దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్గా, నిర్మాతగా ఎన్నో విజయాలు చూశారు. కానీ ఇప్పుడు ఆయన ఓ సినిమాతో తన కెరీర్లోనే ఎన్నడూ లేని స్థాయిలో లాభాలు అందుకుంటున్నాడు. ఆ చిత్రం ఆర్ఆర్ఆర్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పట్లో బాహుబలి-2 నైజాం హక్కుల కోసం దిల్ రాజు 50 కోట్ల దాకా పెట్టుబడి పెడితే పెద్ద రిస్క్ అన్నారు.
కానీ ఆ చిత్రం భారీగానే లాభాలు తెచ్చి పెట్టింది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ మీద ఇదే ఏరియాకు ఏకంగా రూ.75 కోట్లకు పెట్టేశారాయన. ఇది కూడా రిస్క్ అనే అన్నారు. కానీ ఆయన నమ్మకం ఫలించింది. నైజాంలో ఈ చిత్రం ఎప్పుడో బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఈ ఏరియాలో ఆ చిత్ర షేర్ రూ.100 కోట్లకు చేరువగా ఉంది.
ఇంకో పది కోట్ల షేర్ గ్యారెంటీ అంటున్నారు. అంటే మొత్తం రూ.35 కోట్ల దాకా లాభం అన్నమాట. పర్సంటేజ్ పరంగా పెట్టుబడి మీద ఎక్కువ లాభాలు వచ్చి ఉండొచ్చు కానీ.. ఒక డిస్ట్రిబ్యూటర్ ఒక ఏరియాకు రూ.35 కోట్ల లాభం అందుకోవడం మాత్రం ఇదే ప్రథమం అయి ఉండొచ్చు. అందుకే ఈ ఆనందంలో దిల్ రాజు గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశాడు ఆర్ఆర్ఆర్ టీం కోసం. ఒక నిర్మాత తన సినిమా విజయోత్సవ వేడుక చేసిన స్థాయిలో ఆయన ఈ పార్టీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు హైదరాబాద్లో.
ఆర్ఆర్ఆర్ టీం నుంచి ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో ఈ వేడుకలో పాల్గొన్నారు. హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ తమ సతీమణులతో ఈ వేడుకకు హాజరయ్యారు. దర్శకుడు రాజమౌళి కుటుంబం నుంచి చాలామందే ఈ పార్టీలో పాల్గొన్నారు. ఈ పార్టీ తాలూకు ఫొటోలు చూస్తే రాజు చాలా గ్రాండ్గానే ఈ పార్టీ ఏర్పాటు చేశాడని అర్థమవుతోంది. మరి రూ.35 కోట్ల లాభం వస్తుంటే ఈ మాత్రం గ్రాండ్నెస్ చూపించకపోతే ఎలా?
This post was last modified on April 5, 2022 9:49 am
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…