సమంత ప్రధాన పాత్రలో కొత్త సినిమా యశోద రిలీజ్ డేట్ వచ్చేసింది. ఆగస్టు 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మామూలుగా అయితే ఇదంత చెప్పుకోదగ్గ విషయం కాదు. కానీ ఆగస్టు రెండో వారంలో రిలీజవుతున్న మిగతా సినిమాల సంగతి తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. ఆగస్టు 12నే అఖిల్ అక్కినేని సినిమా ఏజెంట్ రిలీజ్ కాబోతోంది. దానికి ఒక్క రోజు ముందు నాగచైతన్య హిందీ డెబ్యూ మూవీ లాల్ సింగ్ చద్దా విడుదలవుతుంది. వీటిలో ముందు రిలీజ్ ఖరారైంది లాల్ సింగ్ చద్దా మూవీకే.
ఐతే అది బాలీవుడ్ మూవీ కాబట్టి తెలుగులో మరీ ప్రభావం ఉండకపోవచ్చు కాబట్టి అదే వీకెండ్కు అఖిల్ సినిమా ఏజెంట్ను ఫిక్స్ చేశారు. దీన్ని అన్నదమ్ముల పోటీలా చూడటానికి వీల్లేదు. కానీ సమంత సినిమాను అదే వీకెండ్లో రిలీజ్ చేయాలని నిర్ణయించడంలో మాత్రం ఆంతర్యం వేరుగా కనిపిస్తోంది. యశోద సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతోంది. బహుభాషల్లో తెరకెక్కిస్తున్నారు. అంటే ఇటు ఏజెంట్కు, అటు లాల్ సింగ్ చద్దాకు అది పోటీగా నిలవబోతోంది.
అక్కినేని హీరోలకు తన సత్తా చూపించడానికే సమంత పట్టుబట్టి ఇలా రిలీజ్ డేట్ ఎంచుకుందేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి. చైతూ, సమంత చివరగా కలిసి నటించిన మజ్ను సినిమాలో సామ్ ఎంత హైలైట్ అయిందో తెలిసిందే. అప్పుడు చైతూతో సమానంగా స్టార్ ఇమేజ్తో ఆ సినిమా పెద్ద సక్సెస్ కావడానికి సమంత కారణమైందన్న అభిప్రాయాలు వినిపించాయి.
ఐతే వివాహ బంధంలో ఉంది కాబట్టి భర్తపై భార్య డామినేషన్ అంటూ ఎవరూ ఏమీ మాట్లాడుకోలేదు. కానీ ఇప్పుడు లాల్ సింగ్ చద్దా, ఏజెంట్ సినిమాలతో పోటీ పడి యశోద సత్తా చాటితో సమంత స్టార్ పవర్ గురించి అందరూ చర్చించుకుంటారు. మరి తన సత్తా చూపించడానికే సమంత ఇలా డేట్ ఎంచుకుందా లేక పబ్లిసిటీ కోసం తాత్కాలికంగా ఈ గిమ్మక్ ట్రై చేస్తున్నారా అన్నది చూడాలి.
This post was last modified on April 6, 2022 11:15 am
జపాన్ లో సోమవారం భారీ భూకంపం సంభవించింది. జపాన్ లోని ఉత్తర ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో కూడిన…
మొన్న ఏడాది వచ్చిన వరుణ్ తేజ్ 'మట్కా'ని సామాన్య ప్రేక్షకులు మర్చిపోయి ఉండొచ్చు కానీ అభిమానులకు మాత్రం పీడకలలా నిలిచిపోయింది.…
నిన్న కీలకమైన వీకెండ్ పూర్తయ్యింది. శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్ ఆశలన్నీ సండే మీద పెట్టుకుని ప్రమోషన్లు…
సమ్మర్ సీజన్ లో ఏప్రిల్ చివరి వారం సినిమాలకు చాలా మంచి టైం. వేసవి పీక్స్ లో ఉండటంతో పాటు…
గంధపు చెక్కల స్మగ్లర్గా.. దేశవ్యాప్తంగా ఒకప్పుడు సంచలనం రేపిన వీరప్పన్ గురించి అందరికీ తెలిసిందే. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు…
ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిన ప్రధాని నరేంద్ర మోడీ.. సమయం.. సందర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధారణ ప్రజలకు అత్యంతచేరువ…