Movie News

రాజమౌళికి త్రీడీ ఇష్టం లేకపోయినా..

ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ విడుదలకు ఇంకెంతో సమయం లేదు. ఇంకొక్క రోజు వ్యవధిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేయబోతోంది. ‘ఆర్ఆర్ఆర్’ ఇండియన్ సినిమాకు, ఇక్కడి థియేటర్లకు చాలా కొత్త అయిన, ఐమాక్స్‌ను మించిన క్వాలిటీతో ఉండే డాల్బీ విజన్లోనూ విడుదలవుతున్న సంగతి తెలిసిందే. యుఎస్‌లో ఈ టెక్నాలజీకి సింక్ అయిన థియేటర్లను పెద్ద సంఖ్యలోనే ఈ సినిమాకు కేటాయించారు.

ఆ స్క్రీన్లలో ఈ సినిమా చూడటం అద్భుత అనుభూతినిస్తుందని అంటున్నారు. మన దగ్గర ఆ తరహా థియేటర్లు అందుబాటులో లేకపోవడం నిరాశ కలిగించే విషయమే. ఐతే ఇక్కడి ప్రేక్షకులకు కాస్త భిన్నమైన అనుభూతిని పంచడానికి త్రీడీలోనూ ‘ఆర్ఆర్ఆర్’ను రిలీజ్ చేస్తుండటం తెలిసిందే. పరిమిత స్క్రీన్లలో ‘ఆర్ఆర్ఆర్’ త్రీడీ వెర్షన్ విడుదలవుతోంది. 

ఐతే విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానంగా సాగే సినిమాలకైతే త్రీడీ ఓకే అనుకోవచ్చు. కానీ ‘ఆర్ఆర్ఆర్’ లాంటి యాక్షన్ డ్రామాకు త్రీడీతో వచ్చే అదనపు ప్రయోజనం ఏముంటుందన్నది ప్రశ్న. అసలు త్రీడీ అంటే తనకు నచ్చదని చెప్పే రాజమౌళి ఈ సినిమాను ఆ వెర్షన్లో ఎందుకు రిలీజ్ చేయిస్తున్నాడన్న సందేహం కూడా కలుగుతోంది. దీనికి జక్కన్న ఓ ఇంటర్వ్యూలో బదులిచ్చాడు. తనకు బేసిగ్గా త్రీడీ అంటే నచ్చదని, గతంలో చాలాసార్లు ఈ విషయాన్ని బహిరంగంగానే చెప్పానని.. త్రీడీ చేస్తే విజన్ చిన్నదైపోతుందనే కారణంతోనే తాను దానికి దూరమని అందుకే ముందు ‘ఆర్ఆర్ఆర్’ను త్రీడీలో రిలీజ్ చేయాలన్న ఆలోచనే చేయలేదని రాజమౌళి తెలిపాడు.

ఐతే ఈ సినిమా జనవరి నుంచి వాయిదా పడ్డాక.. ఒక త్రీడీ కంపెనీ టీం తనను కలిసి సినిమా నుంచి కొన్ని షాట్లు తమకు ఇవ్వమని, త్రీడీ వర్క్ చేసి ఇస్తామని, నచ్చితేనే ఓకే చేయండని, లేదంటే వద్దని అందని.. తాను అయిష్టంగానే ఐదారొందల షాట్లను వాళ్లకు ఇచ్చానని.. వాళ్లు ఔట్ పుట్ ఇచ్చాక ‘నో’ అందామన్న ఉద్దేశంతోనే అవి చూడటానికి వెళ్లానని, ఐతే అవి చూశాక తన అభిప్రాయం మారిపోయిందని రాజమౌళి తెలిపాడు. ప్రధాన పాత్రలు మన దగ్గరగా వచ్చి భావోద్వేగాలను పంచుకుంటున్న ఫీలింగ్ కలిగిందని.. దీని వల్ల సినిమా ప్రేక్షకులకు మరింతగా చేరువ అవుతుందన్న ఉద్దేశంతో త్రీడీకి ఓకే చెప్పానని అసలు విషయం వెల్లడించాడు.

This post was last modified on March 23, 2022 2:20 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

ప‌ల్నాడులో ఆ 4 నియోజ‌క‌వ‌ర్గాలు హాట్ హాట్‌!

కేంద్ర ఎన్నిక‌ల సంఘం నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారుల వ‌ర‌కు కూడా.. అనేక జాగ్ర‌త్త‌లు తీసుకున్నా రు. అధికారుల‌ను మార్చేశారు.…

1 hour ago

కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో ఓట‌ర్ల బారులు…. సంకేతం ఏంటి?

రాష్ట్రంలో కీల‌క నాయ‌కులు పోటీ చేస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో అనూహ్య‌మైన ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ఉద‌యం 6 గంట‌ల నుంచే ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లోని…

2 hours ago

చంద్ర‌బాబు మాస్ వార్నింగ్‌… ఎవ‌రిని ఉద్దేశించి?

టీడీపీ అధినేత చంద్ర‌బాబు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఉండ‌వ‌ల్లిలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేసిన త‌ర్వాత‌.. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..…

2 hours ago

సినీ తారల సందడితో పోలింగ్ కళకళ

స్టార్లు సెలబ్రిటీలు తెరమీద, బయట కనిపించినప్పుడు వేరే సంగతి కానీ ఎన్నికల సందర్భంగా ఓటు హక్కుని వినియోగించుకోవడం కోసం పోలింగ్…

2 hours ago

క‌డ‌ప‌లో రికార్డు స్థాయి పోలింగ్‌.. అక్క చెల్లెళ్ల ఎఫెక్టేనా?

ఏపీలో జ‌రుగుతున్న పార్ల‌మెంటు, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఒక‌టి రెండు జిల్లాలు మిన‌హా.. మిగిలిన జిల్లాల్లో పోలింగ్ ప్ర‌క్రియ ఆశాజ‌న‌కంగానే సాగుతోంది.…

2 hours ago

ప‌వ‌న్ ఫ‌స్ట్ టైమ్‌.. స‌తీస‌మేతంగా ఓటేశారు..

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. అయితే.. గ‌తానికి భిన్నంగా ఆయ‌న ఈ సారి భార్య‌తో…

3 hours ago