ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న కలల కాంబినేషన్కు రంగం సిద్ధమవుతోంది. దర్శక ధీరుడు రాజమౌళితో సూపర్ స్టార్ మహేష్ బాబు జట్టు కట్టబోతున్నాడు. ఆర్ఆర్ఆర్ కథ ముగియడంతో త్వరలోనే జక్కన్న.. మహేష్ సినిమా పనిలో నిమగ్నం కాబోతున్నాడు. ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లడానికి అటు ఇటుగా ఇంకో ఏడాది సమయమైనా పట్టొచ్చు. ఈలోపు సర్కారు వారి పాటతో పాటు త్రివిక్రమ్ సినిమాను కూడా మహేష్ పూర్తి చేయనున్నాడు.
ఐతే రాజమౌళి సినిమా అంటే మిగతా చిత్రాల తరహాలో పని చేస్తే కుదరదు. అసలు ప్రిపరేషనే చాలా గట్టిగా ఉంటుంది. అవతారం మార్చుకోవాలి. ఫిజిక్ పెంచాలి. పాత్ర కోసం వర్క్ షాపుల్లో పాల్గొనాలి. ఇంకా చాలా తతంగం ఉంటుంది. శారీరకంగా, మానసికంగా చాలా కష్టమే ఉంటుంది. బాహుబలి కోసం ప్రభాస్.. ఆర్ఆర్ఆర్ కోసం తారక్, చరణ్ ఎంత కష్టపడ్డారో అందరికీ తెలిసిందే.
ఆ కష్టం గురించి ఇంటర్వ్యూల్లో చెబుతుంటే వినేవాళ్లకు వామ్మో అనిపించింది. తాను కోరుకునే ఔట్ పుట్ రావాలంటే అంత కష్టపడక తప్పదన్నది జక్కన్న అభిప్రాయం. షూటింగ్కు ముందు ప్రిపరేషన్, కెరీర్లోనే అత్యధిక వర్కింగ్ డేస్, ఇబ్బందికర వాతావరణ పరిస్థితుల్లో ఔట్ డోర్ షూటింగ్స్.. ఇవన్నీ జక్కన్న సినిమాలకు కామన్. మరే సినిమాకూ లేనన్ని టేక్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఏ కంప్లైంట్స్ లేకుండా తనకు సరెండర్ అయ్యేవారితోనే జక్కన్న సినిమాలు చేస్తాడు.
లొంగని వాళ్లను కూడా లొంగదీసుకుంటాడు. ఐతే మిగతా హీరోల మాదిరి మహేష్ ఎక్కువ కష్టపడటానికి ఇష్టపడడనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. ఒక్క 1 నేనొక్కడినేకు మినహాయిస్తే మహేష్ శారీరకంగా బాగా కష్టపడ్డ సినిమాలు గత దశాబ్ద కాలంలో కనిపించవు. సుకుమార్తో రెండో సినిమా చేయాల్సి వచ్చినపుడు మేకోవర్ కోసం, అలాగే షూటింగ్ పరంగా చాలా కష్టం ఉండటం కూడా ఆ చిత్రాన్ని వదులుకోవడానికి ఓ కారణమన్న టాక్ నడిచింది. వేరే దర్శకులు మహేష్ ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండా, కాస్త సుకుమారంగానే చూసుకుంటారని అంటుంటారు ఇండస్ట్రీ జనాలు. ఈ నేపథ్యంలో ప్రభాస్, తారక్, చరణ్ల మాదిరి ఒళ్లు హూనం చేసుకుని రాజమౌళి సినిమాకు మహేష్ కష్టపడతాడా.. అతణ్ని జక్కన్న అంత కష్టపెట్టిస్తాడా అన్నది చూడాలి మరి.
This post was last modified on March 29, 2022 1:22 pm
వరస ఫ్లాపులతో ఉక్కిరిబిక్కిరవుతున్న టైంలో రవితేజకు ఇరుముడి పెద్ద రిలీఫ్ ఇచ్చింది. విజయం ఊహించిందే కానీ మరీ రికార్డులు బద్దలు…
తెలుగు దర్శకుల్లో కొందరు మాత్రమే ఒక జనరేషన్ ని ప్రభావితం చేసే స్థాయిలో సినిమాలు తీస్తారు. ముఖ్యంగా కెరీర్ ప్రారంభంలో…
ఏ పార్టీ అయినా.. తీసుకునే నిర్ణయాలు.. చేసే ప్రకటనల విషయంలో ఆచి తూచి వ్యవహరించాలి. సమయం వచ్చిందనో.. సందర్భం చిక్కిందనో…
త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలను పూర్తిస్థాయిలో బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ఎన్నికల సంఘం కూడా…
తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ కుటుంబం సృష్టించిన దుమారం ఇంకా కొనసాగుతుంది. పరకాల సీటు విషయంలో…
సోషల్ మీడియాలో వైరల్ కావాలనే ఆలోచనతో యువత చేస్తున్న కొన్ని ప్రయత్నాలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. జార్ఖండ్లో రీల్ తీసుకునేందుకు…