ఫైనల్ గా యువ హీరో ఆది పినిశెట్టి తనకు నచ్చిన హీరోయిన్ ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. గత కొంతకాలంగా ఈ హీరో ఒక హీరోయిన్ తో ప్రేమలో ఉన్నట్లు గా అనేక రకాల కథనాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. అయితే వార్తలు ఎన్ని వస్తున్నా కూడా ఎప్పుడూ కూడా ఈ ఇద్దరూ ఆ విషయం పై క్లారిటీ ఇవ్వలేదు. కానీ నిత్యం వారి కుటుంబానికి సంబంధించిన ఈవెంట్స్ లో పాల్గొంటూనే ఉన్నారు.
మొత్తానికి విరి ప్రేమ నిజమేనని అఫీషియల్ గా క్లారిటీ వచ్చేసింది. ఆది పినిశెట్టి – హీరోయిన్ నిక్కీ గల్రానినీ వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. ఇక ఈనెల 24వ తేదీన వీరి కుటుంబ సభ్యుల సమక్షంలోనే నిశ్చితార్థం కూడా జరిగినట్లు కొద్దిసేపటి క్రితం ఆది పినిశెట్టి అఫీషియల్ గా ఫొటో కూడా షేర్ చేసి ప్రకటన ఇచ్చాడు. తాము ఎప్పుడో జంటగా ఒకటయ్యామని ఇప్పుడు అఫీషియల్ అని వివరణ ఇచ్చారు. ప్రస్తుతం ఈ జంట ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇదివరకే ఆది పినిశెట్టి హీరోయిన్ నిక్కీ తో రెండు సినిమాలు చేశాడు. తెలుగులో మలుపు అనే సినిమా తో పాటు బైలాంగ్యువల్ మూవీ మరకతమణి సినిమాలో కూడా ఇద్దరు కలిసి నటించారు. ఇక చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట ఫ్యామిలీ ఈవెంట్స్ లో కూడా తరచు కనిపించేవారు. అసలైతే గత ఏడాదిలోనే వివాహం జరుగుతున్నట్లు కోలీవుడ్ మీడియాలో టాక్ గట్టిగానే వచ్చింది. ఇక ఇప్పుడు ఫైనల్ గా ఇరు కుటుంబాల సమక్షంలో నిశ్చితార్థం చేసుకుని త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న ట్లు క్లారిటీ వచ్చేసింది.
ఇక ఆది పినిశెట్టి హీరోగానే కాకుండా అప్పుడప్పుడు విభిన్నమైన సహాయక పాత్రలతో నటిస్తున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా విలన్ గా కూడా ఆది మంచి గుర్తింపు అందుకుంటున్నాడు. ఆది పినిశెట్టి తండ్రి రవి రాజా పినిశెట్టి 80, 90ల కాలంలో అగ్ర దర్శకుడిగా సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఆయన పెద్దకొడుకు సత్య ప్రసాద్ దర్శకుడిగా కొనసాగుతుండగా ఆది పినిశెట్టి మాత్రం ఇలా విభిన్నమైన నటుడిగా గుర్తింపు అందుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
This post was last modified on March 26, 2022 6:21 pm
సోషల్ మీడియాలో ఎప్పుడేం జరుగుతుందో.. దేనికి మురిసిపోతారో? ఏ విషయానికి ఆగ్రహానికి గురవుతారో అంచనా వేయటం అంత తేలికైన విషయం…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ప్రకటించే నంది అవార్డులకు ఎంత విలువ ఉండేదో తెలిసిందే. వాటిని జాతీయ అవార్డులతో సమానంగా చూసేవారు.…
స్టార్ హీరో సినిమాల్లో ఐటెం సాంగ్స్ అన్నవి చాలా ఏళ్ల నుంచి కామన్గా ఉంటున్నాయి. సుకుమార్ సహా చాలామంది దర్శకులు…
గత దశాబ్ద కాలంలో తెలుగువారు ఎంతో మెచ్చిన పరభాషా కథానాయికల్లో సాయిపల్లవి ముందు వరుసలో ఉంటుంది. ఆమెను నాన్ లోకల్…
రాజకీయాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని.. దీనికి మహిళలు కూడా సిద్ధంగా ఉండాలని తాజాగా ఏపీ సీఎం, టీడీపీ…
టాలీవుడ్ లో రాజమౌళి తర్వాత అసలు ఫ్లాపే లేని దర్శకుడు అనిల్ రావిపూడి. ఇద్దరినీ పోల్చడం సబబు కాకపోయినా ఇండస్ట్రీలో…