ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీ అయిన ‘ఆర్ఆర్ఆర్’ ఆల్రెడీ థియేటర్లలోకి దిగేసింది. అద్భుతమైన వసూళ్లతో దూసుకెళ్తోంది. ఇక దీని తర్వాత అత్యంత ఆసక్తితో దేశమంతా ఎదురు చూస్తున్న ‘కేజీఎఫ్-2’ ఇంకో రెండు వారాల్లోనే థియేటర్లలోకి దిగబోతోంది. ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలే ఉన్నాయి. దేశంలో అతి పెద్ద మార్కెట్లయిన హిందీ, తెలుగు రీజియన్లలో ఈ చిత్రానికి పోటీ లేదు. బాలీవుడ్, టాలీవుడ్ ‘కేజీఎఫ్-2’కు పోటీగా ఏ సినిమాను దించట్లేదు.
కానీ తమిళంలో మాత్రం విజయ్ సినిమా ‘బీస్ట్’తో దీనికి పోటీ తప్పట్లేదు. ‘కేజీఎఫ్-2’ మీద తమిళంలోనూ భారీ అంచనాలున్నప్పటికీ.. వేరే ప్రాంతాల్లో దీని వల్ల తమ చిత్రానికి ఇబ్బంది అవుతుందని తెలిసినప్పటికీ.. ‘బీస్ట్’ను ‘కేజీఎఫ్-2’తో పోటీకి దించేశారు. ఈ పోటీ వల్ల తమిళనాడు, కేరళల్లో ‘కేజీఎఫ్-2’కు కూడా ఇబ్బంది తప్పదు. చాలినన్ని థియేటర్లు దొరక్కపోవచ్చు. వసూళ్లపై ప్రభావం పడవచ్చు.
కానీ ఏమీ చేయలేని పరిస్థితి. ‘కేజీఎఫ్-2’ ట్రైలర్ లాంచ్ సందర్భంగా యశ్ను ఇదే ప్రశ్న అడిగాడు ఓ విలేకరి. దానికతను అదిరిపోయే సమాధానం చెప్పాడు. అందరూ కేజీఎఫ్-2 వెర్సస్ బీస్ట్ అని అంటున్నారని, కానీ తాను మాత్రం కేజీఎఫ్-2 అండ్ బీస్ట్ లాగా దీన్ని చూస్తానని యశ్ అన్నాడు.. యష్ మాట్లాడుతూ.. ఇదేమీ ఎన్నికలు కాదు, ఒక ఓటు ఉంటే దాన్ని ఏ ఒక్కరికో వెయ్యాలనే సమస్య తలెత్తదు. ప్రేక్షకుడికి నచ్చితే రెండు సినిమాలూ చూస్తాడు. ఒక సినిమా చూసి ఇది బాగుందని ఇంకొకరికి చెబితే.. అవతలి వ్యక్తి ఆ సినిమా బాగుందని ఇతడికి చెప్పొచ్చు. విజయ్ సార్ అంటే నాకు చాలా గౌరవం ఉంది. ఆయన చాలా పెద్ద స్టార్. ఎన్నో ఏళ్లుగా సినిమా కోసం ఎంతో చేశాడు. ఇంత ఫాలోయింగ్ సంపాదించున్నాడు. అలాంటి స్టార్ను మనందరం గౌరవించాలి.
మాది పాన్ ఇండియా సినిమా. మేం ఎనిమిది నెలల ముందే రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాం. అప్పుడు ఏ సినిమాతో పోటీ పడతామో తెలియదు. విజయ్ సార్ సినిమాను ఇప్పుడు రిలీజ్ చేయడం అవసరమని వాళ్లు అనుకున్నారు. కాబట్టి ఇక్కడ ఒకరితో ఒకరికి పోటీ లేదు. నేను బీస్ట్ సినిమా చూస్తాను. విజయ్ సార్ అభిమానులు కూడా నా సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా.. అంటూ పరిణతితో సమాధానం చెప్పి అందరి మనసులూ గెలిచాడు యశ్.
This post was last modified on March 28, 2022 3:50 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…