గని సినిమా కోసం యువ కథానాయకుడు వరుణ్ తేజ్ మామూలు కష్టం పడలేదు. శారీరకంగానే కాక మానసికంగానూ అతను ఈ సినిమా కోసం పడ్డ కష్టం అలాంటిలాంటిది కాదు. ఈ సినిమా కోసం అతను సిక్స్ ప్యాక్ బాడీలోకి మారాడు. భారీ కాయుడైన వరుణ్ ఆ లుక్లోకి మారడం అంత తేలికైన విషయం కాదు. ఇక కరోనా, ఇతర కారణాల వల్ల సినిమా విపరీతమైన ఆలస్యం జరిగి వరుణ్ కెరీర్లో విలువైన మూడేళ్ల సమయం గని కోసం వెచ్చించాల్సి వచ్చింది.
కానీ ఇంత కష్టపడి ఫలితం లేకపోయింది. గని అంచనాలకు తగ్గట్లు లేదంటూ పెదవి విరుస్తున్నారు ప్రేక్షకులు. రిలీజ్ ముంగిటే బజ్ అంతంతమాత్రం కాగా.. నెగెటివ్ టాక్ రావడంతో గనికి కలెక్షన్ల కటకట తప్పట్లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ సరిగా లేకపోవడంతో ముందే చిత్ర బృందం డల్లయిపోయింది. ఇక టాక్ బాగా లేకపోవడంతో కలెక్షన్లు పుంజుకునే అవకాశమే కనిపించడం లేదు. కనీసం వీకెండ్ వరకు కూడా గని చెప్పుకోదగ్గ వసూళ్లు రాబట్టే పరిస్థితి లేకపోయింది. దీంతో ఈ సినిమా కోసం కేటాయించిన థియేటర్లు, స్క్రీన్లను తిరిగి ఆర్ఆర్ఆర్ కోసం వెనక్కి తీసుకోవాల్సి వస్తోంది.
శుక్రవారం సాయంత్రం నుంచే గని థియేటర్లు వెలవెలబోవడం మొదలైంది. దీంతో రెండో రోజుకే దీనికి మల్టీప్లెక్సుల్లో స్క్రీన్లు, షోలు తగ్గిపోయాయి. సింగిల్ స్క్రీన్లలో వెంటనే మార్చలేరు కాబట్టి వీకెండ్ వరకు ఆగక తప్పట్లేదు. వీకెండ్ తర్వాత అయితే గని అస్సలు నిలిచే పరిస్థితి కనిపించడం లేదు.
మూడో వీకెండ్లోనూ ఆర్ఆర్ఆర్కు మంచి డిమాండ్ ఉండడటంతో మాగ్జిమం షోలు దానికే కేటాయించి వసూళ్ల పంట పండించుకుంటున్నారు బయ్యర్లు, ఎగ్జిబిటర్లు. గత వారం వచ్చిన మిషన్ ఇంపాజిబుల్ కూడా కనీస ప్రభావం చూపించకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర ఆర్ఆర్ఆర్యే లీడ్ తీసుకుంది. హిందీలో సైతం ఆ సినిమాకు అసలు ఎదురన్నదే కనిపించడం లేదు. బీస్ట్, కేజీఎఫ్ వచ్చే వరకు ఆర్ఆర్ఆర్ మోత కొనసాగేలా ఉంది.
This post was last modified on April 10, 2022 9:08 am
గత ఏడాది డిసెంబర్ లో రిలీజైన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ ఏ…
కొన్ని ల్యాండ్ మార్క్ సినిమాలకు కాలదోషం ఉండదు. టాలీవుడ్ స్థాయిని ప్రపంచ వీధుల దాకా తీసుకెళ్లి అక్కడ జెండా పాతేలా…
మాటల మాంత్రీకుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోడీపై ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. తమ వ్యం గ్యాస్త్రాలు,…
ఈ ఏడాది ఎండలు జనాలను హడలెత్తిస్తున్నాయి. ఏకంగా 44, 45 డిగ్రీల ఊష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీచేస్తున్నది. ఆంధ్రప్రదేశ్,…
తాజాగా ఏపీలో కూటమిగా ఎన్నికలకు వెళ్తున్న టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీలు మేనిఫెస్టో విడుదల చేశాయి. మొత్తంగా ఆది నుంచి చంద్రబాబు చెబుతున్న…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. పాత పథకాలకే కొన్ని మెరుగులు దిద్దడం…