ఎంతైనా మాస్ సినిమా మాస్ సినిమానే అని మరోసారి రుజువైంది. ప్రభాస్ చివరి సినిమా ‘సాహో’కు వచ్చిన ఓపెనింగ్స్కు, ఇప్పుడు వచ్చిన ఆరంభ వసూళ్లకు పొంతనే కనిపించడం లేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల వరకు ‘రాధేశ్యామ్’ ఓపెనింగ్స్ ఓకే అనిపిస్తున్నా.. వేరే ప్రాంతాల్లో మాత్రం మరీ పూర్గా అనిపిస్తున్నాయి. ఉత్తరాది ప్రేక్షకులకైతే ‘రాధేశ్యామ్’ మీద ఏమాత్రం ఆసక్తి లేదనిపిస్తోంది.
అక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా కీలక పాత్రల్లో వేరే నటీనటుల్ని పెట్టి.. అలాగే సంగీతం కూడా వేరే వాళ్లతో చేయించుకుని ఎంతగా ‘రాధేశ్యామ్’కు అక్కడి వాళ్లకు నచ్చేలా తీర్చిదిద్దినా ఆ ప్రయత్నం పెద్దగా ఫలించినట్లు లేదు. కొన్నేళ్ల నుంచి మాస్ మసాలా, యాక్షన్ ప్రధాన సినిమాలనే ఎక్కువ ఆదరిస్తున్న అక్కడి ప్రేక్షకులకు ‘రాధేశ్యామ్’ లాంటి క్లాస్ లవ్ స్టోరీ పట్ల ఆసక్తి లేదని అడ్వాన్స్ బుకింగ్స్తోనే తేలిపోయింది.
ఇక వసూళ్లు చూస్తే ఈ విషయం మరింత స్పష్టంగా తెలిసిపోతోంది.‘సాహో’తో పోలిస్తే తొలి రోజు హిందీలో ‘రాధేశ్యామ్’ వసూళ్లు నాలుగో వంతు కూడా లేకపోవడం అనూహ్యం. ‘సాహో’ తొలి రోజు నార్త్ ఇండియాలో హిందీ వెర్షన్ ద్వారా రూ.25 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టడం విశేషం. కానీ ‘రాధేశ్యామ్’ హిందీ వెర్షన్ డే-1 నెట్ కలెక్షన్లు కేవలం 4.6 కోట్లు మాత్రమేనట. ‘సాహో’కు డిజాస్టర్ టాక్ వచ్చినా.. ఆ స్థాయిలో వసూళ్లు రాబట్టగా, దాంతో పోలిస్తే ‘రాధేశ్యామ్’కు బెటర్ టాకే వచ్చినా కలెక్షన్లు ఇంత అథమ స్థాయిలో ఉన్నాయి.
మారుతున్న ఉత్తరాది ప్రేక్షకుల అభిరుచిని ‘రాధేశ్యామ్’ అర్థం చేసుకోలేకపోయిందన్నది స్పష్టం. పరిస్థితి చూస్తుంటే ‘రాధేశ్యామ్’కు 20-25 కోట్లకు మించి నెట్ కలెక్షన్లు వచ్చేలా లేదు. ‘సాహో’ అంత బ్యాడ్ టాక్తోనూ అక్కడ రూ.150 కోట్ల మార్కును టచ్ చేసి హిట్ స్టేటస్ అందుకోవడం విశేషం. దీన్ని బట్టి ప్రభాస్ మళ్లీ ఇలాంటి క్లాస్ లవ్ స్టోరీల జోలికి వెళ్లకపోవడమే మంచిది. తన నుంచి ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో అదే ఇస్తే బెటర్.
This post was last modified on March 12, 2022 4:52 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…