ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలకు ముందు తెలుగు రాష్ట్రాల్లో హైప్ కోరుకున్న దాని కంటే ఎక్కువే వచ్చింది. అసలే రాజమౌళి సినిమా.. పైగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి ఇద్దరు సూపర్ స్టార్ల క్రేజీ కాంబినేషన్లో సినిమా అంటే హైప్ రాకుండా ఎలా ఉంటుంది. కానీ తారక్, చరణ్ తెలుగు రాష్ట్రాల అవతల.. ముఖ్యంగా నార్త్ ఇండియాలో మరీ ఫేమస్ ఏమీ కాదు.
మరోవైపేమో బాహుబలితో పోలిస్తే ఆర్ఆర్ఆర్ అంతగా ఉత్తరాది ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేకపోయింది. అన్నింటికీ మించి అక్కడ రెండు వారాల నుంచి కశ్మీర్ ఫైల్స్ ప్రభంజనం సాగిస్తుండటంతో ఆర్ఆర్ఆర్ను అంతా లైట్ తీసుకున్నట్లే కనిపించారు. అడ్వాన్స్ బుకింగ్స్ మరీ డల్లుగా కనిపించాయి. తొలి రోజు హౌస్ ఫుల్స్ సంగతి అలా ఉంటే.. సగమైనా థియేటర్లు నిండుతాయా అని సందేహాలు కలిగాయి. చాలామంది ట్రేడ్ పండిట్లు ఆర్ఆర్ఆర్తో రాజమౌళి మ్యాజిక్ రిపీట్ చేయలేకపోతున్నాడని, కనీసం ప్రభాస్ మూవీ సాహో స్థాయిలో కూడా హైప్ లేదని తేలిక చేసి మాట్లాడారు ఆర్ఆర్ఆర్ గురించి.
కానీ తొలి రోజే ఈ వ్యాఖ్యానాలకు సమాధానం వచ్చేసింది ఆర్ఆర్ఆర్ నుంచి. రిలీజ్ రోజు మధ్యాహ్నం నుంచే అక్కడ కలెక్షన్లు పుంజుకున్నాయి. ట్రేడ్ పండిట్ల అంచనాలకు కాస్త మించే రూ.19 కోట్ల దాకా తొలి రోజు గ్రాస్ వసూళ్లు రాబట్టిందా సినిమా. ఇక ఈ సినిమా సత్తా ఏంటన్నది రెండో రోజు నుంచి అందరికీ తెలిసొచ్చింది. ఉత్తరాదిన మాస్ ఏరియాల్లో ఆర్ఆర్ఆర్ శని, ఆదివారాల్లో వసూళ్ల మోత మోగించింది. తొలి రోజును మించి రెండో రోజు, రెండో రోజును మించి మూడో రోజు హిందీ వెర్షన్ వసూళ్లు రాబట్టడం విశేషం.
శనివారం వసూళ్లు రూ.24 కోట్లు కాగా.. ఆదివారం కలెక్షన్లు ఇంకా పెరిగి రూ.31.5 కోట్లకు చేరుకున్నాయి. తొలి రోజు కన్నా రెండో రోజు వసూళ్లు 60 శాతం ఎక్కువ ఉండటం ఆర్ఆర్ఆర్ ఏ స్థాయిలో జనాల్లోకి వెళ్లిపోయిందో చెప్పడానికి నిదర్శనం. గత రెండేళ్ల వ్యవధిలో హిందీలో ఓ సినిమా సాధించిన అత్యధిక ఒక రోజు వసూళ్ల రికార్డును ఆర్ఆర్ఆర్ సొంతం చేసుకోవడం విశేషం. సూర్యవంశీ 27 కోట్లతో సాధించిన రికార్డును ఆర్ఆర్ఆర్ బద్దలు కొట్టేసింది.
This post was last modified on March 29, 2022 6:56 am
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…