‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ మీద అభిమానులు పెట్టుకున్న భారీ అంచనాలు తలకిందులయ్యాయి. సాహో, రాధేశ్యామ్ ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్ అయ్యాయి. ‘సాహో’ అయినా యాక్షన్ మూవీ కాబట్టి మంచి హైప్ వచ్చింది. ఓపెనింగ్స్ కుమ్మేసింది. కానీ ‘రాధేశ్యామ్’కు అదీ లేకపోయింది. తెలుగు రాష్ట్రాల వరకే ఆ చిత్రం ఓ మోస్తరుగా వసూళ్లు రాబట్టింది. మిగతా ప్రాంతాలన్నింట్లో సినిమాకు ఓపెనింగ్స్ కూడా సరిగా లేవు.
ఓవరాల్గా ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యధిక నష్టాలు తెచ్చిపెట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. సాహో, రాధేశ్యామ్ రెండు చిత్రాల్లోనూ ప్రభాస్ అభిమానుల అంచనాలకు తగ్గట్లు కనిపించలేదు. ముఖ్యంగా అతడి లుక్స్ తేడా కొట్టాయి. ‘బాహుబలి’లో అంత అందంగా కనిపించిన అతను.. ఈ సినిమాలకు వచ్చేసరికి ఎందుకిలా తయారయ్యాడు.. అంత కష్టపడ్డాక రిలాక్స్ అయిపోయాడా.. లుక్స్ మీద కనీసం కేర్ తీసుకోలేకపోయాడా అన్న ప్రశ్నలు తలెత్తాయి.
ఐతే ప్రభాస్ నుంచి రాబోతున్న తర్వాతి సినిమా ‘ఆదిపురుష్’లో మాత్రం అతడి లుక్స్ విషయంలో ఫ్యాన్స్ కంగారు పడాల్సిన పని లేదని తెలుస్తోంది. ఆ చిత్ర దర్శకుడు ఓం రౌత్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమాకు బెస్ట్ షేప్లోకి రావడానికి ప్రభాస్ పడ్డ కష్టం గురించి మాట్లాడాడు. రాముడి పాత్రలో పర్ఫెక్ట్ అనిపించడం కోసం ఒక ఆర్చర్ తరహాలో ‘వి’ షేప్లోకి రావడానికి ప్రభాస్ కష్టపడ్డాడని.. సన్నని నడుము, వెడల్పాటి భుజాలు తయారు కావడానికి జిమ్లో విపరీతంగా కష్టపడ్డాడని.. ఈ సినిమాలో ప్రభాస్ బెస్ట్ ఫిజిక్, షేప్తో కనిపిస్తాడని ఓం రౌత్ అన్నాడు.
ప్రభాస్ కళ్లు కూడా ఇందులో చాలా షార్ప్గా కనిపిస్తాయని, పాత్ర తాలూకు ఇంటెన్సిటీని అవి చూపిస్తాయని.. ఇక ‘ఆదిపురుష్’ హిందీ డబ్బింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉండేలా ప్రభాస్ చాలా రోజుల పాటు ట్రైనింగ్ తీసుకున్నాడని.. ఇలా ప్రతి విషయంలోనూ పభాస్ నుంచి ఈ చిత్రంలో పర్ఫెక్షన్ చూడొచ్చని ధీమా వ్యక్తం చేశాడు ఓం రౌత్. ‘ఆదిపురుష్’ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on April 4, 2022 8:03 am
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…