ప్రస్తుతం సౌత్ ఇండియాలో అత్యధిక టికెట్ల రేట్లు ఉన్నది తెలంగాణలోనే. సింగిల్ స్క్రీన్లలో రూ.150, మల్టీప్లెక్సుల్లో మినిమం రూ.200 నుంచి రేటు మొదలవుతోంది. ఐతే ఈ రేట్లకే ఎక్కువ అని ప్రేక్షకులు ఫీలవుతున్నారు. అలాంటిది కాస్త క్రేజున్న సినిమా రిలీజైతే రేట్లు ఇంకా పెంచేస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకైతే సింగిల్ స్క్రీన్లలో ఆన్ లైన్ టికెట్ రేటు రూ.260 (ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జీలతో కలిపి) నుంచి మొదలైంది. మల్టీప్లెక్సుల్లో రేటు గరిష్టంగా 500 దాకా వెళ్లిపోయింది.
300-400కి కొన్ని ఓటీటీలు ఏడాది సబ్స్క్రిప్షన్ ఇస్తుంటే.. ఇలా రేట్లు పెంచుకుంటూ పోతే ఫ్యామిలీ ఆడియన్స్ ఎలా థియేటర్లకు వస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అలాగే రిపీట్ ఆడియన్స్ కూడా తగ్గిపోతారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐతే ‘ఆర్ఆర్ఆర్’ సినిమా స్థాయి వేరు. దానికున్న క్రేజ్ దృష్ట్యా అంతేసి రేట్లు పెట్టినా జనం బాగానే థియేటర్లకు వెళ్లి సినిమా చూశారు.
కానీ దాంతో వేరే సినిమాలు పోల్చుకుని ఆశపడితే మొదటికే మోసం రావచ్చు. చిన్న, మీడియం రేంజ్ సినిమాలకు సాధారణ రేట్లతో కూడా ఆడటం కష్టంగా ఉంది. గత వీకెండ్లో రిలీజైన ‘మిషన్ ఇంపాజిబుల్’ చిత్రానికి కనీస స్థాయిలో కూడా ఆదరణ దక్కలేదు. ఇక ఈ వారం రిలీజవుతున్న ‘గని’ సినిమాకు ఓమాదిరిగా క్రేజ్ ఉంది. దీనికి సాధారణ రేట్లు పెడితే వర్కవుట్ కావచ్చు. కానీ ‘ఆర్ఆర్ఆర్’ ఇరగాడేస్తుండటం చూసి దీని మేకర్స్కు ఆశ పుట్టినట్లుంది. అందుకే టికెట్ల రేట్లు పెంచుకున్నారు. సింగిల్ స్క్రీన్లలో టికెట్ రేటు రూ.175 నుంచి మొదలవుతుండగా.. మల్టీప్లెక్సుల్లో రూ.295గా రేట్ ఫిక్స్ చేశారు.
ఆన్ లైన్లో టికెట్ బుక్ చేస్తే రూ.200, 330 దాకా ఉంటోంది రేటు. మరి ఇంత రేటు పెట్టి ఇలాంటి మీడియం రేంజ్ సినిమా చూడటానికి సగటు సినీ ప్రేక్షకులు ఏమేర ఆసక్తి చూపిస్తారన్నది ప్రశ్నార్థకం. అసలు ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఇంత రేటు పెట్టి ఈ సినిమా చూడటం సందేహమే. ఒక రకంగా చెప్పాలంటే ఈ రేట్లు పెట్టడం అంటే కొరివితో తల గోక్కోవడమే. ‘ఆర్ఆర్ఆర్’కు అసాధారణంగా రేట్లు పెంచినపుడే ఈ పరిణామం టాలీవుడ్కు చేటు చేస్తుందన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు ఆ సందేహాలే నిజమయ్యేట్లున్నాయి.
This post was last modified on April 4, 2022 1:02 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…