దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్గా, నిర్మాతగా ఎన్నో విజయాలు చూశారు. కానీ ఇప్పుడు ఆయన ఓ సినిమాతో తన కెరీర్లోనే ఎన్నడూ లేని స్థాయిలో లాభాలు అందుకుంటున్నాడు. ఆ చిత్రం ఆర్ఆర్ఆర్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పట్లో బాహుబలి-2 నైజాం హక్కుల కోసం దిల్ రాజు 50 కోట్ల దాకా పెట్టుబడి పెడితే పెద్ద రిస్క్ అన్నారు.
కానీ ఆ చిత్రం భారీగానే లాభాలు తెచ్చి పెట్టింది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ మీద ఇదే ఏరియాకు ఏకంగా రూ.75 కోట్లకు పెట్టేశారాయన. ఇది కూడా రిస్క్ అనే అన్నారు. కానీ ఆయన నమ్మకం ఫలించింది. నైజాంలో ఈ చిత్రం ఎప్పుడో బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఈ ఏరియాలో ఆ చిత్ర షేర్ రూ.100 కోట్లకు చేరువగా ఉంది.
ఇంకో పది కోట్ల షేర్ గ్యారెంటీ అంటున్నారు. అంటే మొత్తం రూ.35 కోట్ల దాకా లాభం అన్నమాట. పర్సంటేజ్ పరంగా పెట్టుబడి మీద ఎక్కువ లాభాలు వచ్చి ఉండొచ్చు కానీ.. ఒక డిస్ట్రిబ్యూటర్ ఒక ఏరియాకు రూ.35 కోట్ల లాభం అందుకోవడం మాత్రం ఇదే ప్రథమం అయి ఉండొచ్చు. అందుకే ఈ ఆనందంలో దిల్ రాజు గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశాడు ఆర్ఆర్ఆర్ టీం కోసం. ఒక నిర్మాత తన సినిమా విజయోత్సవ వేడుక చేసిన స్థాయిలో ఆయన ఈ పార్టీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు హైదరాబాద్లో.
ఆర్ఆర్ఆర్ టీం నుంచి ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో ఈ వేడుకలో పాల్గొన్నారు. హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ తమ సతీమణులతో ఈ వేడుకకు హాజరయ్యారు. దర్శకుడు రాజమౌళి కుటుంబం నుంచి చాలామందే ఈ పార్టీలో పాల్గొన్నారు. ఈ పార్టీ తాలూకు ఫొటోలు చూస్తే రాజు చాలా గ్రాండ్గానే ఈ పార్టీ ఏర్పాటు చేశాడని అర్థమవుతోంది. మరి రూ.35 కోట్ల లాభం వస్తుంటే ఈ మాత్రం గ్రాండ్నెస్ చూపించకపోతే ఎలా?
This post was last modified on April 5, 2022 9:49 am
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…