ఆర్ఆర్ఆర్ ఇంకా మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. వారం తిరిగేసరికి కేజీఎఫ్, బీస్ట్ సినిమాలు రాబోతున్నాయి. ఇలాంటి భారీ చిత్రాల మధ్యలో బాక్సాఫీస్ పరీక్షకు సిద్ధమైంది వరుణ్ తేజ్ గని సినిమా. ఈ సినిమా అతడితో పాటు చాలామంది కెరీర్లకు చాలా ముఖ్యమైంది. వరుణ్ మార్కెట్ స్థాయిని మించి, భారీ బడ్జెట్లో తెరకెక్కిన చిత్రమిది. ఈ సినిమా కోసం ఏకంగా మూడేళ్లు సమయాన్ని వెచ్చించాడు వరుణ్.
కరోనా సహా వేరే కారణాల వల్ల కూడా సినిమా ఆలస్యమైంది. ఈ సినిమాలో ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతిబాబు.. ఇలా పెద్ద తారాగణమే ఉన్నప్పటికీ.. బాక్సాఫీస్ భారమంతా వరుణే మోయాల్సి ఉంది. తన స్టార్ పవర్ను చూపించాల్సిన సమయమిది. ఇక ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్న కిరణ్ కొర్రపాటికి తొలి విజయం సాధించడం చాలా అవసరం.
కొత్త దర్శకుడు అయినప్పటికీ రాజీ లేకుండా ఈ సినిమాను నిర్మించిన, ఎంతో కష్టపడ్డ వరుణ్కు మంచి ఫలితాన్ని అందించాల్సిన బాధ్యత అతడిపై ఉంది. ఇక ఈ చిత్రంతోనే అల్లు అరవింద్ పెద్ద కొడుకు అల్లు బాబీ పూర్తి స్థాయిలో నిర్మాతగా మారుతున్నాడు. అతడి కజిన్ సిద్ధు ముద్దకు కూడా నిర్మాతగా ఇదే తొలి చిత్రం. మరోవైపు బాలీవుడ్ భామ సయీ మంజ్రేకర్ గనితోనే టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోంది.
తెలుగులో ప్రత్యేక పాత్రలు పోషించిన ఏ చిత్రాలతోనూ విజయాలందుకోని ఉపేంద్ర, సునీల్ శెట్టిలకు కూడా ఈ సినిమా సక్సెస్ కావడం చాలా అవసరమే. మరి ఇంతమందికి కీలకంగా మారిన గనికి శుక్రవారం ఉదయం ఎలాంటి టాక్ వస్తుందో.. ఆర్ఆర్ఆర్ పోటీని తట్టుకుని వీకెండ్లో ఏమేర వసూళ్లు రాబడుతుందో.. వచ్చే వారం రెండు క్రేజీ చిత్రాలు వచ్చేలోపు బయ్యర్లు ఎంతమేర సేఫ్ జోన్లోకి తీసుకొస్తుందో చూడాలి.
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…
మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…
ఏపీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ.. ప్రస్తుత ఉండి శాసనసభ్యుడు రఘురామకృష్ణరాజును కస్టడీలో టార్చర్ చేసిన కేసులో హైకోర్టు సంచలన…
ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కల్యాణ్పై కేసు పెట్టాలని.. ఆయన వల్ల తెలంగాణ ప్రజలు మనోవేదనకు గురవుతున్నారని…
2019 ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతున్న తరుణంలో వైసీపీ నేతల నోట జాబ్ కేలండర్ అన్న మాట గట్టిగా వినిపించింది.…