పెద్ద హీరోలు కలిసి మల్టీస్టారర్లు చేయకపోతేనేమో.. వాళ్లకు ఇగోలెక్కువ, బాలీవుడ్లో మాదిరి ఎందుకు మన స్టార్లు చేతులు కలపరు.. కొత్త కథలకు అవకాశమివ్వరు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంటారు ప్రేక్షకులు. కానీ ఇద్దరు పెద్ద స్టార్లు కలిసి సినిమా చేయడానికి సిద్ధమైతేనేమో.. ఆ చిత్రంలో ఎవరెక్కువ హైలైట్ అవుతారు.. ఎవరికెన్ని పాటలు, ఫైట్లు.. ఏ పాత్రకు ప్రాధాన్యం ఎక్కువ అంటూ తూకాలు వేసి మాట్లాడటం మొదలుపెడతారు. ఆర్ఆర్ఆర్ విషయంలో సరిగ్గా ఇదే జరిగింది.
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి ఇద్దరు పెద్ద స్టార్లు, పైగా తెలియని ఒక వైరం ఉన్న రెండు పెద్ద సినీ కుటుంబాలకు చెందిన హీరోలు కలిసి సినిమా చేయడానికి రెడీ అయితే దీన్నొక సెలబ్రేషన్ లాగా భావించి.. వారి కలయికలో సినిమాను ఆస్వాదించడానికి సిద్ధమవ్వాలి. అందులోనూ రాజమౌళి సినిమాలో వీళ్లిద్దరూ హీరోలుగా నటిస్తున్నందుకు మరింత సంతోషించాలి. హీరోల్లాగే అభిమానులు కూడా చేతులు కలిపి ఈ మెగా మూవీని బ్రహ్మరథం పట్టాలి.
కానీ ఆర్ఆర్ఆర్ అనౌన్స్మెంట్ దగ్గర్నుంచి తారక్, చరణ్ అభిమానులకు కొట్టుకోవడమే సరిపోయింది. ఏ ప్రోమో రిలీజైనా ఎవరెక్కువ, ఎవరు తక్కువ అని వాదించుకోవడానికే పరిమితం అయ్యారు. ఇక సినిమా రిలీజయ్యాక ఈ చర్చ మరింత ముదిరింది. పాత్ర పరంగా చరణ్ది కొంచెం హైలైట్ అయ్యేసరికి తారక్ అభిమానులు ఫీలవడం, రాజమౌళిని నిందించడం, మరోవైపు చరణ్ అభిమానులు కవ్వించడం.. ఇలా రెండు వారాలుగా ఎడతెగని డిస్కషన్ నడుస్తోంది ఈ టాపిక్ మీద. చివరికిది నార్త్ జనాల్లోకి కూడా వెళ్లిపోయింది. ఈ సోషల్ మీడియా చర్చలకు ప్రభావితం అయిన ఓ ముంబయి జర్నలిస్ట్.. ఆర్ఆర్ఆర్ సక్సెస్ పార్టీలో అడగకూడని ప్రశ్న అడిగింది.
సినిమాలో చరణ్ డామినేషన్ గురించి ప్రస్తావించింది. దీనికి ఇటు చరణ్, అటు తారక్ ఇద్దరూ ఇబ్బంది పడ్డారు. రాజమౌళి సంగతి చెప్పాల్సిన పని లేదు. ఈ వీడియో బయటికి వచ్చాక మళ్లీ సోషల్ మీడియాలో చరణ్, తారక్ అభిమానుల మధ్య వాగ్వాదాలు నడుస్తున్నాయి. మొత్తానికి అభిమానులు ఈ పోలికలతో అర్థం లేని చర్చలు, వివాదాలు తీసుకొస్తుండటంతో రేప్పొద్దున ఇలాంటి మల్టీస్టారర్లు చేయడానికి హీరోలు సంకోచించడం ఖాయం. ఒకవేళ చేసినా కథ, పాత్రలకు సరెండర్ కాకుండా అభిమానులను దృష్టిలో ఉంచుకుని వాళ్లు కూడా కొలతలు, తూకాల గురించి ఆలోచిస్తారేమో.
This post was last modified on April 8, 2022 11:40 am
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…