‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ మీద అభిమానులు పెట్టుకున్న భారీ అంచనాలు తలకిందులయ్యాయి. సాహో, రాధేశ్యామ్ ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్ అయ్యాయి. ‘సాహో’ అయినా యాక్షన్ మూవీ కాబట్టి మంచి హైప్ వచ్చింది. ఓపెనింగ్స్ కుమ్మేసింది. కానీ ‘రాధేశ్యామ్’కు అదీ లేకపోయింది. తెలుగు రాష్ట్రాల వరకే ఆ చిత్రం ఓ మోస్తరుగా వసూళ్లు రాబట్టింది. మిగతా ప్రాంతాలన్నింట్లో సినిమాకు ఓపెనింగ్స్ కూడా సరిగా లేవు.
ఓవరాల్గా ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యధిక నష్టాలు తెచ్చిపెట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. సాహో, రాధేశ్యామ్ రెండు చిత్రాల్లోనూ ప్రభాస్ అభిమానుల అంచనాలకు తగ్గట్లు కనిపించలేదు. ముఖ్యంగా అతడి లుక్స్ తేడా కొట్టాయి. ‘బాహుబలి’లో అంత అందంగా కనిపించిన అతను.. ఈ సినిమాలకు వచ్చేసరికి ఎందుకిలా తయారయ్యాడు.. అంత కష్టపడ్డాక రిలాక్స్ అయిపోయాడా.. లుక్స్ మీద కనీసం కేర్ తీసుకోలేకపోయాడా అన్న ప్రశ్నలు తలెత్తాయి.
ఐతే ప్రభాస్ నుంచి రాబోతున్న తర్వాతి సినిమా ‘ఆదిపురుష్’లో మాత్రం అతడి లుక్స్ విషయంలో ఫ్యాన్స్ కంగారు పడాల్సిన పని లేదని తెలుస్తోంది. ఆ చిత్ర దర్శకుడు ఓం రౌత్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమాకు బెస్ట్ షేప్లోకి రావడానికి ప్రభాస్ పడ్డ కష్టం గురించి మాట్లాడాడు. రాముడి పాత్రలో పర్ఫెక్ట్ అనిపించడం కోసం ఒక ఆర్చర్ తరహాలో ‘వి’ షేప్లోకి రావడానికి ప్రభాస్ కష్టపడ్డాడని.. సన్నని నడుము, వెడల్పాటి భుజాలు తయారు కావడానికి జిమ్లో విపరీతంగా కష్టపడ్డాడని.. ఈ సినిమాలో ప్రభాస్ బెస్ట్ ఫిజిక్, షేప్తో కనిపిస్తాడని ఓం రౌత్ అన్నాడు.
ప్రభాస్ కళ్లు కూడా ఇందులో చాలా షార్ప్గా కనిపిస్తాయని, పాత్ర తాలూకు ఇంటెన్సిటీని అవి చూపిస్తాయని.. ఇక ‘ఆదిపురుష్’ హిందీ డబ్బింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉండేలా ప్రభాస్ చాలా రోజుల పాటు ట్రైనింగ్ తీసుకున్నాడని.. ఇలా ప్రతి విషయంలోనూ పభాస్ నుంచి ఈ చిత్రంలో పర్ఫెక్షన్ చూడొచ్చని ధీమా వ్యక్తం చేశాడు ఓం రౌత్. ‘ఆదిపురుష్’ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on April 4, 2022 8:03 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…