ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చేసిన కొమరం భీమ్.. రామ్ చరణ్ పోషించిన అల్లూరి సీతారామరాజు పాత్రల్లో ఏది హైలైట్ అవుతుందనే విషయంలో అందరిలోనూ ఉత్కంఠ ఉంది. ఈ విషయంలో ఇద్దరు హీరోల అభిమానుల మధ్య ఎప్పట్నుంచో ఫైట్ నడుస్తోంది. ఐతే గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దర్శకుడు రాజమౌళి పాత్ర పరంగా తన ఫేవరెట్ చరణ్ చేసిన రామరాజు క్యారెక్టరే అన్నాడు.
ఇప్పుడు రాజమౌళి తండ్రి, ఆర్ఆర్ఆర్ కథకుడు విజయేంద్ర ప్రసాద్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేయడం విశేషం. ఓ ఇంటర్వ్యూలో ఆయన ఆర్ఆర్ఆర్లోని రెండు ప్రధాన పాత్రలను విశ్లేషించారు. ఈ రెండు పాత్రల్లో తనకు ఏది ఎక్కువ ఇష్టమో వెల్లడించారు.
ట్రైలర్ సహా ప్రోమోల్లో చూస్తే కొమరం భీమ్ వెంటనే ఆకట్టుకుంటుందని, అడవి బిడ్డ పాత్ర చేయడం వల్ల ఆ పాత్ర చూడగానే ఆకట్టుకుంటుందని, అడవిలో ఒక పువ్వునో, ఒక జంతువునో చూస్తే అవి ఎంత స్వచ్ఛంగా కనిపిస్తాయో అలాంటి పాత్రే ఇదని విజయేంద్ర ప్రసాద్ అన్నారు. ఇక చరణ్ చేసిన రామరాజు పాత్ర గురించి చెబుతూ.. ఇది సంక్లిష్టమైన పాత్ర అని, దీనిలో చాలా లేయర్స్ ఉంటాయని.. లోలోన ఎంతో బాధ పడుతూ, సంఘర్షణ అనుభవించే పాత్ర ఇదని అన్నారు.
సినిమాలో తారక్ చరణ్ను అన్న అని పిలుస్తాడని, కాబట్టి చరణ్ చేసింది పరిణతితో కూడిన, పెద్ద వాడి పాత్ర అని.. ఈ పాత్రను పోషించడం కూడా చాలా కష్టమని విజయేంద్ర అన్నారు. వ్యక్తిగతంగా తనకు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని, కానీ ఈ సినిమా వరకు రామ్ చరణ్కు తాను రెండు మార్కులు ఎక్కువ వేస్తానని.. ఇందుకు పాత్రలో ఉన్న సంక్లిష్టత, లేయర్సే కారణమని విజయేంద్ర విశ్లేషించారు. బేసిగ్గా అల్లూరి సీతారామరాజు అంటే బాగా పాపులర్ అయిన క్యారెక్టర్,పైగా తెలుగువాళ్లకు దాంతో ఉన్న ఎమోషనల్ కనెక్షన్ వల్ల దీనికే సినిమాలో ఎలివేషన్ ఎక్కువ ఉండొచ్చని భావిస్తున్నారు. అలాగని తారక్ చేసిన భీమ్ పాత్రను రాజమౌళి తగ్గించి అయితే ఉండడు, బ్యాలెన్స్ చేయడానికే ప్రయత్నించి ఉంటాడని భావించవచ్చు.
This post was last modified on March 24, 2022 8:30 am
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…