ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ విడుదలకు ఇంకొక్క రోజే మిగిలుంది. మామూలుగా పెద్ద సినిమాలకు ముందుగా షో పడేది యుఎస్లోనే. అక్కడ ముందు రోజే ప్రిమియర్లు వేస్తారన్న సంగతి తెలిసిందే. భారత కాలమానం ప్రకారం రిలీజ్ రోజుకు ముందు రోజు అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో యుఎస్ ప్రిమియర్ షోలు మొదలవుతుంటాయి.
ఒకప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో కూడా క్రేజును బట్టి అర్ధరాత్రి దాటాక బెనిఫిట్ షోలు పడేవి. కానీ ఇప్పుడవి లేవు. తెలుగు రాష్ట్రాల్లో ముందుగా షో పడుతున్నది హైదరాబాద్లోనే. తెల్లవారుజామున 4-5 గంటల మధ్య ఒకట్రెండు థియేటర్లలో బెనిఫిట్ షోలు వేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు హైదరాబాద్ సిటీలో ఇదే సమయంలో కొన్ని షోలు ప్లాన్ చేశారు. ఐతే అంతకంటే ముందే ముందు రోజు రాత్రి సెకండ్ షో సమయానికి రెండు సిటీల్లో స్పెషల్ షోలు పడబోతున్నాయి.
ముందు మార్చి 24న రాత్రి సెకండ్ షోకు అన్ని చోట్లా పెయిడ్ ప్రిమియర్స్ వేయాలనుకున్నా.. తర్వాత డిస్ట్రిబ్యూటర్లు ఆలోచన మార్చుకున్నారు. అవి క్యాన్సిల్ అయ్యాయి. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ టీం మెంబర్సే ముందు రోజు రాత్రి రెండు స్పెషల్ షోలు ప్లాన్ చేసుకున్నారు. అందులో ఒకటి ఎక్స్క్లూజివ్గా జూనియర్ ఎన్టీఆర్ తన వాళ్ల కోసం ప్లాన్ చేసుకున్న షో కావడం విశేషం. హైదరాబాద్ ఏఎంబీ మాల్లో ఒక స్క్రీన్ను తారక్ తీసుకున్నాడు.
తన కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులైన 50 మంది కోసం ఏర్పాటు చేసుకున్న షో ఇది. రిక్లైనర్లతో ఉండే చిన్న స్క్రీన్ను తారక్ కోసం కేటాయించారు. మరోవైపు ముంబయిలో అదే సమయానికి బాలీవుడ్ సెలబ్రెటీలు, మీడియా కోసం స్పెషల్ ప్రిమియర్ షో వేస్తున్నారట. ఆర్ఆర్ఆర్ హిందీ వెర్షన్కు ఆశించిన స్థాయిలో బుకింగ్స్ లేకపోవడంతో సెలబ్రెటీ టాక్తో హైప్ పెంచడానికి ఈ షోను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…