మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ అవకాశం వస్తే ఏ దర్శకుడూ దాన్ని వదులుకోవడానికి ఇష్టపడడు. అందులోనూ చిరు కెరీర్ పీక్స్లో ఉన్న 90వ దశకంలో ఆయన సినిమాకు దర్శకత్వం చేసే అవకాశం ఒక యువ దర్శకుడికి వస్తే కాదని అంటాడా? ఐతే ‘ఓం’ సినిమాతో కన్నడ నాట సంచలనం రేపి, అదే సినిమాను తెలుగులో రీమేక్ చేసిన దర్శకుడు, ఆ తర్వాత హీరోగా స్థిరపడ్డ ఉపేంద్ర ఈ అవకాశాన్ని విడిచిపెట్టాడట.
‘ఓం’ సినిమాను ‘ఓంకారం’ పేరుతో తెలుగులో తీస్తున్న సమయంలోనే చిరంజీవితో పని చేసే అవకాశం తన వద్దకు వచ్చిందని, అగ్ర నిర్మాత అశ్వినీదత్ తమ కలయికలో ఈ సినిమాను నిర్మించాలనుకున్నారని.. కానీ కొన్ని కారణాల వల్ల తాను ఆ సినిమా చేయలేకపోయానని, ఇప్పటికీ అందుకు చింతిస్తుంటానని తాను కీలక పాత్ర పోషించిన ‘గని’ సినిమా రిలీజ్ ఈవెంట్ లో ఉపేంద్ర చెప్పాడు.
ఐతే చిరుతో ఛాన్స్ మిస్సయినా.. మెగాస్టార్ ఫ్యామిలీతో మాత్రం తన అనుబంధం కొనసాగుతోందని ఉపేంద్ర చెప్పాడు.ఎ, ఉపేంద్ర సినిమాలతో గుర్తింపు సంపాదించాక తాను తెలుగులో హీరోగా నటించిన సినిమాల్లో ఒకటైన ‘ఒకేమాట’లో నాగబాబుతో స్క్రీన్ షేర్ చేసుకున్నానని.. ఆ తర్వాత అల్లు అర్జున్ సినిమా ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో కీలక పాత్ర పోషించానని.. ఇప్పుడు వరుణ్ తేజ్తో ‘గని’లో నటించే అవకాశం వచ్చిందని చెప్పాడు ఉపేంద్ర. ఈ సినిమా కథను దర్శకుడు కిరణ్ తనకు పది నిమిషాల్లో చెప్పగా, తాను పది సెకన్లు కూడా ఆలోచించకుండా ఓకే చేశానని.. ఆ రోజు ఈ సినిమా మీద తనకు ఎంత నమ్మకం కలిగిందో ఇప్పుడు ట్రైలర్ చూస్తే విజయం మీద అంతే నమ్మకం కలుగుతోందని ఉపేంద్ర అన్నాడు.
ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ మామూలు కష్టం పడలేదని.. అంతటి భారీ ఆహార్యం ఉన్న వ్యక్తి ఇలా మారడం అసాధారణ విషయమని, వరుణ్ నటించిన ‘గద్దలకొండ గణేష్’ చిత్రం తాను చూశానని, ఆ సినిమాకు ఈ సినిమాకు వరుణ్ లుక్ పరంగా పోలికే లేదని ఉపేంద్ర అన్నాడు. కన్నడలో చాలా పెద్ద స్టార్ అయి ఉండి, తెలుగులోనూ మంచి గుర్తింపు ఉండి కూడా తన ప్రసంగంలో ఆద్యంతం వరుణ్ సహా తనకంటే చాలా చిన్న వాళ్లయిన అందరినీ ఉపేంద్ర సార్ అంటూ చాలా వినమ్రంగా మాట్లాడిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది.
This post was last modified on April 7, 2022 1:06 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…