ఒక్క సినిమాతో ఒక హీరో మార్కెట్ పది రెట్లకు మించి పెరిగింది. ఇండియా మొత్తం ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ విస్తరించింది. పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇలాంటి హీరోతో వరుసగా రెండు సినిమాలు చేసే అవకాశం లభిస్తే ఆ నిర్మాతలకు అంతకంటే ఆనందం ఏముంది? బంపర్ ఆఫర్లు కొట్టేసినట్లే కదా. కథల ఎంపికలో పక్కాగా ఉండి.. మేకింగ్ పరంగా అన్ని జాగ్రత్తలూ తీసుకుని.. ఆ హీరో స్థాయికి తగ్గ సినిమాలు తీసి తాము మంచి లాభాలు అందుకోవడంతో పాటు అందరినీ సంతోష పెట్టాలి కదా? కానీ యువి క్రియేషన్స్ వాళ్లు బంగారం లాంటి ఈ ఛాన్సుల్ని వృథా చేసుకున్నారు.
‘బాహుబలి’ తర్వాత ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్గా ఎదిగిన ప్రభాస్తో.. వెంటనే వరుసగా రెండు సినిమాలు చేసే అవకాశాలు వస్తే వాటిని వాళ్లు సరిగా ఉపయోగించుకోలేదు. రెండేళ్ల ముందు ‘సాహో’, ఇప్పుడు ‘రాధేశ్యామ్’ చిత్రాలతో ప్రభాస్కు చేదు అనుభవాలను మిగిల్చారు. అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేశారు.యువి క్రియేషన్స్ అంటే ముందు నుంచి ప్రభాస్ అభిమానులకు ప్రతికూల అభిప్రాయమే ఉంది.
సినిమాలను సరిగా ప్రమోట్ చేయరని, షూటింగ్ మరీ ఆలస్యం చేస్తారని, సరైన సమయంలో అప్డేట్స్ ఇవ్వరని.. ఇలా వారి నుంచి చాలా కంప్లైంట్లే ఉన్నాయి ప్రభాస్ ఫ్యాన్స్లో. ఆ సంస్థకు వ్యతిరేకంగా దాని ఆఫీస్ ముందు గొడవ చేసే వరకు వెళ్లింది ఒక దశలో పరిస్థితి. ఐతే మేకింగ్ టైంలో వాళ్లు ఏం చేసినా, ఎలా వ్యవహరించినా.. సరైన సినిమాలు తీస్తే అదే చాలనుకున్నారు. కానీ రెండు సినిమాల విషయంలోనూ నిరాశనే మిగిల్చారు.
ప్రభాస్ అన్నీ యువి వాళ్లకు వదిలేస్తే.. వాళ్లు దర్శకులు, కథల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరించలేదని.. కంటెంట్ మీద కాకుండా అదనపు హంగుల మీదే దృష్టిపెట్టారని.. అయిన కాడికి బడ్జెట్లు పెట్టడం, డాబు చూపించడం తప్పితే.. సినిమాకు అత్యంత కీలకమైన కథాకథనాల మీద దృష్టిపెట్టలేదని.. అందుకే ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయని.. వాళ్ల వరకు రెండు సినిమాలకూ బాగానే బిజినెస్ చేసుకుని బయటపడ్డా.. బయ్యర్లు మునిగిపోయారని, అభిమానులకూ ఆవేదనే మిగిలందని యువి అధినేతలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
This post was last modified on March 16, 2022 3:40 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…