ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ విడుదలకు ఇంకొక్క రోజే మిగిలుంది. మామూలుగా పెద్ద సినిమాలకు ముందుగా షో పడేది యుఎస్లోనే. అక్కడ ముందు రోజే ప్రిమియర్లు వేస్తారన్న సంగతి తెలిసిందే. భారత కాలమానం ప్రకారం రిలీజ్ రోజుకు ముందు రోజు అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో యుఎస్ ప్రిమియర్ షోలు మొదలవుతుంటాయి.
ఒకప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో కూడా క్రేజును బట్టి అర్ధరాత్రి దాటాక బెనిఫిట్ షోలు పడేవి. కానీ ఇప్పుడవి లేవు. తెలుగు రాష్ట్రాల్లో ముందుగా షో పడుతున్నది హైదరాబాద్లోనే. తెల్లవారుజామున 4-5 గంటల మధ్య ఒకట్రెండు థియేటర్లలో బెనిఫిట్ షోలు వేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు హైదరాబాద్ సిటీలో ఇదే సమయంలో కొన్ని షోలు ప్లాన్ చేశారు. ఐతే అంతకంటే ముందే ముందు రోజు రాత్రి సెకండ్ షో సమయానికి రెండు సిటీల్లో స్పెషల్ షోలు పడబోతున్నాయి.
ముందు మార్చి 24న రాత్రి సెకండ్ షోకు అన్ని చోట్లా పెయిడ్ ప్రిమియర్స్ వేయాలనుకున్నా.. తర్వాత డిస్ట్రిబ్యూటర్లు ఆలోచన మార్చుకున్నారు. అవి క్యాన్సిల్ అయ్యాయి. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ టీం మెంబర్సే ముందు రోజు రాత్రి రెండు స్పెషల్ షోలు ప్లాన్ చేసుకున్నారు. అందులో ఒకటి ఎక్స్క్లూజివ్గా జూనియర్ ఎన్టీఆర్ తన వాళ్ల కోసం ప్లాన్ చేసుకున్న షో కావడం విశేషం. హైదరాబాద్ ఏఎంబీ మాల్లో ఒక స్క్రీన్ను తారక్ తీసుకున్నాడు.
తన కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులైన 50 మంది కోసం ఏర్పాటు చేసుకున్న షో ఇది. రిక్లైనర్లతో ఉండే చిన్న స్క్రీన్ను తారక్ కోసం కేటాయించారు. మరోవైపు ముంబయిలో అదే సమయానికి బాలీవుడ్ సెలబ్రెటీలు, మీడియా కోసం స్పెషల్ ప్రిమియర్ షో వేస్తున్నారట. ఆర్ఆర్ఆర్ హిందీ వెర్షన్కు ఆశించిన స్థాయిలో బుకింగ్స్ లేకపోవడంతో సెలబ్రెటీ టాక్తో హైప్ పెంచడానికి ఈ షోను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
This post was last modified on March 23, 2022 9:00 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…