తమిళంలో ఒకప్పుడు ఏ రికార్డయినా సూపర్ స్టార్ రజినీకాంత్ మీదే ఉండేది. పారితోషకంలో అయినా.. సినిమాల బిజినెస్, వసూళ్ల విషయంలో అయినా ఆయనదే ఆధిపత్యం. మిగతా స్టార్లకు, ఆయనకు మధ్య చాలా అంతరం ఉండేది. కానీ గత కొన్నేళ్లలో వేగంగా పరిస్థితులు మారిపోయాయి. రజినీ వరుస ఫ్లాపులతో వెనుకబడిపోయాడు. అదే సమయంలో విజయ్, అజిత్ దూసుకెళ్లిపోయారు.
వీళ్లిద్దరిలో కాస్త పైచేయి విజయ్దే అని చెప్పాలి. కానీ అజిత్ కూడా తక్కువ వాడేమీ కాదు. ‘విశ్వాసం’ లాంటి మామూలు సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టిన ఘనత అజిత్ సొంతం. తాజాగా అజిత్ ‘వలిమై’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది మామూలు సినిమానే. డివైడ్ టాక్ తెచ్చుకుంది. అలాంటి సినిమాతో వసూళ్ల మోత మోగించి తన స్టార్ డమ్కు తిరుగులేదని చాటాడు అజిత్.
ఆ చిత్రం దాదాపు రూ.200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు అక్కడి ట్రేడ్ పండిట్లు చెబుతున్నారు.‘వలిమై’ రిలీజైన టైంలోనే ఆ చిత్ర దర్శకుడు హెచ్.వినోద్తో మరో సినిమాను మొదలుపెట్టేసిన అజిత్.. తాజాగా మరో చిత్రాన్ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదికి వెళ్లనుంది. అందులో నయనతార కథానాయిక కాగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రానికి ఏకంగా రూ.100 కోట్ల పారితోషకాన్ని అజిత్ అందుకోనున్నాడట.
లైకా వాళ్లు రికార్డ్ బ్రేకింగ్ రెమ్యూనరేషన్ ఇచ్చి అజిత్ను ఈ సినిమాకు ఒప్పించారట. నెగెటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాలతోనూ 200 కోట్లకు పైగా బిజినెస్ చేస్తే ఇక ఆ హీరోకున్న మార్కెట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ‘వలిమై’ లాంటి సినిమా రెండో వారంలోనూ హౌస్ ఫుల్స్తో రన్ అయిందంటే కేవలం అజిత్ మేనియానే కారణం. అందుకే రూ.100 కోట్ల పారితోషకం అజిత్ అందుకోవడాన్ని మరీ విడ్డూరంగా చూడాల్సిన పని లేదు.
This post was last modified on March 24, 2022 3:43 pm
ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…
సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…