బాలీవుడ్లోకి అడుగు పెట్టకముందే నేషనల్ క్రష్ అనే ట్యాగ్ తెచ్చుకున్న అమ్మాయి రష్మిక మందన్న. కన్నడలో కిరిక్ పార్టీ అనే చిన్న సినిమాతో ప్రస్థానం మొదలు పెట్టి… కొన్నేళ్లు తిరక్కుండానే సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగిపోయింది ఈ కర్ణాటక భామ. తెలుగులో ఛలో, గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, పుష్ప లాంటి చిత్రాలు ఘనవిజయాలు సాధించడంతో చూస్తుండగానే ఆమె రేంజ్ మారిపోయింది.
కన్నడ నుంచి తెలుగుకి.. ఇక్కడి నుంచి తమిళానికి.. ఆపై హిందీకి.. ఇలా ఒక్కో ఇండస్ట్రీలో అడుగు పెట్టి మంచి మంచి అవకాశాలు అందుకుంటూ తన రేంజ్ పెంచుకుంటోంది. ఈ ఏడాది రష్మిక ఇంకా పెద్ద రేంజికి వెళ్లబోతోందని ఆమె అందుకున్న అవకాశాలే చాటి చెబుతున్నాయి. సోమవారం రష్మిక పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె చేతిలో ఉన్న సినిమాల నుంచి, అలాగే కొత్త చిత్రాల నుంచి విషెస్తో పోస్టర్లు వచ్చాయి.
అవి చూస్తే రష్మిక క్రేజ్ ఏంటి బాబోయ్ ఇలా పెరిగిపోతోందని అంతా ఆశ్చర్యపోతున్నారు. విజయ్-వంశీ పైడిపల్లి కలయికలో దిల్ రాజు నిర్మించనున్న క్రేజీ ప్రాజెక్టులో రష్మిక హీరోయిన్ అని ముందు నుంచే ప్రచారం జరుగుతుండగా.. మంగళవారం ఈ విషయాన్ని ఒక పోస్టర్ ద్వారా ధ్రువీకరించారు. మరోవైపు ఆమె రణబీర్ కపూర్ సరసన హిందీలో ఎనిమల్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
అలాగే మిషన్ మజ్నులో సిద్దార్థ్ మల్హోత్రాతో ఓ సినిమా, అమితాబ్ బచ్చన్తో మరో మూవీ చేస్తోంది. దక్షిణాదిన పుష్ప-2తో పాటు దుల్కర్ సల్మాన్ సినిమా కూడా ఆమె చేతిలో ఉంది. తమిళంలో సూర్యకు జోడీగా ఓ చిత్రంలో నటించాల్సి ఉంది. ఇలా వివిధ భాషల్లో క్రేజీ ప్రాజెక్టులతో రష్మిక ఊపు మామూలుగా లేదు. ఇప్పుడు దేశంలో పాన్ ఇండియా అప్పీల్ ఉన్న సినిమాలు ఇన్ని చేతిలో ఉన్న హీరోయిన్ మరొకరు లేరు అంటే అతిశయోక్తి కాదు. ఈ చిత్రాలన్నీ రిలీజయ్యాక రష్మిక ఇంకో రేంజికి వెళ్లిపోతుందనడంలో సందేహం లేదు.
This post was last modified on April 6, 2022 8:58 am
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…
‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…
ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల…
మన శంకరవరప్రసాద్ గారు రూపంలో చిరంజీవికి బ్లాక్ బస్టర్ కానుక ఇచ్చి రెమ్యునరేషన్ తో పాటు రేంజ్ రోవర్ కారు…
24 ఏళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన నటి ప్రత్యూష మృతి వ్యవహారంలో సుప్రీం కోర్టు…