ఎంతైనా మాస్ సినిమా మాస్ సినిమానే అని మరోసారి రుజువైంది. ప్రభాస్ చివరి సినిమా ‘సాహో’కు వచ్చిన ఓపెనింగ్స్కు, ఇప్పుడు వచ్చిన ఆరంభ వసూళ్లకు పొంతనే కనిపించడం లేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల వరకు ‘రాధేశ్యామ్’ ఓపెనింగ్స్ ఓకే అనిపిస్తున్నా.. వేరే ప్రాంతాల్లో మాత్రం మరీ పూర్గా అనిపిస్తున్నాయి. ఉత్తరాది ప్రేక్షకులకైతే ‘రాధేశ్యామ్’ మీద ఏమాత్రం ఆసక్తి లేదనిపిస్తోంది.
అక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా కీలక పాత్రల్లో వేరే నటీనటుల్ని పెట్టి.. అలాగే సంగీతం కూడా వేరే వాళ్లతో చేయించుకుని ఎంతగా ‘రాధేశ్యామ్’కు అక్కడి వాళ్లకు నచ్చేలా తీర్చిదిద్దినా ఆ ప్రయత్నం పెద్దగా ఫలించినట్లు లేదు. కొన్నేళ్ల నుంచి మాస్ మసాలా, యాక్షన్ ప్రధాన సినిమాలనే ఎక్కువ ఆదరిస్తున్న అక్కడి ప్రేక్షకులకు ‘రాధేశ్యామ్’ లాంటి క్లాస్ లవ్ స్టోరీ పట్ల ఆసక్తి లేదని అడ్వాన్స్ బుకింగ్స్తోనే తేలిపోయింది.
ఇక వసూళ్లు చూస్తే ఈ విషయం మరింత స్పష్టంగా తెలిసిపోతోంది.‘సాహో’తో పోలిస్తే తొలి రోజు హిందీలో ‘రాధేశ్యామ్’ వసూళ్లు నాలుగో వంతు కూడా లేకపోవడం అనూహ్యం. ‘సాహో’ తొలి రోజు నార్త్ ఇండియాలో హిందీ వెర్షన్ ద్వారా రూ.25 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టడం విశేషం. కానీ ‘రాధేశ్యామ్’ హిందీ వెర్షన్ డే-1 నెట్ కలెక్షన్లు కేవలం 4.6 కోట్లు మాత్రమేనట. ‘సాహో’కు డిజాస్టర్ టాక్ వచ్చినా.. ఆ స్థాయిలో వసూళ్లు రాబట్టగా, దాంతో పోలిస్తే ‘రాధేశ్యామ్’కు బెటర్ టాకే వచ్చినా కలెక్షన్లు ఇంత అథమ స్థాయిలో ఉన్నాయి.
మారుతున్న ఉత్తరాది ప్రేక్షకుల అభిరుచిని ‘రాధేశ్యామ్’ అర్థం చేసుకోలేకపోయిందన్నది స్పష్టం. పరిస్థితి చూస్తుంటే ‘రాధేశ్యామ్’కు 20-25 కోట్లకు మించి నెట్ కలెక్షన్లు వచ్చేలా లేదు. ‘సాహో’ అంత బ్యాడ్ టాక్తోనూ అక్కడ రూ.150 కోట్ల మార్కును టచ్ చేసి హిట్ స్టేటస్ అందుకోవడం విశేషం. దీన్ని బట్టి ప్రభాస్ మళ్లీ ఇలాంటి క్లాస్ లవ్ స్టోరీల జోలికి వెళ్లకపోవడమే మంచిది. తన నుంచి ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో అదే ఇస్తే బెటర్.
This post was last modified on March 12, 2022 4:52 pm
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. నోబెల్ ప్రపంచ శాంతి పురస్కారం కోసం వేయి కళ్లతో ఎదురు చూసిన విషయం తెలిసిందే.…