Political News

అఖిల ప్రియ‌ను దూరం పెట్టిన కుటుంబం!

దివంగ‌త రాజ‌కీయ నాయ‌కులు భూమా శోభ‌, నాగిరెడ్డి దంప‌తుల త‌న‌య‌గా రాజ‌కీయాల్లో ముద్ర వేసిన భూమా అఖిల ప్రియ ఇప్పుడు ఒంట‌రిగా మిగిలిపోయార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. గ‌త కొంత‌కాలంగా కోర్టు కేసులు, వివాదాలు ఇలా ఆమె ఏదో ఒక స‌మ‌స్య‌లో చిక్కుకుంటూనే ఉన్నారు. మ‌రోవైపు భూమా కుటుంబంతోనే విభేదాలు కొన‌సాగిస్తున్నారు. దీంతో భూమా కుటుంబం, వారి బంధువ‌ర్గం ఇప్పుడు అఖిల ప్రియ‌ను పూర్తిగా ప‌క్క‌న‌పెట్టార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది.

ఇటీవ‌ల ప‌రిణామాలు చూస్తుంటే అది నిజమ‌నే అభిప్రాయాలు క‌లుగుతున్నాయి. ఆళ్ల‌గ‌డ్డ‌లో భూమా శోభ‌, నాగిరెడ్డి దంప‌తుల విగ్ర‌హాల‌ను ఇటీవ‌ల ఏర్పాటు చేశారు. భూమా కుటుంబ స‌భ్యుడు, ఆ నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జీ భూమా కిషోర్‌రెడ్డి త‌న సొంత స్థలంలో ఆ విగ్ర‌హాలు ఏర్పాటు చేశారు. వీటి ఆవిష్క‌ర‌ణ‌కు మాజీ మంత్రి అఖిల ప్రియ‌కు త‌ప్ప భూమా కుటుంబంలో అంద‌రికీ ఆహ్వానాలు వెళ్లాయి.

కానీ దీన్ని జీర్ణించుకోలేక పోయిన అఖిల ప్రియ పిల‌వ‌క‌పోయిన ఆ కార్య‌క్ర‌మానికి వెళ్లారు. కిషోర్‌రెడ్డి కంటే ముందే వెళ్లి విగ్ర‌హాల‌ను ఆవిష్కరించారని తెలిసింది. దీంతో అఖిల‌ప్రియ‌ను భూమా కుటుంబం పూర్తిగా బ‌హిష్క‌రించార‌ని స‌మాచారం. హైదరాబాద్‌లో ఇటీవ‌ల బ‌న‌గాన‌ప‌ల్లె ఎమ్మెల్యే కాట‌సాని రామిరెడ్డి కుమారుడి నిశ్చితార్థం జ‌రిగింది. ఈ వేడుకకు అఖిల ప్రియ, ఆమె త‌మ్ముడు జ‌గత్‌విఖ్యాత్ల‌కు త‌ప్ప మిగ‌తా వాళ్లంద‌రికీ ఆహ్వానాలు వెళ్లాయి.

భూమా కుటుంబానికి అత్యంత స‌మీప బంధువు కాట‌సాని రామిరెడ్డి అఖిల ప్రియ‌ను పిల‌వ‌క‌పోవ‌డం తీవ్ర చర్చ‌నీయాంశంగా మారింది. కాట‌సాని రామిరెడ్డి కుమార్తెకు నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డితో వివాహం జ‌రిగింది. భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డికి అఖిల ప్రియ చెల్లెల‌య్యే విష‌యం తెలిసిందే. మ‌రోవైపు భూమా నాగిరెడ్డి ఆత్మీయుడైన ఏవీ సుబ్బారెడ్డి కుమార్తె జ‌స్విత‌రెడ్డి నిశ్చితార్థ వేడుక కూడా అఖిల ప్రియ‌కు ఆహ్వానం అంద‌లేదు. దీంతో ఆమెను కుటుంబం, ఆత్మీయులు పూర్తిగా దూరం పెట్టారనే విష‌యం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 

This post was last modified on March 28, 2022 7:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

10 minutes ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

39 minutes ago

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

2 hours ago

ఈ తరంలో చిరుకు నచ్చిన యంగ్ హీరో

మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…

5 hours ago

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

10 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

13 hours ago