దివంగత రాజకీయ నాయకులు భూమా శోభ, నాగిరెడ్డి దంపతుల తనయగా రాజకీయాల్లో ముద్ర వేసిన భూమా అఖిల ప్రియ ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా కోర్టు కేసులు, వివాదాలు ఇలా ఆమె ఏదో ఒక సమస్యలో చిక్కుకుంటూనే ఉన్నారు. మరోవైపు భూమా కుటుంబంతోనే విభేదాలు కొనసాగిస్తున్నారు. దీంతో భూమా కుటుంబం, వారి బంధువర్గం ఇప్పుడు అఖిల ప్రియను పూర్తిగా పక్కనపెట్టారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ఇటీవల పరిణామాలు చూస్తుంటే అది నిజమనే అభిప్రాయాలు కలుగుతున్నాయి. ఆళ్లగడ్డలో భూమా శోభ, నాగిరెడ్డి దంపతుల విగ్రహాలను ఇటీవల ఏర్పాటు చేశారు. భూమా కుటుంబ సభ్యుడు, ఆ నియోజకవర్గ ఇంఛార్జీ భూమా కిషోర్రెడ్డి తన సొంత స్థలంలో ఆ విగ్రహాలు ఏర్పాటు చేశారు. వీటి ఆవిష్కరణకు మాజీ మంత్రి అఖిల ప్రియకు తప్ప భూమా కుటుంబంలో అందరికీ ఆహ్వానాలు వెళ్లాయి.
కానీ దీన్ని జీర్ణించుకోలేక పోయిన అఖిల ప్రియ పిలవకపోయిన ఆ కార్యక్రమానికి వెళ్లారు. కిషోర్రెడ్డి కంటే ముందే వెళ్లి విగ్రహాలను ఆవిష్కరించారని తెలిసింది. దీంతో అఖిలప్రియను భూమా కుటుంబం పూర్తిగా బహిష్కరించారని సమాచారం. హైదరాబాద్లో ఇటీవల బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కుమారుడి నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు అఖిల ప్రియ, ఆమె తమ్ముడు జగత్విఖ్యాత్లకు తప్ప మిగతా వాళ్లందరికీ ఆహ్వానాలు వెళ్లాయి.
భూమా కుటుంబానికి అత్యంత సమీప బంధువు కాటసాని రామిరెడ్డి అఖిల ప్రియను పిలవకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాటసాని రామిరెడ్డి కుమార్తెకు నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డితో వివాహం జరిగింది. భూమా బ్రహ్మానందరెడ్డికి అఖిల ప్రియ చెల్లెలయ్యే విషయం తెలిసిందే. మరోవైపు భూమా నాగిరెడ్డి ఆత్మీయుడైన ఏవీ సుబ్బారెడ్డి కుమార్తె జస్వితరెడ్డి నిశ్చితార్థ వేడుక కూడా అఖిల ప్రియకు ఆహ్వానం అందలేదు. దీంతో ఆమెను కుటుంబం, ఆత్మీయులు పూర్తిగా దూరం పెట్టారనే విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
This post was last modified on March 28, 2022 7:42 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…