తమిళంలో ఊర మాస్ డైరెక్టర్లలో హరి ఒకడు. సింగం సిరీస్ సినిమాలతో అతడి శైలి ఏంటో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే తెలుసు. వీటి కంటే ముందు సామి సహా కొన్ని భారీ విజయాలు అతడి ఖాతాలో ఉన్నాయి. హరి లాంటి దర్శకుడు తెలుగులో మాస్ హీరోలతో సినిమాలు చేస్తే బాగా వర్కవుట్ అవతుందనే అభిప్రాయాలు ఎప్పట్నుంచో ఉన్నాయి. గతంలో జూనియర్ ఎన్టీఆర్తో హరి సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది. ఇదే విషయాన్ని మీడియా వాళ్లు ఓ సందర్భంలో అడిగితే.. హరి చిరాకు పడ్డాడు.
ఎన్టీఆర్ ఎవరసలు అని ప్రశ్నించాడు. అంటే ఎన్టీఆర్ అతడికి తెలియదని కాదు కానీ.. ఏదో రూమర్ను పట్టుకుని తనను తారక్తో సినిమా గురించి అడిగేసరికి అసహనానికి గురైనట్లున్నాడు హరి. ఐతే అతను ఏ ఉద్దేశంతో ఈ మాట అన్నాడో కానీ.. తారక్ ఫ్యాన్స్ మాత్రం ఈ కామెంట్తో హర్టయ్యారు. కట్ చేస్తే తారక్తోనే కాదు.. మరే తెలుగు హీరోతోనూ ఇప్పటిదాకా హరి సినిమా చేయలేదు. ఐతే ఇప్పుడు హరి టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నట్లు వార్తలొస్తున్నాయి.
ఒకప్పటితో పోలిస్తే హరి ఇప్పుడేమంత ఫాంలో లేడు. సింగం సిరీస్లో చివరి సినిమా సింగం-3 సరిగా ఆడలేదు. ఆ తర్వాత సామి సీక్వెల్ చేస్తే అది పెద్ద డిజాస్టర్ అయింది. ఇప్పుడు అరుణ్ విజయ్ హీరోగా యానై (తెలుగులో ఏనుగు) అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా సెట్స్ మీద ఉండగానే.. తెలుగులో గోపీచంద్ హీరోగా ఓ సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. గోపీ కోసం తనదైన శైలిలో ఒక మాస్ కథ రెడీ చేశాడని.. ఇద్దరి మధ్య కథా చర్చలు జరుగుతున్నాయని, సినిమా దాదాపు ఓకే అయినట్లే అని అంటున్నారు.
ఈ చిత్రానికి నిర్మాతను కూడా గోపీచందే సెట్ చేస్తున్నాడట. ఐతే హరి మాత్రమే కాదు.. ఇప్పుడు గోపీ కూడా ఫాంలో లేడు. ‘లౌక్యం’ తర్వాత అతడికి సక్సెస్ లేదు. త్వరలోనే ‘పక్కా కమర్షియల్’తో పలకరించనున్న అతను.. శ్రీవాస్తో ‘లక్ష్యం-2’ చేస్తున్నాడు. ఇవి రెండూ బాగా ఆడితే తప్ప హరితో చేసే సినిమాకు క్రేజ్ రావడం కష్టమే.
This post was last modified on April 7, 2022 7:04 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…