కేజీఎఫ్: చాప్టర్ 2 మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మూడేళ్ల కిందట పెద్దగా అంచనాల్లేకుండా వచ్చి చాప్టర్-1 వివిధ భాషల్లో ఎంతటి సంచలన విజయం అందుకుందో తెలిసిందే. అప్పట్నుంచి సెకండ్ పార్ట్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అంతకంతకూ అంచనాలు పెరిగాయే తప్ప తగ్గలేదు. ఎట్టకేలకు ఆ చిత్రం థియేటర్లలోకి దిగుతోంది.
ఈ చిత్రాన్ని హిందీలో జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ చూసి బెంబేలెత్తి షాహిద్ కపూర్ క్రేజీ మూవీ జెర్సీని కూడా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఐతే తమిళ సినిమా బీస్ట్ను మాత్రం కేజీఎఫ్-2కు పోటీగా నిలబెట్టేశారు. ఒక దశలో ఈ చిత్రాన్ని కూడా వాయిదా వేస్తారని ప్రచారం జరిగింది.. విజయ్ ఉన్న ఫాంను చూసి నిర్మాతలు ధైర్యం చేసి కేజీఎఫ్-2 కంటే ఒక రోజు ముందు రిలీజ్కు సినిమాను రెడీ చేశారు.
ఐతే బీస్ట్ మూవీకి.. కేజీఎఫ్-2 దెబ్బ గట్టిగానే తగిలేలా ఉంది. కేజీఎఫ్-2 లేకుంటే తమిళనాడులో ఉన్న థియేటర్లన్నింటిలో బీస్ట్నే వేసేసేవాళ్లు. అక్కడ కేజీఎఫ్-2కు క్రేజ్ తక్కువగా ఏమీ లేదు. ఓ మోస్తరుగా దానికి స్క్రీన్లు ఇవ్వక తప్పని పరిస్థితి. మరోవైపు కేరళలోనూ విజయ్ సినిమాకు స్క్రీన్లు తగ్గేలా చేస్తోంది యశ్ సినిమా. తెలుగు రాష్ట్రాల్లో అయితే బీస్ట్కు బాగానే గండికొడుతోంది కేజీఎఫ్-2.
బిగిల్, మాస్టర్ లాంటి చిత్రాలతో పోలిస్తే దీనికి అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు. ఆల్రెడీ ఆర్ఆర్ఆర్ కోసం బాగా ఖర్చు పెట్టారు తెలుగు ప్రేక్షకులు. మళ్లీ కేజీఎఫ్-2 కోసం పెద్ద బడ్జెట్టే పెట్టాల్సి వస్తోంది. దీంతో బీస్ట్ మీద అంతగా ఆసక్తి చూపించట్లేదు. కేజీఎఫ్-2, బీస్ట్ చిత్రాలు రెంటినీ నైజాం వరకు దిల్ రాజే రిలీజ్ చేస్తున్నాడు.
కేజీఎఫ్-2 బుకింగ్స్ ఆలస్యం చేసినా.. బీస్ట్ బుకింగ్స్ పుంజుకోలేదు. ఉదయమే ఐదో షో వేసుకునే అవకాశం ఉన్నప్పటికీ రెగ్యులర్ షోలకే బుకింగ్స్ అంతంతమాత్రంగా ఉండటంతో చాలా థియేటర్లు ఆ అవకాశాన్నే ఉపయోగించుకోవడం లేదు. బుధవారం ఒక్క రోజైనా వీలైనంత మేర బీస్ట్ ద్వారా రాబట్టుకుందామంటే.. జనాల దృష్టి కేజీఎఫ్-2 నుంచి మళ్లడం లేదు. ఇక కర్ణాటక, అలాగే నార్త్ ఇండియాలో అయితే బీస్ట్ రిలీజ్ను నామమాత్రం చేసేసేలా ఉంది కేజీఎఫ్-2.
This post was last modified on April 12, 2022 7:06 pm
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…