టాలీవుడ్ లో ప్రముఖ సినీ గేయ రచయిత, కవి కందికొండ యాదగిరి (49) కన్నుమూశారు. హైదరాబాద్లోని వెంగళరావు నగర్లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా క్యాన్సర్ తో పాటు వెన్నెముక సంబంధిత వ్యాధితో బాధపడుతున్న కందికొండ ఆరోగ్య పరిస్థితి విషయమించి శనివారం సాయంత్రం మృతి చెందారు. క్యాన్సర్ మహమ్మారితో రెండేళ్లు పోరాడిన కందికొండ..ప్రస్తుతం పెరాలసిస్ కు చికిత్స తీసుకుంటున్నారు.
క్యాన్సర్ చికిత్సలో భాగంగా చాలాకాలం కీమో థెరపీ చేయించుకోవడంతో కందికొండ స్పైనల్కార్డ్ లోని సీ1, సీ2 భాగాలు దెబ్బతిన్నాయి. దీంతో కందికొండ నడవలేని స్థితిలోకి వెళ్లిపోయారు. కందికొండ అనారోగ్యం బారినపడడంతో ఆర్థిక సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఆయన కుటుంబానికి ఇటీవల మంత్రి కేటీఆర్ ఆర్థిక సాయం చేశారు. కందికొండకు ప్రభుత్వం తరఫున చికిత్స అందించారు.
కొద్ది రోజుల క్రితం కందికొండ ఆరోగ్యం మెరుగైనట్లు కనిపించినా..తాజాగా మరోమారు క్షీణించి శనివారం తుది శ్వాస విడిచారు. కందికొండ అంత్యక్రియలు రేపు హైదరాబాద్ లో జరగనున్నాయి. కందికొండ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు.
వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన కందికొండ యాదగిరి.. ఉస్మానియా వర్సిటీలో ఎంఏ తెలుగు, ఎంఏ పాలిటిక్స్ చదివారు. తెలుగు సాహిత్యంపై మక్కువతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. “ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం”లో “మళ్లి కూయవే గువ్వా..” పాటతో కందికొండ అరంగేట్రం చేశారు. తొలి పాట హిట్ కావడంతో ఆ తర్వాత ఇడియట్, సత్యం, పోకిరి, లవ్లీ, నీది నాది ఒకే కథ.. తదితర చిత్రాలకు అద్భుతమైన పాటలు రాశారు. 20ఏళ్ల ప్రస్థానంలో దాదాపు 1300కు పైగా పాటలు రాసిన కందికొండ…బతుకమ్మ.. తెలంగాణ జానపదాలను వెలుగులోకి తెచ్చిన వారిలో ఒకరు. తెలంగాణ యాసలో మనసుకు హత్తుకునేలా కవిత్వం రాయడం, మట్టి మనుషుల వెతలను.. పల్లె బతుకు చిత్రాన్ని కళ్లకు కట్టే కథకుడిగా ఆయనకు మంచి పేరుంది.
This post was last modified on March 12, 2022 10:04 pm
తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు జిఓ కోసం ఎదురు చూసిన మైత్రి సంస్థకు చివరికి అది జరిగే సూచనలు లేకపోవడంతో…
'ద హండ్రెడ్' వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను సన్రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడం ఊహించని వివాదానికి దారితీస్తోంది. ఈ…
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో కూడా సంచలనంగా మారిన మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ వ్యవహారం…
టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద స్టార్లలో ఒకడైనప్పటికీ చాలా సింపుల్ గా ఉంటాడు పవన్ కళ్యాణ్. తనో పెద్ద స్టార్…
ఏప్రిల్ 30 ఎంతో దూరం లేదు. కేవలం నలభై నాలుగు రోజులే బ్యాలన్స్. షూట్, పోస్ట్ ప్రొడక్షన్, రీ రికార్డింగ్,…
నైజామ్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా మొదలుపెట్టకపోవడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలకు ఇంకా…