Movie News

‘రాధేశ్యామ్’కు నో చెబుదామనుకుని..

‘బాహుబలి’తో ఇండియాలో ఏ హీరోకే లేనంత మాస్ ఇమేజ్ వచ్చింది ప్రభాస్‌కు. ఆ ఇమేజ్‌కు సరితూగే కథలు ఎంచుకుని పకడ్బందీగా సినిమాలు తీయడం ఇప్పుడు దర్శకులకు సవాలుగా మారింది. ‘సాహో’లో ఎంత ఎలివేషన్లు, యాక్షన్ నింపినా కూడా అది ప్రేక్షకులకు రుచించలేదు. అలాంటిది యాక్షన్ పూర్తిగా పక్కన పెట్టి పూర్తి స్థాయి ప్రేమకథా చిత్రాన్ని ప్రభాస్ చేస్తే అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న భయాలు కచ్చితంగా అందరికీ ఉంటాయి.

నిజానికి ఈ ఊహ కూడా అభిమానులకు ఉండి ఉండదు. కానీ ప్రభాస్ ‘రాధేశ్యామ్’ రూపంలో ప్రేమకథతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఇది పక్కా లవ్ స్టోరీ.. పైగా ఇందులో హీరోలు జ్యోతిష్య నిపుణుడి పాత్రను చేయడం ఇంకా చిత్రం. నిజానికి ఈ పాయింట్ విని ప్రభాస్ అసలు ఈ సినిమానే చేయొద్దని అనుకున్నాడట.

బేసిగ్గా ప్రభాస్‌కు జ్యోతిష్యం మీద నమ్మకాలు లేవట. దీంతో హీరో జ్యోతిష్యుడు అనేసరికి ఈ సినిమా చేయొద్దని భావించాడట. దర్శకుడు రాధాకృష్ణ కుమార్ కథ చెప్పడం మొదలుపెట్టాక మధ్యలో ‘నో’ చెప్పేద్దామని ప్రభాస్ అనుకున్నాడట. కానీ కథ వినడం మొదలుపెట్టాక ఎక్కడా ఆపబుద్ధి కాలేదని.. చాలా ఆసక్తికరంగా అనిపించి మొత్తం విన్నానని, సినిమా చేయడానికి సిద్ధపడ్డానని ప్రభాస్ తెలిపాడు.

ఇక ‘రాధేశ్యామ్’లో ఫైట్ల గురించి ఆశలేమీ పెట్టుకోవద్దని ప్రభాస్ ముందే అభిమానులకు స్పష్టం చేశాడు. సినిమాలో ఒక్క ఫైట్ కూడా ఉండదని తేల్చేశాడు. కానీ యాక్షన్ మాత్రం ఉంటుందని.. అదేంటన్నది తెర మీదే చూడాలని చెప్పాడు. సినిమాలో హైలైట్లుగా చెప్పుకోదగ్గ అంశాలు చాలా ఉన్నాయని.. ముఖ్యంగా 13 నిమిషాల పాటు సాగే పతాక సన్నివేశం గొప్పగా ఉంటుందని.. ఈ ఒక్క సన్నివేశం కోసం దర్శకుడు రాధాకృష్ణ రెండేళ్లు కష్టపడ్డాడని, తన కెరీర్లో తీసుకున్న అతి పెద్ద రిస్క్ ఈ సినిమానే అని ప్రభాస్ చెప్పాడు.

This post was last modified on March 8, 2022 5:43 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

2 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

5 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

8 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

8 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

11 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

13 hours ago