోషన్ల టైంలో విడాకుల అంశం మీద ప్రశ్నలను దాటవేయడానికే చూశాడు. ఐతే విడాకుల నిర్ణయంతో తామిద్దరం సంతోషంగా ఉన్నట్లుగా మాత్రం మాట్లాడాడు.
సమంత ఇన్ డైరెక్టుగా ఇన్స్టా పోస్టులు పెట్టడం, వ్యాఖ్యలు చేయడం తప్ప ఈ వ్యవహారంపై నేరుగా ఇప్పటిదాకా స్పందించలేదు. ఆమెను ఈ విషయమై ప్రశ్నించడానికి మీడియాకు అవకాశం కూడా దక్కలేదు. ఐతే ఇప్పుడు సమంత సౌత్ మీడియా ముందుకు రాబోతోంది. తమిళంలో నయనతార, విజయ్ సేతుపతితో కలిసి ఆమె నటించిన కణ్మణి రాంబో ఖటీజా సినిమా ప్రమోషన్ల కోసం సమంత రంగంలోకి దిగుతోంది. ఈ చిత్రం నెలాఖర్లో విడుదల కానుంది.
ఈ మధ్య ముంబయిలో ఓ ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్న సమంతకు అక్కడ విడాకుల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. కష్టపడి సమాధానాలు దాటవేసింది. కానీ సౌత్ మీడియా ఆమెను అంత తేలిగ్గా వదలకపోవచ్చు. సమంత కూడా దీనికి ప్రిపరేయ్యే మీడియాను కలిసే ఛాన్సుంది. ఇప్పటిదాకా ఇన్ డైరెక్ట్గా విడాకుల విషయంలో కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన సామ్.. ఇప్పుడు మీడియా ముందు ఈ వ్యవహారంపై ఓపెన్ అయిపోతుందేమో, సంచలన విషయాలేమైనా చెబుతుందేమో అని అంతా ఎదురు చూస్తున్నారు. చూడాలి ఏం జరుగుతుందో?
This post was last modified on April 13, 2022 6:30 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…