ఒక పెద్ద టౌన్లో ఒక పది థియేటర్లుంటే.. ఏదైనా పెద్ద సినిమా రిలీజైనపుడు తొలి రోజు లేదా తొలి వారం వరకు రెండు మూడు థియేటర్లలో ఆడించేవాళ్లు. ఆ తర్వాత సింగిల్ థియేటర్లో సినిమా నడిచేది. అప్పట్లో సినిమాలకు లాంగ్ రన్ ఉండేది కాబట్టి ఒక్క థియేటర్లోనే ఎక్కువ రోజులు ఆడేది. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితులు వేగంగా మారిపోయాయి. లాంగ్ రన్కు ఛాన్సే లేకపోయింది. అర్ధశత దినోత్సవాలు, శత దినోత్సవాలు అటకెక్కేశాయి. ఎంత పెద్ద సినిమా అయినా, ఎంత మంచి టాక్ తెచ్చుకున్నాయి.
గరిష్టంగా మూడు వారాలకు మించి నడవట్లేదు. అందుబాటులో ఉన్న ప్రతి థియేటర్లోనూ అదే సినిమాను వేసేసి వీకెండ్ వరకు మాగ్జిమం వసూళ్లు లాగేయడమే ఇప్పుడు నడుస్తున్న వ్యవహారం. అందులోనూ ‘ఆర్ఆర్ఆర్’ లాంటి సినిమా రిలీజైనపుడు ఏ థియేటరునైనా వేరే సినిమాకు ఎలా విడిచిపెడతారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న ప్రతి థియేటర్లోనూ ఈ సినిమానే ఆడించబోతున్నారు.
ఏపీలో అయితే విశాఖపట్నం, విజయవాడ లాంటి కొన్ని సిటీల్లో ఒకటీ అరా షోలు ‘కశ్మీర్ ఫైల్స్’కు విడిచిపెట్టి ప్రతి థియేటర్లో, ప్రతి షో కూడా ‘ఆర్ఆర్ఆర్’ సినిమానే నడిపించబోతున్నారు. వీకెండ్ అంతా ఇదే పరిస్థితి ఉండబోతోంది. హైదరాబాద్లో నార్త్ ఇండియన్స్ సంఖ్య కాస్త ఎక్కువే కావడంతో సింగిల్ స్క్రీన్లు ఒక రెండు.. మల్టీప్లెక్సుల్లో కొన్ని షోలు మాత్రమే ‘కశ్మీర్ ఫైల్స్’కు కేటాయించారు. మొత్తంగా ఆ సినిమాకు శుక్రవారం కేటాయించిన షోలు 15 మాత్రమే. ఆల్రెడీ థియేటర్లలో ఆడుతున్న ‘రాధేశ్యామ్’ సహా అన్ని చిత్రాలనూ శుక్రవారం తీసేస్తున్నారు.
మల్టీప్లెక్సులతో పాటు సింగిల్ స్క్రీన్లలో ఉదయం 6 గంటల నుంచి మొదలుపెట్టి.. అర్ధరాత్రి 2 గంటల వరకు ‘ఆర్ఆర్ఆర్’ షోలు నడవబోతున్నాయి. ఇంతకుముందు ‘బాహుబలి-2’కు ఇలా మాగ్జిమం షోలు కేటాయించారు. అప్పటితో పోలిస్తే హైదరాబాద్లో స్క్రీన్లు పెరిగాయి. షోలు కూడా ఎక్కువ అవుతున్నాయి. పైగా టికెట్ల ధరలు కూడా పెరిగాయి కాబట్టి ఆ సినిమా వసూళ్ల రికార్డును ‘ఆర్ఆర్ఆర్’ అలవోకగా దాటేయబోతోంది.
This post was last modified on March 25, 2022 10:16 am
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…