మన దగ్గర ఒక హీరోకు 50 దాటితే కాస్త కష్టమే. రజనీకాంత్ లేదా చిరంజీవి రేంజ్ స్టార్లయితే తప్పించి.. సిక్ట్సీ దాటిందంటే మాత్రం మెయిన్ లీడ్ గా రిటైర్మంటే అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. హీరోయిన్లకు అయితే 35 దాటింది అంటేనే రోల్స్ ఎగిరిపోతాయ్. ఇక 50 ఏళ్ళు దాటిన డైరక్టర్లు చాలామంది చాదస్తంతో కూడిన సినిమాలు తప్పించి, సెన్సిబుల్ సినిమాలను బ్లాక్ బస్టర్లను రూపొందించడం చాలా అరుదే. మ్యూజిక్ డైరక్టర్లు కూడా 50 దాటిందంటే మాత్రం రొటీన్ రంబోలా అయిపోతుంటారు. కాని హాలీవుడ్లో అలా కాదు.
ఈరోజు జరిగిన ఆస్కార్స్ 2022 పండగ చూస్తే.. అవార్డులు గెలిచినోళ్ళలో చాలామంది వృద్దులే. మన ఫిలిం ఇండస్ట్రీలో రిటైర్ అయిపోతారు అనుకునే వయస్సుకు అక్కడ రియల్ టాలెంట్ చూపించడం మొదలెడతారని అవార్డులు గెలిచినోళ్ళని చూస్తే ఇట్టే అర్ధమవుతుంది.
ది పవర్ ఆప్ ది డాగ్ సినిమాకు బెస్ట్ డైరక్టర్ అవార్డు గెలుచుకున్న జేన్ క్యాంపియన్ వయస్సు 67 ఏళ్ళు. డ్యూన్ సినిమాకుగాను బెస్ట్ ఒరిజినల్ స్కోర్ అవార్డు దక్కించుకున్న సంగీత దర్శకుడు హాన్స్ జిమ్మర్ వయస్సు 64 ఏళ్ళు. ఉత్తమ ఒరిజినల్ స్ర్కిన్ ప్లే అవార్డు అందుకున్న కెనెత్ బ్రనాగ్ వయస్సు 61 ఏళ్లు. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు గెలిచిన ట్రాయ్ కొట్సుర్ ఏజ్ 54 ఏళ్ళు. డ్యూన్ సినిమా జోయ్ వాకర్ 68 ఏళ్ళకు బెస్ట్ ఎడిటర్ అవార్డు తీసుకున్నాడు. ఏ విధంగా చూసినా కూడా 50 దాటిన తరువాత, వాళ్ళకున్న ఎక్సపీరియన్స్ కారణంగా.. హాలీవుడ్లో చాలామంది బెటర్ సినిమాలను అందిస్తున్నారు. మరి మన దగ్గర పరిస్థితి ఏంటి?
నిజానికి మన దగ్గర 50 దాటిన డైరక్టర్లకు, రైటర్లకు, ఇతర టెక్నీషియన్లకు చాదస్తం పెరిగిపోతోందనేది ఒక వాదన. నిజానికి వీళ్ళు కూడా 50 దాటగానే చేసిన ప్రాజెక్టులన్నీ ఘోరంగానే ఉంటున్నాయి. ఉదాహరణకు కె.విశ్వనాథ్, కృష్ణవంశీ వంటి టాలెంటెడ్ దర్శకులు.. 50 దాటాక మాత్రం దారుణమైన సినిమాలనే తీశారు. అలాగే వయసైపోయిన మ్యూజిక్ డైరక్టర్లు కూడా పేలవమైన వర్కే చేస్తున్నారు. మరి హాలీవుడ్ ను చూసి ఈ విషయంలో మనోళ్ళు కాస్త ఇనస్పయిర్ అయితే బెటరేమో. ఇక యాక్టర్లు మాత్రం ఇండియాలో కూడా ఈ మధ్యనే 50 దాటాక కొత్త స్టార్డమ్ కూడా మూటకట్టుకుంటున్నార్లే.
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…
మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…
ఏపీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ.. ప్రస్తుత ఉండి శాసనసభ్యుడు రఘురామకృష్ణరాజును కస్టడీలో టార్చర్ చేసిన కేసులో హైకోర్టు సంచలన…