కొన్నేళ్ల నుంచి తమిళ స్టార్ హీరో సూర్య కెరీర్ ఒడుదొడుకులతో సాగుతోంది. థియేట్రికల్ రిలీజ్తో సూర్య హిట్ కొట్టి చాలా కాలం అవుతోంది. కరోనా టైంలో అతడి రెండు చిత్రాలు ఓటీటీ ద్వారా రిలీజయ్యాయి. అవే.. ఆకాశం నీ హద్దురా, జై భీమ్. ఈ రెంటికీ అద్భుతమైన స్పందన వచ్చింది. కానీ ఓటీటీ రిలీజ్ కావడం వల్ల అవి బాక్సాఫీస్ సక్సెస్లుగా చెప్పుకోలేని పరిస్థితి. ఈ మధ్యే ‘ఈటి’ సినిమాతో మళ్లీ సూర్య థియేటర్ల ద్వారా ప్రేక్షకులను పలకరించాడు.
అతడికిక్కడ పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఈ సినిమా ఫ్లాప్గా నిలిచింది. తమిళనాట ఓపెనింగ్స్ వరకు పర్లేదు కానీ.. తర్వాత తేలిపోయింది. తెలుగులో అయితే ఈ సినిమా డిజాస్టరే. ఐతే ఈ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా క్రేజీ చిత్రాలను లైన్లో పెడుతున్నాడు సూర్య. ప్రస్తుతం తమిళంలో టాప్ డైరెక్టర్లలో ఒకడైన వెట్రిమారన్తో సూర్య చేయబోతున్న ‘వడివాసల్’ ఇటీవలే ప్రారంభోత్సవం జరుపుకుంది.
ఇప్పుడు సూర్య ఇంకో ఆసక్తికర చిత్రాన్ని ప్రకటించాడు. లెజెండరీ డైరెక్టర్ బాలతో అతడి కొత్త సినిమా రాబోతోంది. వీరి కలయికపై భారీ అంచనాలే ఉన్నాయి. విక్రమ్ లాగే సూర్యకు కూడా కెరీర్ ఆరంభంలో బ్రేక్ ఇచ్చిన ఘనత బాలదే. సూర్యతో అతను చేసిన నంద, పితామగన్ (శివపుత్రుడు) గొప్ప విజయం సాధించాయి. ‘పితామగన్’లో విక్రమే ఎక్కువ హైలైట్ అయినప్పటికీ.. సూర్యకు కూడా తక్కువ పేరు రాలేదు. ఆ తర్వాత ఇద్దరి కలయికలో సినిమా రాలేదు.
గత కొన్నేళ్లలో బాల నుంచి సరైన సినిమా రాక ఆయన స్థాయి తగ్గింది. ఇలాంటి టైంలో బాలతో సినిమా చేయడానికి సూర్య రెడీ అయ్యాడు. ఇందులో కథానాయికగా నటించబోయేది టాలీవుడ్ హీరోయిన్ కృతి శెట్టి కావడం విశేషం. ఈ విషయాన్ని అధికారికంగానే ప్రకటించారు. ‘ఉప్పెన’, ‘శ్యామ్ సింగరాయ్’, ‘బంగార్రాజు’ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్లు కొట్టిన కృతికి తమిళంలో ఇదే తొలి సినిమా. హీరోలతో పాటు హీరోయిన్లనూ డీగ్లామరస్గా చూపించే బాల.. కృతికి ఎలాంటి పాత్ర ఆఫర్ చేశాడో.. ఆమెను ఎలా చూపిస్తాడో ఏమో మరి.
This post was last modified on March 28, 2022 6:51 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…