ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ విడుదలకు ఇంకొక్క రోజే మిగిలుంది. మామూలుగా పెద్ద సినిమాలకు ముందుగా షో పడేది యుఎస్లోనే. అక్కడ ముందు రోజే ప్రిమియర్లు వేస్తారన్న సంగతి తెలిసిందే. భారత కాలమానం ప్రకారం రిలీజ్ రోజుకు ముందు రోజు అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో యుఎస్ ప్రిమియర్ షోలు మొదలవుతుంటాయి.
ఒకప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో కూడా క్రేజును బట్టి అర్ధరాత్రి దాటాక బెనిఫిట్ షోలు పడేవి. కానీ ఇప్పుడవి లేవు. తెలుగు రాష్ట్రాల్లో ముందుగా షో పడుతున్నది హైదరాబాద్లోనే. తెల్లవారుజామున 4-5 గంటల మధ్య ఒకట్రెండు థియేటర్లలో బెనిఫిట్ షోలు వేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు హైదరాబాద్ సిటీలో ఇదే సమయంలో కొన్ని షోలు ప్లాన్ చేశారు. ఐతే అంతకంటే ముందే ముందు రోజు రాత్రి సెకండ్ షో సమయానికి రెండు సిటీల్లో స్పెషల్ షోలు పడబోతున్నాయి.
ముందు మార్చి 24న రాత్రి సెకండ్ షోకు అన్ని చోట్లా పెయిడ్ ప్రిమియర్స్ వేయాలనుకున్నా.. తర్వాత డిస్ట్రిబ్యూటర్లు ఆలోచన మార్చుకున్నారు. అవి క్యాన్సిల్ అయ్యాయి. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ టీం మెంబర్సే ముందు రోజు రాత్రి రెండు స్పెషల్ షోలు ప్లాన్ చేసుకున్నారు. అందులో ఒకటి ఎక్స్క్లూజివ్గా జూనియర్ ఎన్టీఆర్ తన వాళ్ల కోసం ప్లాన్ చేసుకున్న షో కావడం విశేషం. హైదరాబాద్ ఏఎంబీ మాల్లో ఒక స్క్రీన్ను తారక్ తీసుకున్నాడు.
తన కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులైన 50 మంది కోసం ఏర్పాటు చేసుకున్న షో ఇది. రిక్లైనర్లతో ఉండే చిన్న స్క్రీన్ను తారక్ కోసం కేటాయించారు. మరోవైపు ముంబయిలో అదే సమయానికి బాలీవుడ్ సెలబ్రెటీలు, మీడియా కోసం స్పెషల్ ప్రిమియర్ షో వేస్తున్నారట. ఆర్ఆర్ఆర్ హిందీ వెర్షన్కు ఆశించిన స్థాయిలో బుకింగ్స్ లేకపోవడంతో సెలబ్రెటీ టాక్తో హైప్ పెంచడానికి ఈ షోను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
This post was last modified on March 23, 2022 9:00 pm
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు కౌంట్డౌన్ దగ్గరపడుతోంది. మరొక్క రోజు గడువు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అసెంబ్లీ…
లోక్సభలో ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి, ఏపీ ప్రయోజనాల గురించి ప్రశ్నించిన నేతగా టీడీపీ ఎంపీ…
రెబల్ స్టార్, దివంగత కృష్ణం రాజు సతీమణి శ్యామలా దేవి అనూహ్యంగా ఎన్నికల ప్రచారం చివరి రోజు రాజకీయ ప్రచారం…
సంక్రాంతి, దసరా సెలవులు వచ్చాయి అంటే మొదట మీడియాలో వినిపించే పేరు పంతంగి. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి…
"మీ శ్రేయోభిలాషి.." అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల ప్రచారం ముగిసిన మరుక్షణం…
ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభం అయ్యేందుకు మరికొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. కానీ.. ఇంతలోనే ఏపీలో ఏదో జరుగుతోందనే…