తమిళంలో స్వశక్తితో ఎంతో కష్టపడి పెద్ద స్టార్గా ఎదిగిన నటుడు ధనుష్. వైవిధ్యమైన సినిమాలే అతణ్ని ఆ స్థాయికి తీసుకొచ్చాయి. ఐతే ఈ మధ్య అతణ్నుంచి స్థాయికి తగ్గ సినిమాలు రావట్లేదు. కర్ణన్ మినహాయిస్తే ఆకట్టుకున్న సినిమాలు పెద్దగా లేవు. ఆ చిత్రం కూడా కరోనా టైంలో ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేదు. దాని తర్వాత యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ధనుష్ నటించిన జగమే తంత్రం మీద అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
దీని ప్రోమోలు చూస్తే హాలీవుడ్ రేంజ్ సినిమాలా కనిపించింది. కానీ గత ఏడాది థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి నెట్ ఫ్లిక్స్ ద్వారా నేరుగా రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురి చేసింది. సినిమాలో విషయం లేకపోవడం వల్ల దీన్ని ఓటీటికి ఇచ్చి వదిలించుకున్నారంటూ విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఐతే ఇప్పుడు ధనుష్ నుంచి వచ్చిన మరో సినిమా సైతం ఇలాంటి విమర్శలే ఎదుర్కొంటోంది. ధనుష్, మాళవిక మోహనన్ జంటగా మరో యంగ్ డైరెక్టర్ కార్తీక్ నరేన్ రూపొందించిన సినిమా.. మారన్. ఈ సినిమా షూటింగ్ మధ్య దశలో ఉండగానే ఓటీటీ డీల్ కుదిరింది. ఇప్పుడు థియేటర్లలోనే సినిమాను రిలీజ్ చేయడానికి అనుకూల పరిస్థితులున్నప్పటికీ ముందే కుదిరిన ఒప్పందం మేరకు హాట్ స్టార్లో మారన్ను రిలీజ్ చేశారు.
ధనుష్ తొలిసారి జర్నలిస్ట్ పాత్ర చేసిన సినిమా ఇది. ట్రైలర్ చూస్తే పర్వాలేదనిపించింది కానీ.. సినిమా చూసిన వాళ్లకు తీవ్ర నిరాశ తప్పలేదు. మరీ రొటీన్గా సాగిపోయిన ఈ మాస్ మసాలా మూవీ చూసి ప్రేక్షకులు దండం పెట్టేస్తున్నారు. ఈ చిత్రం తెలుగులోనూ అందుబాటులో ఉంది. థియేటర్లలో రిలీజైతే డిజాస్టర్ అయ్యేదని.. ఓటీటీకి ఇచ్చేసి నిర్మాత బాగానే బయటపడ్డాడని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.
This post was last modified on March 13, 2022 3:56 pm
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం దేశ రాజధాని డిల్లీ చేరుకున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి…
తమిళ స్టార్ హీరో విజయ్ చివరి సినిమాగా నిర్మాణంలో ఉన్న జన నాయగన్ విడుదల తేదీ వచ్చేసింది. 2026 జనవరి…
ఈ వారం విడుదల కాబోతున్న ఎల్2 ఎంపురాన్ మొదటి భాగం లూసిఫర్ ని తెలుగు ప్రేక్షకులు ఓటిటిలో భారీగానే చూశారు.…
ఏపీ గిరి పుత్రులు పండిస్తున్న సేంద్రీయ అరకు కాఫీ రుచులు విశ్వవ్యాప్తంగా విస్తరించాలన్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గడపగా ముద్రపడ్డ కడపలో వేగంగా రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. మొన్నటి సార్వత్రిక…
వైసీపీ నాయకుడు, అసెంబ్లీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వంతు వచ్చింది. ఆయన గతంలో ఎన్నికల అఫిడవిట్లో సమర్పించిన డిగ్రీ…