‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ మీద అభిమానులు పెట్టుకున్న భారీ అంచనాలు తలకిందులయ్యాయి. సాహో, రాధేశ్యామ్ ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్ అయ్యాయి. ‘సాహో’ అయినా యాక్షన్ మూవీ కాబట్టి మంచి హైప్ వచ్చింది. ఓపెనింగ్స్ కుమ్మేసింది. కానీ ‘రాధేశ్యామ్’కు అదీ లేకపోయింది. తెలుగు రాష్ట్రాల వరకే ఆ చిత్రం ఓ మోస్తరుగా వసూళ్లు రాబట్టింది. మిగతా ప్రాంతాలన్నింట్లో సినిమాకు ఓపెనింగ్స్ కూడా సరిగా లేవు.
ఓవరాల్గా ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యధిక నష్టాలు తెచ్చిపెట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. సాహో, రాధేశ్యామ్ రెండు చిత్రాల్లోనూ ప్రభాస్ అభిమానుల అంచనాలకు తగ్గట్లు కనిపించలేదు. ముఖ్యంగా అతడి లుక్స్ తేడా కొట్టాయి. ‘బాహుబలి’లో అంత అందంగా కనిపించిన అతను.. ఈ సినిమాలకు వచ్చేసరికి ఎందుకిలా తయారయ్యాడు.. అంత కష్టపడ్డాక రిలాక్స్ అయిపోయాడా.. లుక్స్ మీద కనీసం కేర్ తీసుకోలేకపోయాడా అన్న ప్రశ్నలు తలెత్తాయి.
ఐతే ప్రభాస్ నుంచి రాబోతున్న తర్వాతి సినిమా ‘ఆదిపురుష్’లో మాత్రం అతడి లుక్స్ విషయంలో ఫ్యాన్స్ కంగారు పడాల్సిన పని లేదని తెలుస్తోంది. ఆ చిత్ర దర్శకుడు ఓం రౌత్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమాకు బెస్ట్ షేప్లోకి రావడానికి ప్రభాస్ పడ్డ కష్టం గురించి మాట్లాడాడు. రాముడి పాత్రలో పర్ఫెక్ట్ అనిపించడం కోసం ఒక ఆర్చర్ తరహాలో ‘వి’ షేప్లోకి రావడానికి ప్రభాస్ కష్టపడ్డాడని.. సన్నని నడుము, వెడల్పాటి భుజాలు తయారు కావడానికి జిమ్లో విపరీతంగా కష్టపడ్డాడని.. ఈ సినిమాలో ప్రభాస్ బెస్ట్ ఫిజిక్, షేప్తో కనిపిస్తాడని ఓం రౌత్ అన్నాడు.
ప్రభాస్ కళ్లు కూడా ఇందులో చాలా షార్ప్గా కనిపిస్తాయని, పాత్ర తాలూకు ఇంటెన్సిటీని అవి చూపిస్తాయని.. ఇక ‘ఆదిపురుష్’ హిందీ డబ్బింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉండేలా ప్రభాస్ చాలా రోజుల పాటు ట్రైనింగ్ తీసుకున్నాడని.. ఇలా ప్రతి విషయంలోనూ పభాస్ నుంచి ఈ చిత్రంలో పర్ఫెక్షన్ చూడొచ్చని ధీమా వ్యక్తం చేశాడు ఓం రౌత్. ‘ఆదిపురుష్’ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on April 4, 2022 8:03 am
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.…