ప్రభాస్ కొత్త సినిమా ‘రాధేశ్యామ్’ ఇంకో రెండు రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అందుకు తగ్గట్లే రికార్డు స్థాయిలో సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ‘బాహుబలి’, ‘సాహో’ చిత్రాలక దీటుగా ‘రాధేశ్యామ్’ రిలీజవుతుండటం విశేషం. ఈ సినిమా విజయంపై చిత్ర బృందం చాలా ధీమాగానే కనిపిస్తోంది. సినిమాకు సెన్సార్ టాక్ కూడా పాజిటివ్గా వచ్చినట్లు వార్తలొచ్చాయి.
ఈ నేపథ్యంలో ‘రాధేశ్యామ్’కు ముందు రోజు రాత్రి పెయిడ్ ప్రిమియర్స్ వేయబోతున్నట్లుగా రెండు రోజుల ముందు ప్రచారం జరిగింది. బాహుబలి-2, అర్జున్ రెడ్డి సహా కొన్ని చిత్రాలకు రిలీజ్ రోజు కంటే ముందు రోజే సెకండ్ షోల నుంచి పెయిడ్ ప్రిమియర్స్ వేయడం తెలిసిందే. ఇదే తరహాలో ‘రాధేశ్యామ్’కు కూడా ప్లానింగ్ జరిగినట్లు జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆ ఆలోచన విరమించుకున్నట్లు తెలుస్తోంది.మధ్యలో ‘రాధేశ్యామ్’ చిత్రాన్ని కొందరు సినీ ప్రముఖులకు స్పెషల్ షో వేసినట్లు సమాచారం.
ఆ షో చూసిన వాళ్లు సినిమా బాగుందంటూనే కమర్షియల్ సక్సెస్ మీద సందేహాలు వ్యక్తం చేశారట. సినిమాను జనాలు అర్థం చేసుకుని ఆదరించడానికి టైం పట్టొచ్చని.. పెయిడ్ ప్రిమియర్స్ వస్తే డివైడ్ టాక్ రావచ్చని.. సినిమా ఫలితంపై ప్రభావం చూపొచ్చని.. అందుకే పెయిడ్ ప్రిమియర్స్ వద్దని వారించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
చిత్ర యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం పెయిడ్ ప్రిమియర్స్ అయితే క్యాన్సిల్ అయ్యాయి. ఐతే తెలంగాణలో ఐదో షోకు అనుమతి రావడం లాంఛనమే అని తెలుస్తోంది. ఉదయం 7 గంటలకే తొలి షో పడబోతోంది. అలాగే తెల్లవారుజామన 4 గంటలకు హైదరాబాద్లోని కూకట్ పల్లిలో ఒకటి రెడు థియేటర్లలో బెనిఫిట్ షోలు వేయబోతున్నారు. ఏపీలో అయితే బెనిఫిట్ షోలకు ఛాన్స్ లేనట్లే తెలుస్తోంది. అక్కడ ఐదో షో విషయంలో ఇటీవల మార్గదర్శకాలు వచ్చినా.. అందులో కొన్ని మెలికలున్నాయి. మరి మార్నింగ్ షో కంటే ముందు ఒకషో పడుతుందో లేదో క్లారిటీ లేదు.
This post was last modified on March 9, 2022 2:22 pm
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో, భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా గురించి జనాలు…