మనం అభిమానించే సంగీత దర్శకుడి నుంచి వచ్చిన మంచి పాటలు చెప్పమంటే ఈజీగా చెప్పేస్తాం కానీ.. ఆ మ్యూజిక్ డైరెక్టర్ చేసిన పాటల్లో నచ్చనివేవో చెప్పమంటే సమాధానం కొంచెం కష్టమే. నచ్చిన పాటల్ని గుర్తు పెట్టుకుని ఠకీమని చెప్పేస్తాం కానీ.. ఏ పాట నచ్చలేదంటే మాత్రం తటపటాయించాల్సిందే.
కానీ ఏ ప్రశ్న అడిగినా ఠక్కున సమాధానం చెప్పే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం.. తన పాటల్లో నచ్చనివేవో చెప్పమంటే వెంటనే బదులిచ్చేశాడు. అక్కినేని నాగార్జున సినిమా ఘరానా బుల్లోడులోని భీమవరం బుల్లోడా పాట అంటే తనకు నచ్చదని చెప్పాడు. ఈ సినిమాకు కీరవాణే సంగీత దర్శకుడన్న సంగతి తెలిసిందే. ఆ చిత్రంలోని హిట్ పాటల్లో భీమవరం బుల్లోడా.. కూడా ఒకటి. అప్పట్లో అది సూపర్ హిట్టయింది కూడా. ఐతే మాస్ ప్రేక్షకులు బాగా మెచ్చిన ఆ పాట.. తారక్కు మాత్రం అస్సలు ఇష్టం లేదట.
ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లలో భాగంగా రామ్ చరణ్, కీరవాణిలతో కలిసి ఓ చిట్ చాట్ కార్యక్రమంలో పాల్గొన్న తారక్.. ఎందుకో తెలియదు కానీ తనకు భీమవరం బుల్లోడా పాట అంటే చిరాకని చెప్పాడు. ముఖ్యంగా అందులోని లిరిక్స్ పట్ల తనకు అభ్యంతరాలున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఆ పాట పాడి వినిపిస్తూ జింకు చకుం అనే సౌండ్ దగ్గర తారక్ ఇబ్బందిగా ఫీలవడం కనిపించింది.
ఆ పాటలో కొంతమేర బూతు టచ్ ఉన్నట్లుగా అనిపిస్తుంది. అదే తారక్కు ఇబ్బందిగా మారి ఉండొచ్చు. ఐతే తన పాటల్లో నచ్చనిదేదైనా ఉందా అని చరణ్ను అడిగితే అతను సమాధానం చెప్పలేకపోయాడు. గత ఏడాది రిలీజైన ఒక సినిమాలో పాట తనకు నచ్చలేదన్నాడు కానీ, ఆ సినిమా ఏదో ఆ పాటేదో గుర్తులేదు అన్నాడు. ఐతే భీమవరం బుల్లోడా పాట సంగతేమో కానీ.. కీరవాణి సంగీతం అంటే తారక్కు చాలా ఇష్టం. ఆయన స్వరపరిచిన రాలిపోయే పువ్వా పాటకు తాను ఎంతో ఎమోషనల్గా కనెక్ట్ అయినట్లు గతంలో చెప్పాడు. ఇక తారక్ అంటే కీరవాణికి అమితమైన అభిమానం. తనతో పాటు తమ కుటుంబంలో అందరూ తారక్ ఫ్యాన్సే అని, అతణ్ని తమ కుటుంబంలో ఒకడిగా భావిస్తామని చెబుతుంటాడు కీరవాణి.
This post was last modified on March 22, 2022 11:38 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…