బాలీవుడ్లోకి అడుగు పెట్టకముందే నేషనల్ క్రష్ అనే ట్యాగ్ తెచ్చుకున్న అమ్మాయి రష్మిక మందన్న. కన్నడలో కిరిక్ పార్టీ అనే చిన్న సినిమాతో ప్రస్థానం మొదలు పెట్టి… కొన్నేళ్లు తిరక్కుండానే సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగిపోయింది ఈ కర్ణాటక భామ. తెలుగులో ఛలో, గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, పుష్ప లాంటి చిత్రాలు ఘనవిజయాలు సాధించడంతో చూస్తుండగానే ఆమె రేంజ్ మారిపోయింది.
కన్నడ నుంచి తెలుగుకి.. ఇక్కడి నుంచి తమిళానికి.. ఆపై హిందీకి.. ఇలా ఒక్కో ఇండస్ట్రీలో అడుగు పెట్టి మంచి మంచి అవకాశాలు అందుకుంటూ తన రేంజ్ పెంచుకుంటోంది. ఈ ఏడాది రష్మిక ఇంకా పెద్ద రేంజికి వెళ్లబోతోందని ఆమె అందుకున్న అవకాశాలే చాటి చెబుతున్నాయి. సోమవారం రష్మిక పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె చేతిలో ఉన్న సినిమాల నుంచి, అలాగే కొత్త చిత్రాల నుంచి విషెస్తో పోస్టర్లు వచ్చాయి.
అవి చూస్తే రష్మిక క్రేజ్ ఏంటి బాబోయ్ ఇలా పెరిగిపోతోందని అంతా ఆశ్చర్యపోతున్నారు. విజయ్-వంశీ పైడిపల్లి కలయికలో దిల్ రాజు నిర్మించనున్న క్రేజీ ప్రాజెక్టులో రష్మిక హీరోయిన్ అని ముందు నుంచే ప్రచారం జరుగుతుండగా.. మంగళవారం ఈ విషయాన్ని ఒక పోస్టర్ ద్వారా ధ్రువీకరించారు. మరోవైపు ఆమె రణబీర్ కపూర్ సరసన హిందీలో ఎనిమల్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
అలాగే మిషన్ మజ్నులో సిద్దార్థ్ మల్హోత్రాతో ఓ సినిమా, అమితాబ్ బచ్చన్తో మరో మూవీ చేస్తోంది. దక్షిణాదిన పుష్ప-2తో పాటు దుల్కర్ సల్మాన్ సినిమా కూడా ఆమె చేతిలో ఉంది. తమిళంలో సూర్యకు జోడీగా ఓ చిత్రంలో నటించాల్సి ఉంది. ఇలా వివిధ భాషల్లో క్రేజీ ప్రాజెక్టులతో రష్మిక ఊపు మామూలుగా లేదు. ఇప్పుడు దేశంలో పాన్ ఇండియా అప్పీల్ ఉన్న సినిమాలు ఇన్ని చేతిలో ఉన్న హీరోయిన్ మరొకరు లేరు అంటే అతిశయోక్తి కాదు. ఈ చిత్రాలన్నీ రిలీజయ్యాక రష్మిక ఇంకో రేంజికి వెళ్లిపోతుందనడంలో సందేహం లేదు.
తమిళ సినిమాలో దశాబ్దాల పాటు ఆధిపత్యం చలాయించిన సూపర్ స్టార్లు రజినీకాంత్. కమల్ హాసన్ వ్యక్తిగతంగా మంచి మిత్రులన్న సంగతి…
ఏపీలో ఇప్పుడు కాపు సామాజిక వర్గం కేంద్రంగా రసవత్తర రాజకీయం నడుస్తోంది. నిన్నటికి నిన్న వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు…
మా ఇంటి బంగారం కథ ముందుగా సాయిపల్లవి దగ్గరికి వెళ్లిన సంగతి సమంత స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పాక బయటికి వచ్చింది.…
స్టార్ అన్న గుర్తింపు తెచ్చుకోలేకపోయి ఉండొచ్చు కానీ.. తమిళ, తెలుగు భాషల్లో సీనియర్ నటుడు ఆనంద్కు మంచి గుర్తింపే ఉంది.…
ముంబైలో ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ యోగా డే వేడుకల్లో హీరోయిన్ శ్రీలీలకు అవమానం జరిగిందని సోషల్ మీడియాలో ఒక వీడియో…
తప్పు చేసింది కేంద్ర ప్రభుత్వం. తన తప్పును ఏమాత్రం పట్టించుకోని కేంద్రం… విద్యార్థులు చేసిన చిన్నపాటి తప్పులకూ పెద్ద శిక్షలేసింది.…