ఒక పెద్ద టౌన్లో ఒక పది థియేటర్లుంటే.. ఏదైనా పెద్ద సినిమా రిలీజైనపుడు తొలి రోజు లేదా తొలి వారం వరకు రెండు మూడు థియేటర్లలో ఆడించేవాళ్లు. ఆ తర్వాత సింగిల్ థియేటర్లో సినిమా నడిచేది. అప్పట్లో సినిమాలకు లాంగ్ రన్ ఉండేది కాబట్టి ఒక్క థియేటర్లోనే ఎక్కువ రోజులు ఆడేది. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితులు వేగంగా మారిపోయాయి. లాంగ్ రన్కు ఛాన్సే లేకపోయింది. అర్ధశత దినోత్సవాలు, శత దినోత్సవాలు అటకెక్కేశాయి. ఎంత పెద్ద సినిమా అయినా, ఎంత మంచి టాక్ తెచ్చుకున్నాయి.
గరిష్టంగా మూడు వారాలకు మించి నడవట్లేదు. అందుబాటులో ఉన్న ప్రతి థియేటర్లోనూ అదే సినిమాను వేసేసి వీకెండ్ వరకు మాగ్జిమం వసూళ్లు లాగేయడమే ఇప్పుడు నడుస్తున్న వ్యవహారం. అందులోనూ ‘ఆర్ఆర్ఆర్’ లాంటి సినిమా రిలీజైనపుడు ఏ థియేటరునైనా వేరే సినిమాకు ఎలా విడిచిపెడతారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న ప్రతి థియేటర్లోనూ ఈ సినిమానే ఆడించబోతున్నారు.
ఏపీలో అయితే విశాఖపట్నం, విజయవాడ లాంటి కొన్ని సిటీల్లో ఒకటీ అరా షోలు ‘కశ్మీర్ ఫైల్స్’కు విడిచిపెట్టి ప్రతి థియేటర్లో, ప్రతి షో కూడా ‘ఆర్ఆర్ఆర్’ సినిమానే నడిపించబోతున్నారు. వీకెండ్ అంతా ఇదే పరిస్థితి ఉండబోతోంది. హైదరాబాద్లో నార్త్ ఇండియన్స్ సంఖ్య కాస్త ఎక్కువే కావడంతో సింగిల్ స్క్రీన్లు ఒక రెండు.. మల్టీప్లెక్సుల్లో కొన్ని షోలు మాత్రమే ‘కశ్మీర్ ఫైల్స్’కు కేటాయించారు. మొత్తంగా ఆ సినిమాకు శుక్రవారం కేటాయించిన షోలు 15 మాత్రమే. ఆల్రెడీ థియేటర్లలో ఆడుతున్న ‘రాధేశ్యామ్’ సహా అన్ని చిత్రాలనూ శుక్రవారం తీసేస్తున్నారు.
మల్టీప్లెక్సులతో పాటు సింగిల్ స్క్రీన్లలో ఉదయం 6 గంటల నుంచి మొదలుపెట్టి.. అర్ధరాత్రి 2 గంటల వరకు ‘ఆర్ఆర్ఆర్’ షోలు నడవబోతున్నాయి. ఇంతకుముందు ‘బాహుబలి-2’కు ఇలా మాగ్జిమం షోలు కేటాయించారు. అప్పటితో పోలిస్తే హైదరాబాద్లో స్క్రీన్లు పెరిగాయి. షోలు కూడా ఎక్కువ అవుతున్నాయి. పైగా టికెట్ల ధరలు కూడా పెరిగాయి కాబట్టి ఆ సినిమా వసూళ్ల రికార్డును ‘ఆర్ఆర్ఆర్’ అలవోకగా దాటేయబోతోంది.
This post was last modified on March 25, 2022 10:16 am
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…