పెద్ద హీరోలు కలిసి మల్టీస్టారర్లు చేయకపోతేనేమో.. వాళ్లకు ఇగోలెక్కువ, బాలీవుడ్లో మాదిరి ఎందుకు మన స్టార్లు చేతులు కలపరు.. కొత్త కథలకు అవకాశమివ్వరు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంటారు ప్రేక్షకులు. కానీ ఇద్దరు పెద్ద స్టార్లు కలిసి సినిమా చేయడానికి సిద్ధమైతేనేమో.. ఆ చిత్రంలో ఎవరెక్కువ హైలైట్ అవుతారు.. ఎవరికెన్ని పాటలు, ఫైట్లు.. ఏ పాత్రకు ప్రాధాన్యం ఎక్కువ అంటూ తూకాలు వేసి మాట్లాడటం మొదలుపెడతారు. ఆర్ఆర్ఆర్ విషయంలో సరిగ్గా ఇదే జరిగింది.
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి ఇద్దరు పెద్ద స్టార్లు, పైగా తెలియని ఒక వైరం ఉన్న రెండు పెద్ద సినీ కుటుంబాలకు చెందిన హీరోలు కలిసి సినిమా చేయడానికి రెడీ అయితే దీన్నొక సెలబ్రేషన్ లాగా భావించి.. వారి కలయికలో సినిమాను ఆస్వాదించడానికి సిద్ధమవ్వాలి. అందులోనూ రాజమౌళి సినిమాలో వీళ్లిద్దరూ హీరోలుగా నటిస్తున్నందుకు మరింత సంతోషించాలి. హీరోల్లాగే అభిమానులు కూడా చేతులు కలిపి ఈ మెగా మూవీని బ్రహ్మరథం పట్టాలి.
కానీ ఆర్ఆర్ఆర్ అనౌన్స్మెంట్ దగ్గర్నుంచి తారక్, చరణ్ అభిమానులకు కొట్టుకోవడమే సరిపోయింది. ఏ ప్రోమో రిలీజైనా ఎవరెక్కువ, ఎవరు తక్కువ అని వాదించుకోవడానికే పరిమితం అయ్యారు. ఇక సినిమా రిలీజయ్యాక ఈ చర్చ మరింత ముదిరింది. పాత్ర పరంగా చరణ్ది కొంచెం హైలైట్ అయ్యేసరికి తారక్ అభిమానులు ఫీలవడం, రాజమౌళిని నిందించడం, మరోవైపు చరణ్ అభిమానులు కవ్వించడం.. ఇలా రెండు వారాలుగా ఎడతెగని డిస్కషన్ నడుస్తోంది ఈ టాపిక్ మీద. చివరికిది నార్త్ జనాల్లోకి కూడా వెళ్లిపోయింది. ఈ సోషల్ మీడియా చర్చలకు ప్రభావితం అయిన ఓ ముంబయి జర్నలిస్ట్.. ఆర్ఆర్ఆర్ సక్సెస్ పార్టీలో అడగకూడని ప్రశ్న అడిగింది.
సినిమాలో చరణ్ డామినేషన్ గురించి ప్రస్తావించింది. దీనికి ఇటు చరణ్, అటు తారక్ ఇద్దరూ ఇబ్బంది పడ్డారు. రాజమౌళి సంగతి చెప్పాల్సిన పని లేదు. ఈ వీడియో బయటికి వచ్చాక మళ్లీ సోషల్ మీడియాలో చరణ్, తారక్ అభిమానుల మధ్య వాగ్వాదాలు నడుస్తున్నాయి. మొత్తానికి అభిమానులు ఈ పోలికలతో అర్థం లేని చర్చలు, వివాదాలు తీసుకొస్తుండటంతో రేప్పొద్దున ఇలాంటి మల్టీస్టారర్లు చేయడానికి హీరోలు సంకోచించడం ఖాయం. ఒకవేళ చేసినా కథ, పాత్రలకు సరెండర్ కాకుండా అభిమానులను దృష్టిలో ఉంచుకుని వాళ్లు కూడా కొలతలు, తూకాల గురించి ఆలోచిస్తారేమో.
This post was last modified on April 8, 2022 11:40 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…