పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల లైన్ విషయంలో చాలా గందరగోళం నడుస్తోంది. పింక్ రీమేక్ వకీల్ సాబ్తో రీఎంట్రీకి రెడీ అయ్యాక.. ఆయన ఒప్పుకున్న సినిమాలు వరుస క్రమంలో చూస్తే ఈపాటికి హరిహర వీరమల్లు రిలీజైపోయి ఉండాలి. భవదీయుడు భగత్ సింగ్ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉండుండాలి. కానీ మధ్యలోకి భీమ్లా నాయక్ వచ్చి పడటంతో ఈ సినిమాలు వెనక్కి వెళ్లాయి. హరిహర వీరమల్లు చిత్రీకరణ సగమే పూర్తయింది. భవదీయుడు భగత్ సింగ్ సినిమా ఇంకా మొదలే కాలేదు.
షూటింగ్ ఆరంభించే విషయంలో దర్శకుడు హరీష్ శంకర్ చెప్పిన డెడ్ లైన్లు ఎప్పటికప్పుడు దాటిపోతున్నాయి. సినిమా మాత్రం మొదలే కావడం లేదు. చివరగా హరీష్ శంకర్ చెప్పిన దాని ప్రకారం జూన్లో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఆ ప్రకారం సినిమా పట్టాలెక్కేలా కనిపించడం లేదు. అంటే షూటింగ్ ఇంకా ఆలస్యంగా మొదలు కాబోతోందా.. సినిమా ఇంకా లేటవుతుందా అన్న సందేహాలు కలగొచ్చు. కానీ విషయం ఇది కాదు. ఈ చిత్రం అనుకున్నదానికంటే ముందే మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
హరిహర వీరమల్లు కోసం ప్రిపరేషన్లో ఉన్న పవన్ను హరీష్, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు రవిశంకర్, నవీన్ ఎర్నేని తాజాగా కలిశారు. ఈ ఫొటోలు కూడా మీడియాకు రిలీజ్ చేశారు. ఈ సినిమాకు సంబంధించి అప్డేట్స్ రాబోతున్నాయని, షూటింగ్ అతి త్వరలో మొదలవుతుందని మైత్రీ ట్విట్టర్ అకౌంట్లో పేర్కొన్నారు. ఈసారి బాక్సాఫీస్ బద్దల్ బాసింగాలే అంటూ అభిమానులు వెర్రెత్తిపోయే కామెంట్ కూడా జోడించారు.
రీఎంట్రీ తర్వాత పవన్ అభిమానులు ఆయన్నుంచి ఎక్కువగా కోరుకుంటున్న సినిమా ఇదే. పవన్-హరీష్ కలయికలో ఇంతకుముందు వచ్చిన గబ్బర్ సింగ్ ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. ఆ కలయికలో మళ్లీ సినిమా అనేసరికి ముందు నుంచి ఎగ్జైట్ అవుతూనే ఉన్నారు. కానీ ఇప్పుడిప్పుడే సినిమా మొదలయ్యే సూచనల్లేవని సైలెంటుగా ఉన్న ఫ్యాన్స్కు హరీష్ అండ్ టీం త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టి స్వీట్ షాక్ ఇచ్చేలా ఉంది.
This post was last modified on April 8, 2022 12:44 pm
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…