అటు ఇటుగా ఇంకో వారం రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘బీస్ట్’ సినిమా. పేరుదికి తమిళ చిత్రమే అయినా.. తమిళనాడు అవతల కూడా దీనికి మంచి క్రేజే ఉంది. తెలుగులో దిల్ రాజు లాంటి పెద్ద నిర్మాత ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాడు. గత కొన్నేళ్లలో విజయ్కి తెలుగులో ఫాలోయింగ్ బాగా పెరిగిన సంగతి తెలిసిందే. నార్త్ ఇండియాలో, అలాగే విదేశాల్లో కూడా ‘బీస్ట్’ భారీగానే రిలీజ్ కాబోతోంది. ఐతే ఈ చిత్రాన్ని కువైట్ సహా కొన్ని గల్ఫ్ దేశాల్లో నిషేధించడం గమనార్హం.
సినిమాలో ఏముందో ఏమో చూడకుండా ఇలా కొన్ని దేశాలు నిషేధించడం ఏంటి, బీస్ట్ లాంటి కమర్షియల్ సినిమాలో అంత వివాదాస్పద అంశాలు ఏముంటాయి అన్న సందేహాలు కలగడం సహజం. ఐతే ట్రైలర్ చూసే ఈ సినిమాను నిషేధించేశారు. ఈ చిత్రం హైజాకింగ్ నేపథ్యంలో నడుస్తుందన్న సంగతి తెలిసిందే. ఉగ్రవాదులు ఒక మాల్ను హైజాక్ చేస్తే.. అక్కడే ఉన్న హీరో వారి మీద ఎటాక్ చేసి అందరినీ కాపాడే క్రమంలో కథ ముందుకు సాగుతుంది.
ఐతే ముస్లింలను ఉగ్రవాదులుగా చూపించే సినిమాలను కువైట్ సహా కొన్ని గల్ఫ్ దేశాలు ప్రోత్సహించట్లేదు. ఇలాంటి చిత్రాలు ముస్లింల పట్ల ద్వేష భావాన్ని పెంచుతాయని, అలాంటి చిత్రాలను తమ దేశాల్లో ఆడనివ్వబోమని కువైట్ లాంటి ఇస్లాం దేశాలు అంటున్నాయి. ఇంతకుముందు దుల్కర్ సల్మాన్ సినిమా కురుప్, విష్ణు విశాల్ మూవీ ఎఫ్ఐఆర్లను ఆ దేశాలు నిషేధించాయి. ఇప్పుడు అదే కోవలో ‘బీస్ట్’ మీదా బ్యాన్ విధించాయి. ఈ దేశాల్లో సౌత్ సినిమాలకు మంచి ఆదరణే దక్కుతుంటుంది.
అక్కడ దక్షిణాది వారు పెద్ద సంఖ్యలోనే ఉంటారు. కాబట్టి ఇలా నిషేధం విధించడం వల్ల ఆదాయానికి గండి పడుతుంది. ఐతే ఇలాంటి కొన్ని దేశాల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతాయని కథల విషయంలో రచయితలు, దర్శకులు రాజీ పడలేరు. ‘బీస్ట్’ చిత్రాన్ని నెల్సన్ దిలీప్ కుమార్ రూపొందించగా.. సన్ పిక్చర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ నిర్మించింది. ఇందులో విజయ్ సరసన పూజా హెగ్డే నటించింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు.
This post was last modified on April 5, 2022 7:19 pm
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…
ఆంధ్రప్రదేశ్లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…
కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…