ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ విడుదలకు ఇంకొక్క రోజే మిగిలుంది. మామూలుగా పెద్ద సినిమాలకు ముందుగా షో పడేది యుఎస్లోనే. అక్కడ ముందు రోజే ప్రిమియర్లు వేస్తారన్న సంగతి తెలిసిందే. భారత కాలమానం ప్రకారం రిలీజ్ రోజుకు ముందు రోజు అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో యుఎస్ ప్రిమియర్ షోలు మొదలవుతుంటాయి.
ఒకప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో కూడా క్రేజును బట్టి అర్ధరాత్రి దాటాక బెనిఫిట్ షోలు పడేవి. కానీ ఇప్పుడవి లేవు. తెలుగు రాష్ట్రాల్లో ముందుగా షో పడుతున్నది హైదరాబాద్లోనే. తెల్లవారుజామున 4-5 గంటల మధ్య ఒకట్రెండు థియేటర్లలో బెనిఫిట్ షోలు వేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు హైదరాబాద్ సిటీలో ఇదే సమయంలో కొన్ని షోలు ప్లాన్ చేశారు. ఐతే అంతకంటే ముందే ముందు రోజు రాత్రి సెకండ్ షో సమయానికి రెండు సిటీల్లో స్పెషల్ షోలు పడబోతున్నాయి.
ముందు మార్చి 24న రాత్రి సెకండ్ షోకు అన్ని చోట్లా పెయిడ్ ప్రిమియర్స్ వేయాలనుకున్నా.. తర్వాత డిస్ట్రిబ్యూటర్లు ఆలోచన మార్చుకున్నారు. అవి క్యాన్సిల్ అయ్యాయి. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ టీం మెంబర్సే ముందు రోజు రాత్రి రెండు స్పెషల్ షోలు ప్లాన్ చేసుకున్నారు. అందులో ఒకటి ఎక్స్క్లూజివ్గా జూనియర్ ఎన్టీఆర్ తన వాళ్ల కోసం ప్లాన్ చేసుకున్న షో కావడం విశేషం. హైదరాబాద్ ఏఎంబీ మాల్లో ఒక స్క్రీన్ను తారక్ తీసుకున్నాడు.
తన కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులైన 50 మంది కోసం ఏర్పాటు చేసుకున్న షో ఇది. రిక్లైనర్లతో ఉండే చిన్న స్క్రీన్ను తారక్ కోసం కేటాయించారు. మరోవైపు ముంబయిలో అదే సమయానికి బాలీవుడ్ సెలబ్రెటీలు, మీడియా కోసం స్పెషల్ ప్రిమియర్ షో వేస్తున్నారట. ఆర్ఆర్ఆర్ హిందీ వెర్షన్కు ఆశించిన స్థాయిలో బుకింగ్స్ లేకపోవడంతో సెలబ్రెటీ టాక్తో హైప్ పెంచడానికి ఈ షోను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
నిన్న విడుదలైన మా ఇంటి బంగారంకు మంచి రెస్పాన్స్ వస్తోంది. మెయిన్ సెంటర్స్ థియేటర్లు దాదాపుగా హౌస్ ఫుల్స్ నమోదు…
నిన్న విడుదలైన మా ఇంటి బంగారంలో మూడు పాత్రలు మహిళా ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయాయి. మొదటి పేరు సమంత అని…
నిన్న విడుదలైన కొత్త సినిమాల్లో అతి తక్కువ నోటీస్ తెచ్చుకున్నది మలయాళం డబ్బింగ్ బాలన్ ది బాయ్. అన్నపూర్ణ సంస్థ…
కాపుల విషయంలో ఏం చేయాలన్న అంశంపై వైసీపీ తర్జన భర్జన పడుతోందా? వారితో కలిసి ముందుకు సాగాలా? లేక.. వారిని…
ఈ ఏడాది ఫిబ్రవరి 28. ప్రపంచం కళ్లు తెరుస్తున్న సమయం. ఊహాతీతంగా.. అన్ని మీడియాల్లోనూ.. అ ప్పటికే.. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్…
వైసీపీ సీనియర్ నాయకుడు, ఫైర్బ్రాండ్ కొడాలి నానిపై 2021లో నమోదైన కేసు విచారణకు తాజాగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.…