అటు ఇటుగా ఇంకో వారం రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘బీస్ట్’ సినిమా. పేరుదికి తమిళ చిత్రమే అయినా.. తమిళనాడు అవతల కూడా దీనికి మంచి క్రేజే ఉంది. తెలుగులో దిల్ రాజు లాంటి పెద్ద నిర్మాత ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాడు. గత కొన్నేళ్లలో విజయ్కి తెలుగులో ఫాలోయింగ్ బాగా పెరిగిన సంగతి తెలిసిందే. నార్త్ ఇండియాలో, అలాగే విదేశాల్లో కూడా ‘బీస్ట్’ భారీగానే రిలీజ్ కాబోతోంది. ఐతే ఈ చిత్రాన్ని కువైట్ సహా కొన్ని గల్ఫ్ దేశాల్లో నిషేధించడం గమనార్హం.
సినిమాలో ఏముందో ఏమో చూడకుండా ఇలా కొన్ని దేశాలు నిషేధించడం ఏంటి, బీస్ట్ లాంటి కమర్షియల్ సినిమాలో అంత వివాదాస్పద అంశాలు ఏముంటాయి అన్న సందేహాలు కలగడం సహజం. ఐతే ట్రైలర్ చూసే ఈ సినిమాను నిషేధించేశారు. ఈ చిత్రం హైజాకింగ్ నేపథ్యంలో నడుస్తుందన్న సంగతి తెలిసిందే. ఉగ్రవాదులు ఒక మాల్ను హైజాక్ చేస్తే.. అక్కడే ఉన్న హీరో వారి మీద ఎటాక్ చేసి అందరినీ కాపాడే క్రమంలో కథ ముందుకు సాగుతుంది.
ఐతే ముస్లింలను ఉగ్రవాదులుగా చూపించే సినిమాలను కువైట్ సహా కొన్ని గల్ఫ్ దేశాలు ప్రోత్సహించట్లేదు. ఇలాంటి చిత్రాలు ముస్లింల పట్ల ద్వేష భావాన్ని పెంచుతాయని, అలాంటి చిత్రాలను తమ దేశాల్లో ఆడనివ్వబోమని కువైట్ లాంటి ఇస్లాం దేశాలు అంటున్నాయి. ఇంతకుముందు దుల్కర్ సల్మాన్ సినిమా కురుప్, విష్ణు విశాల్ మూవీ ఎఫ్ఐఆర్లను ఆ దేశాలు నిషేధించాయి. ఇప్పుడు అదే కోవలో ‘బీస్ట్’ మీదా బ్యాన్ విధించాయి. ఈ దేశాల్లో సౌత్ సినిమాలకు మంచి ఆదరణే దక్కుతుంటుంది.
అక్కడ దక్షిణాది వారు పెద్ద సంఖ్యలోనే ఉంటారు. కాబట్టి ఇలా నిషేధం విధించడం వల్ల ఆదాయానికి గండి పడుతుంది. ఐతే ఇలాంటి కొన్ని దేశాల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతాయని కథల విషయంలో రచయితలు, దర్శకులు రాజీ పడలేరు. ‘బీస్ట్’ చిత్రాన్ని నెల్సన్ దిలీప్ కుమార్ రూపొందించగా.. సన్ పిక్చర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ నిర్మించింది. ఇందులో విజయ్ సరసన పూజా హెగ్డే నటించింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు.
This post was last modified on April 5, 2022 7:19 pm
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…