Political News

అఖిల ప్రియ‌ను దూరం పెట్టిన కుటుంబం!

దివంగ‌త రాజ‌కీయ నాయ‌కులు భూమా శోభ‌, నాగిరెడ్డి దంప‌తుల త‌న‌య‌గా రాజ‌కీయాల్లో ముద్ర వేసిన భూమా అఖిల ప్రియ ఇప్పుడు ఒంట‌రిగా మిగిలిపోయార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. గ‌త కొంత‌కాలంగా కోర్టు కేసులు, వివాదాలు ఇలా ఆమె ఏదో ఒక స‌మ‌స్య‌లో చిక్కుకుంటూనే ఉన్నారు. మ‌రోవైపు భూమా కుటుంబంతోనే విభేదాలు కొన‌సాగిస్తున్నారు. దీంతో భూమా కుటుంబం, వారి బంధువ‌ర్గం ఇప్పుడు అఖిల ప్రియ‌ను పూర్తిగా ప‌క్క‌న‌పెట్టార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది.

ఇటీవ‌ల ప‌రిణామాలు చూస్తుంటే అది నిజమ‌నే అభిప్రాయాలు క‌లుగుతున్నాయి. ఆళ్ల‌గ‌డ్డ‌లో భూమా శోభ‌, నాగిరెడ్డి దంప‌తుల విగ్ర‌హాల‌ను ఇటీవ‌ల ఏర్పాటు చేశారు. భూమా కుటుంబ స‌భ్యుడు, ఆ నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జీ భూమా కిషోర్‌రెడ్డి త‌న సొంత స్థలంలో ఆ విగ్ర‌హాలు ఏర్పాటు చేశారు. వీటి ఆవిష్క‌ర‌ణ‌కు మాజీ మంత్రి అఖిల ప్రియ‌కు త‌ప్ప భూమా కుటుంబంలో అంద‌రికీ ఆహ్వానాలు వెళ్లాయి.

కానీ దీన్ని జీర్ణించుకోలేక పోయిన అఖిల ప్రియ పిల‌వ‌క‌పోయిన ఆ కార్య‌క్ర‌మానికి వెళ్లారు. కిషోర్‌రెడ్డి కంటే ముందే వెళ్లి విగ్ర‌హాల‌ను ఆవిష్కరించారని తెలిసింది. దీంతో అఖిల‌ప్రియ‌ను భూమా కుటుంబం పూర్తిగా బ‌హిష్క‌రించార‌ని స‌మాచారం. హైదరాబాద్‌లో ఇటీవ‌ల బ‌న‌గాన‌ప‌ల్లె ఎమ్మెల్యే కాట‌సాని రామిరెడ్డి కుమారుడి నిశ్చితార్థం జ‌రిగింది. ఈ వేడుకకు అఖిల ప్రియ, ఆమె త‌మ్ముడు జ‌గత్‌విఖ్యాత్ల‌కు త‌ప్ప మిగ‌తా వాళ్లంద‌రికీ ఆహ్వానాలు వెళ్లాయి.

భూమా కుటుంబానికి అత్యంత స‌మీప బంధువు కాట‌సాని రామిరెడ్డి అఖిల ప్రియ‌ను పిల‌వ‌క‌పోవ‌డం తీవ్ర చర్చ‌నీయాంశంగా మారింది. కాట‌సాని రామిరెడ్డి కుమార్తెకు నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డితో వివాహం జ‌రిగింది. భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డికి అఖిల ప్రియ చెల్లెల‌య్యే విష‌యం తెలిసిందే. మ‌రోవైపు భూమా నాగిరెడ్డి ఆత్మీయుడైన ఏవీ సుబ్బారెడ్డి కుమార్తె జ‌స్విత‌రెడ్డి నిశ్చితార్థ వేడుక కూడా అఖిల ప్రియ‌కు ఆహ్వానం అంద‌లేదు. దీంతో ఆమెను కుటుంబం, ఆత్మీయులు పూర్తిగా దూరం పెట్టారనే విష‌యం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 

This post was last modified on March 28, 2022 7:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నెట్ ఫ్లిక్స్ ఒకవైపు… డాల్బీ సినిమా ఇంకోవైపు

టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…

16 minutes ago

కాలర్ లాంటి కంటెంట్ ఉంటే చాలు

మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…

2 hours ago

‘అటవీశాఖ అధికారులను కిడ్నాప్ చెయ్యాలి’

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…

2 hours ago

కష్టాల నాయకుడికి ‘ప్రైమ్’ షాకు ?

రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…

3 hours ago

పవన్ ఫ్యాన్స్ బాధ అర్థం చేసుకున్నారు

అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…

4 hours ago

అక్షయ్ కామెడీ… ఇప్పుడు పండుతుందా?

​బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…

4 hours ago