మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ అవకాశం వస్తే ఏ దర్శకుడూ దాన్ని వదులుకోవడానికి ఇష్టపడడు. అందులోనూ చిరు కెరీర్ పీక్స్లో ఉన్న 90వ దశకంలో ఆయన సినిమాకు దర్శకత్వం చేసే అవకాశం ఒక యువ దర్శకుడికి వస్తే కాదని అంటాడా? ఐతే ‘ఓం’ సినిమాతో కన్నడ నాట సంచలనం రేపి, అదే సినిమాను తెలుగులో రీమేక్ చేసిన దర్శకుడు, ఆ తర్వాత హీరోగా స్థిరపడ్డ ఉపేంద్ర ఈ అవకాశాన్ని విడిచిపెట్టాడట.
‘ఓం’ సినిమాను ‘ఓంకారం’ పేరుతో తెలుగులో తీస్తున్న సమయంలోనే చిరంజీవితో పని చేసే అవకాశం తన వద్దకు వచ్చిందని, అగ్ర నిర్మాత అశ్వినీదత్ తమ కలయికలో ఈ సినిమాను నిర్మించాలనుకున్నారని.. కానీ కొన్ని కారణాల వల్ల తాను ఆ సినిమా చేయలేకపోయానని, ఇప్పటికీ అందుకు చింతిస్తుంటానని తాను కీలక పాత్ర పోషించిన ‘గని’ సినిమా రిలీజ్ ఈవెంట్ లో ఉపేంద్ర చెప్పాడు.
ఐతే చిరుతో ఛాన్స్ మిస్సయినా.. మెగాస్టార్ ఫ్యామిలీతో మాత్రం తన అనుబంధం కొనసాగుతోందని ఉపేంద్ర చెప్పాడు.ఎ, ఉపేంద్ర సినిమాలతో గుర్తింపు సంపాదించాక తాను తెలుగులో హీరోగా నటించిన సినిమాల్లో ఒకటైన ‘ఒకేమాట’లో నాగబాబుతో స్క్రీన్ షేర్ చేసుకున్నానని.. ఆ తర్వాత అల్లు అర్జున్ సినిమా ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో కీలక పాత్ర పోషించానని.. ఇప్పుడు వరుణ్ తేజ్తో ‘గని’లో నటించే అవకాశం వచ్చిందని చెప్పాడు ఉపేంద్ర. ఈ సినిమా కథను దర్శకుడు కిరణ్ తనకు పది నిమిషాల్లో చెప్పగా, తాను పది సెకన్లు కూడా ఆలోచించకుండా ఓకే చేశానని.. ఆ రోజు ఈ సినిమా మీద తనకు ఎంత నమ్మకం కలిగిందో ఇప్పుడు ట్రైలర్ చూస్తే విజయం మీద అంతే నమ్మకం కలుగుతోందని ఉపేంద్ర అన్నాడు.
ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ మామూలు కష్టం పడలేదని.. అంతటి భారీ ఆహార్యం ఉన్న వ్యక్తి ఇలా మారడం అసాధారణ విషయమని, వరుణ్ నటించిన ‘గద్దలకొండ గణేష్’ చిత్రం తాను చూశానని, ఆ సినిమాకు ఈ సినిమాకు వరుణ్ లుక్ పరంగా పోలికే లేదని ఉపేంద్ర అన్నాడు. కన్నడలో చాలా పెద్ద స్టార్ అయి ఉండి, తెలుగులోనూ మంచి గుర్తింపు ఉండి కూడా తన ప్రసంగంలో ఆద్యంతం వరుణ్ సహా తనకంటే చాలా చిన్న వాళ్లయిన అందరినీ ఉపేంద్ర సార్ అంటూ చాలా వినమ్రంగా మాట్లాడిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది.
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…