రెండు దశాబ్దాలు వెనక్కి వెళ్తే ఓ తెలుగు సినిమా అమెరికాలో రిలీజవడమే గగనంగా ఉండేది. అలాంటిది ఐదేళ్ల కిందట వచ్చిన ‘బాహుబలి: ది కంక్లూజన్’ ఏకంగా అక్కడ 20 మిలియన్ డాలర్లు కొల్లగొట్టి ఔరా అనిపించింది. బాహుబలి-2 వివిధ భాషల్లో కలిపి ఆ మార్కును అందుకున్నప్పటికీ బేసిగ్గా అది తెలుగు సినిమా కావడం మనకు గర్వకారణం. అంతకముందు, ఆ తర్వాత మరే సినిమా కూడా 20 మిలియన్ల మార్కును అందుకోలేదు.
‘బాహుబలి’ ఫీట్ను రిపీట్ చేయడం ఇప్పట్లో సాధ్యమయ్యేలా లేదు. ఏ సినిమా మీదా అలాంటి అంచనాలు కూడా కలగట్లేదు. ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి నుంచి వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’కు యుఎస్లో మరీ హైప్ ఏమీ లేకపోవడంతో పది మిలియన్ల క్లబ్బులో చేరుతుందా అన్న సందేహాలు కూడా కలిగాయి. ఐతే ఈ చిత్రం ఆ ఘనతను అందుకుంది. యుఎస్లో 10 మిలియన్ డాలర్ల క్లబ్బులో చేరిన అరుదైన భారతీయ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
సోమవారం నాటికే 9.9 మిలియన్ డాలర్లు కొల్లగొట్టిన ‘ఆర్ఆర్ఆర్’.. మంగళవారానికి జరిగిన ప్రి సేల్స్తోనే 10 మిలియన్ క్లబ్బులోకి అడుగు పెట్టేసింది. మంగళవారం ఆఫర్ల కారణంగా సోమవారం కంటే తర్వాతి రోజు యుఎస్ వసూళ్లు ఎక్కువ ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రం యుఎస్లో బ్రేక్ ఈవెన్కు చేరువగా ఉంది. రాబోయే వీకెండ్లో పోటీ లేని నేపథ్యంలో ఇంకా వసూళ్లు పెరగడం ఖాయం. ఫుల్ రన్లో ఈ చిత్రం దాదాపు 13 మిలియన్ల మధ్య కలెక్ట్ చేయొచ్చని అంచనా వేస్తున్నారు.
యుఎస్లో 10 మిలియన్ల మార్కును అందుకున్న ఐదో ఇండియన్ సినిమా ఇది. బాహుబలి-2 అక్కడ 20.5 మిలియన్ డాలర్లు రాబడితే.. హిందీ చిత్రాలు దంగల్ 12.39 మిలియన్లు, పద్మావత్ 12.16 మిలియన్లు, పీకే 10.6 మిలియన్లు వసూలు చేశాయి. ఇప్పుడు ఈ క్లబ్బులోకి ‘ఆర్ఆర్ఆర్’ కూడా చేరింది. మరి మూడు హిందీ చిత్రాలను దాటి బాహుబలి తర్వాత, రెండో స్థానానికి ‘ఆర్ఆర్ఆర్’ చేరుతుందేమో చూడాలి.
This post was last modified on March 30, 2022 2:19 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…