బాహుబలి తర్వాత రాజమౌళి ఎవరితో, ఎలాంటి సినిమా తీసినా.. దేశవ్యాప్తంగా ఎగబడి చూస్తారనే అభిప్రాయం అందరిలోనూ కలిగింది. అలాంటిది జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి పెద్ద స్టార్లతో, బాహుబలికి దీటైన ఆర్ఆర్ఆర్ లాంటి భారీ చిత్రం తీసినా.. తెలుగు రాష్ట్రాల అవతల అనుకున్నంత క్రేజ్ కనిపించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
కర్ణాటకలో ఏ తెలుగు సినిమా రిలీజైనా హంగామా ఉంటుంది. కానీ తమిళనాడు, కేరళ, అలాగే నార్త్ ఇండియాలో ఆర్ఆర్ఆర్ ప్రభావం అనుకున్నంతగా కనిపించడం లేదు. అన్ని చోట్లా అడ్వాన్స్ బుకింగ్స్ ఆశాజనకంగా లేవు. ముఖ్యంగా నార్త్లో బుకింగ్స్ చాలా డల్లుగా ఉండటం చిత్ర బృందానికి మింగుడు పడటం లేదు. అక్కడి ప్రేక్షకులంతా కశ్మీర్ ఫైల్స్ మాయలో ఉండటం వల్ల దీన్ని విస్మరిస్తున్నారా.. లేక బేసిగ్గానే ఆర్ఆర్ఆర్ వాళ్ల దృష్టిని ఆకర్షించడం లేదా అన్నది ప్రశ్న.
ఐతే కారణాలేవైనప్పటికీ.. అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ అయితే అంత బాగా లేదు. అలాగని ఆశలు కోల్పోవాల్సిన పని లేదు. ప్రభాస్ లాగా తమ హీరోలు కూడా ఆర్ఆర్ఆర్తో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకుంటారనుకున్న తారక్, చరణ్ అభిమానులు కూడా డీలా పడిపోవాల్సిన పని లేదు. ఎందుకంటే బాహుబలి: ది బిగినింగ్ రిలీజైనపుడు కూడా ఇదే పరిస్థితి ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ మరీ గొప్పగా ఏమీ లేవు. ఆక్యుపెన్సీ తక్కువగానే కనిపించింది. కానీ సినిమా రిలీజయ్యాక కథ మారిపోయింది.
పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. జనం విరగబడ్డారు. ఇక బాహుబలి-2 సంగతైతే చెప్పాల్సిన పని లేదు. ఆర్ఆర్ఆర్ విషయంలోనూ అదే మ్యాజిక్ పునరావృతం అవుతుందని చిత్ర బృందం ఆశిస్తోంది. బేసిగ్గా బాహుబలి లాంటి విజువల్ వండర్ కాకపోవడం వల్ల ఇప్పటికి ఈ సినిమా పెద్దగా ఆకర్షించలేకపోయినా.. సినిమాలోని యాక్షన్, ఎమోషన్లు, మాస్ అంశాలు కచ్చితంగా ఉత్తరాది ప్రేక్షకులను అలరిస్తాయని.. బాహుబలి స్థాయిలో కాకపోయినా కచ్చితంగా ఈ సినిమా కూడా పెద్ద విజయమే సాధించడం గ్యారెంటీ అని అంటున్నారు.
This post was last modified on March 24, 2022 6:04 pm
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…