అటు ఇటుగా ఇంకో వారం రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘బీస్ట్’ సినిమా. పేరుదికి తమిళ చిత్రమే అయినా.. తమిళనాడు అవతల కూడా దీనికి మంచి క్రేజే ఉంది. తెలుగులో దిల్ రాజు లాంటి పెద్ద నిర్మాత ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాడు. గత కొన్నేళ్లలో విజయ్కి తెలుగులో ఫాలోయింగ్ బాగా పెరిగిన సంగతి తెలిసిందే. నార్త్ ఇండియాలో, అలాగే విదేశాల్లో కూడా ‘బీస్ట్’ భారీగానే రిలీజ్ కాబోతోంది. ఐతే ఈ చిత్రాన్ని కువైట్ సహా కొన్ని గల్ఫ్ దేశాల్లో నిషేధించడం గమనార్హం.
సినిమాలో ఏముందో ఏమో చూడకుండా ఇలా కొన్ని దేశాలు నిషేధించడం ఏంటి, బీస్ట్ లాంటి కమర్షియల్ సినిమాలో అంత వివాదాస్పద అంశాలు ఏముంటాయి అన్న సందేహాలు కలగడం సహజం. ఐతే ట్రైలర్ చూసే ఈ సినిమాను నిషేధించేశారు. ఈ చిత్రం హైజాకింగ్ నేపథ్యంలో నడుస్తుందన్న సంగతి తెలిసిందే. ఉగ్రవాదులు ఒక మాల్ను హైజాక్ చేస్తే.. అక్కడే ఉన్న హీరో వారి మీద ఎటాక్ చేసి అందరినీ కాపాడే క్రమంలో కథ ముందుకు సాగుతుంది.
ఐతే ముస్లింలను ఉగ్రవాదులుగా చూపించే సినిమాలను కువైట్ సహా కొన్ని గల్ఫ్ దేశాలు ప్రోత్సహించట్లేదు. ఇలాంటి చిత్రాలు ముస్లింల పట్ల ద్వేష భావాన్ని పెంచుతాయని, అలాంటి చిత్రాలను తమ దేశాల్లో ఆడనివ్వబోమని కువైట్ లాంటి ఇస్లాం దేశాలు అంటున్నాయి. ఇంతకుముందు దుల్కర్ సల్మాన్ సినిమా కురుప్, విష్ణు విశాల్ మూవీ ఎఫ్ఐఆర్లను ఆ దేశాలు నిషేధించాయి. ఇప్పుడు అదే కోవలో ‘బీస్ట్’ మీదా బ్యాన్ విధించాయి. ఈ దేశాల్లో సౌత్ సినిమాలకు మంచి ఆదరణే దక్కుతుంటుంది.
అక్కడ దక్షిణాది వారు పెద్ద సంఖ్యలోనే ఉంటారు. కాబట్టి ఇలా నిషేధం విధించడం వల్ల ఆదాయానికి గండి పడుతుంది. ఐతే ఇలాంటి కొన్ని దేశాల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతాయని కథల విషయంలో రచయితలు, దర్శకులు రాజీ పడలేరు. ‘బీస్ట్’ చిత్రాన్ని నెల్సన్ దిలీప్ కుమార్ రూపొందించగా.. సన్ పిక్చర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ నిర్మించింది. ఇందులో విజయ్ సరసన పూజా హెగ్డే నటించింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు.
This post was last modified on April 5, 2022 7:19 pm
దేశ భద్రతపై మళ్లీ శాంతిభంగం కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయని నిఘా సంస్థలు హెచ్చరించాయి. శనివారం కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు…
రెండేళ్ల క్రితం బేబీ రిలీజ్ ముందు వరకు తనెవరో పెద్దగా పరిచయం లేని పేరు. అల వైకుంఠపురములో అల్లు అర్జున్…
తమిళనాట అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ... అధికార డీఎంకేలో ఫుల్ జోష్ నింపే పరిణామం ఒకటి శనివారం జరిగింది. సుప్రీంకోర్టులో రెండేళ్లుగా…
హర్యానాలోని సోనిపట్లో ఉన్న ఓపీ జిందాల్ విశ్వవిద్యాలయంలో ఓ విద్యార్థి చేసిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది.…
మాజీ ఉప రాష్ట్రపతి, బీజేపీ నాయకుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు.. తాజాగా అటు తెలంగాణ, ఇటు ఏపీ నేతలపై సెటర్లు గుప్పించారు.…
కొన్నిసార్లు బాక్సాఫీస్ ఫలితాలు అనూహ్యంగా ఉంటాయి. టాక్ తేడాగా వచ్చినా, జనానికి పూర్తిగా నచ్చకపోయినా కలెక్షన్లు మాత్రం భీభత్సంగా వచ్చేస్తాయి.…