మనం అభిమానించే సంగీత దర్శకుడి నుంచి వచ్చిన మంచి పాటలు చెప్పమంటే ఈజీగా చెప్పేస్తాం కానీ.. ఆ మ్యూజిక్ డైరెక్టర్ చేసిన పాటల్లో నచ్చనివేవో చెప్పమంటే సమాధానం కొంచెం కష్టమే. నచ్చిన పాటల్ని గుర్తు పెట్టుకుని ఠకీమని చెప్పేస్తాం కానీ.. ఏ పాట నచ్చలేదంటే మాత్రం తటపటాయించాల్సిందే.
కానీ ఏ ప్రశ్న అడిగినా ఠక్కున సమాధానం చెప్పే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం.. తన పాటల్లో నచ్చనివేవో చెప్పమంటే వెంటనే బదులిచ్చేశాడు. అక్కినేని నాగార్జున సినిమా ఘరానా బుల్లోడులోని భీమవరం బుల్లోడా పాట అంటే తనకు నచ్చదని చెప్పాడు. ఈ సినిమాకు కీరవాణే సంగీత దర్శకుడన్న సంగతి తెలిసిందే. ఆ చిత్రంలోని హిట్ పాటల్లో భీమవరం బుల్లోడా.. కూడా ఒకటి. అప్పట్లో అది సూపర్ హిట్టయింది కూడా. ఐతే మాస్ ప్రేక్షకులు బాగా మెచ్చిన ఆ పాట.. తారక్కు మాత్రం అస్సలు ఇష్టం లేదట.
ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లలో భాగంగా రామ్ చరణ్, కీరవాణిలతో కలిసి ఓ చిట్ చాట్ కార్యక్రమంలో పాల్గొన్న తారక్.. ఎందుకో తెలియదు కానీ తనకు భీమవరం బుల్లోడా పాట అంటే చిరాకని చెప్పాడు. ముఖ్యంగా అందులోని లిరిక్స్ పట్ల తనకు అభ్యంతరాలున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఆ పాట పాడి వినిపిస్తూ జింకు చకుం అనే సౌండ్ దగ్గర తారక్ ఇబ్బందిగా ఫీలవడం కనిపించింది.
ఆ పాటలో కొంతమేర బూతు టచ్ ఉన్నట్లుగా అనిపిస్తుంది. అదే తారక్కు ఇబ్బందిగా మారి ఉండొచ్చు. ఐతే తన పాటల్లో నచ్చనిదేదైనా ఉందా అని చరణ్ను అడిగితే అతను సమాధానం చెప్పలేకపోయాడు. గత ఏడాది రిలీజైన ఒక సినిమాలో పాట తనకు నచ్చలేదన్నాడు కానీ, ఆ సినిమా ఏదో ఆ పాటేదో గుర్తులేదు అన్నాడు. ఐతే భీమవరం బుల్లోడా పాట సంగతేమో కానీ.. కీరవాణి సంగీతం అంటే తారక్కు చాలా ఇష్టం. ఆయన స్వరపరిచిన రాలిపోయే పువ్వా పాటకు తాను ఎంతో ఎమోషనల్గా కనెక్ట్ అయినట్లు గతంలో చెప్పాడు. ఇక తారక్ అంటే కీరవాణికి అమితమైన అభిమానం. తనతో పాటు తమ కుటుంబంలో అందరూ తారక్ ఫ్యాన్సే అని, అతణ్ని తమ కుటుంబంలో ఒకడిగా భావిస్తామని చెబుతుంటాడు కీరవాణి.
This post was last modified on March 22, 2022 11:38 am
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…
యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో అధికారం చేజిక్కించుకోవాలన్న కమలం ఆశలమీద ఆయా…
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లో కొన్న 681 గజాల స్థలం విషయంలో వివాదం నెలకొందని, ఆ స్థలం…
రాజకీయాల్లో సెంటిమెంటుకు ఛాన్స్ ఎక్కువ. ఉద్ధండ నాయకుల నుంచి చరిత్ర సొంతం చేసుకున్న పార్టీల వరక కూడా సెంటి మెంటుకు…
వైసీపీ నాయకులు సహా సలహాదారు సజ్జల రామకృష్నారెడ్డి కళ్లలో భయం కనిపిస్తోందని ఆ పార్టీ రెబల్ ఎంపీ, ఉండి నుంచి…