హమ్మయ్య.. సమస్య పరిష్కారం అయిపోయింది. ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్లకు సంబంధించి కొత్త రేట్ల జీవో వచ్చేసింది. హీరో హీరోయిన్లు, దర్శకుడి పారితోషకం కాకుండా వంద కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కిన సినిమాలకు తొలి పది రోజులు టికెట్ల ధరలు పెంచుకునే అవకాశం కూడా ఇచ్చేశారు. ఇంకేముంది ఈ శుక్రవారం రిలీజవుతున్న భారీ చిత్రం రాధేశ్యామ్కు ప్రయోజనం దక్కబోతోందని ఆ సినిమాను నమ్ముకున్న వాళ్లంతా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు.
కానీ వారి ఉత్సాహంపై నీళ్లు చల్లేసింది జగన్ సర్కారు. ఆంధ్రప్రదేశ్లో 20 శాతం షూటింగ్ జరిగిన చిత్రాలకే ఈ ఆఫర్ అంటూ జీవోలో పెట్టిన మెలికను బయటికి తీసి ఆ చిత్రానికి రేట్లు పెంచుకునే అవకాశం లేకుండా చేశారు. మార్చి 25న రాబోతున్న ఆర్ఆర్ఆర్ చిత్రానికి కూడా ఇదే వర్తించబోతోంది. సాధారణ రేట్లకే ఈ సినిమా టికెట్లనూ అమ్మక తప్పదు.
ఐతే ఎప్పుడో రెండు మూడేళ్ల ముందు షూటింగ్ మొదలుపెట్టుకుని గత ఏడాదే చిత్రీకరణ పూర్తి చేసుకున్న చిత్రాలకు నిన్న కాక మొన్న రిలీజైన జీవోను వర్తింపజేయడం.. ఏపీలో 20 శాతం షూటింగ్ అనే మెలిక పెట్టి వాటికి గండి కొట్టడం ఏం లాజిక్కో అర్థం కావడం లేదు జనాలకు. నిజానికి ఈ విషయం ఇంతకుముందే చర్చకు వచ్చింది. ఈ రెండు చిత్రాలూ ముందే షూటింగ్ పూర్తి చేసుకున్నాయి కాబట్టి వీటికి ఆ నిబంధన వర్తించదని, రేట్లు పెంచుకోవచ్చని మంత్రి పేర్ని నాని స్పష్టత ఇచ్చారు.
కానీ రాధేశ్యామ్ రిలీజ్ టైంకి కథ మారిపోయింది. రేట్ల పెంపుతో టికెట్లు అమ్ముదామని.. ఈ మేరకు స్పష్టత వస్తుందని.. ఈ సినిమాకు బుధవారం వరకు బుకింగ్సే ఓపెన్ చేయలేదు ఎక్కడా. గురువారం కూడా మధ్యాహ్నం వరకు ఎక్కడా బుకింగ్సే మొదలు కాలేదు. కానీ రేట్ల పెంపు లేదని చావు కబురు చల్లగా చెప్పారు. దీంతో సాయంత్రం హడావుడిగా సాధారణ రేట్లతో బుకింగ్స్ మొదలయ్యాయి. ఈ ఆలస్యం వల్ల వసూళ్లపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది.
This post was last modified on March 10, 2022 10:37 pm
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…