ప్రత్యర్థి ఎంత బలంగా ఉంటే నాయకుడిలోని బలం అంతగా బైటికొస్తుంది. రాజకీయాలకే కాదు.. సినిమాలకు కూడా ఇది బాగా వర్తిస్తుంది. విలన్ ఎంత స్ట్రాంగ్ అయితే హీరోయిజం అంతగా ఎలివేట్ అవుతుంది. అందులోనూ బాలకృష్ణ లాంటి హై ఎనర్జిటిక్ హీరోకి విలన్ అంటే ఎలా ఉండాలి! అందుకే ఈమధ్య ఆయన సినిమాల్లో విలన్ల మీద స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు దర్శకులు.
నిజానికి బాలకృష్ణ సినిమాల్లో విలన్లు ఎప్పుడూ బలంగానే ఉంటారు. అయితే ఈమధ్య హీరోగా ఆయన తన శైలిని కాస్త మార్చుకున్నట్టే.. ఆయన సినిమాల్లోని విలన్లకి కూడా విలక్షణ శైలి ఉండేలా చూస్తున్నారు మేకర్స్. ఉదాహరణకి గత సినిమాలో శ్రీకాంత్. అప్పుడప్పుడు నెగిటివ్ రోల్స్ చేసినా.. శ్రీకాంత్ నుంచి ఇంత భయంకరమైన విలన్ని బయటికి తీయవచ్చనేది ఊహించని విషయం. అతనిని నెటివివ్ పాత్రలో బోయపాటి ఎలివేట్ చేసిన తీరు మామూలుగా లేదు. బాలయ్య పర్సనాలిటీకి, అగ్రెషన్కి ఏమాత్రం తీసిపోకుండా పోటాపోటీగా నిలిచి మెప్పించాడు శ్రీకాంత్.
బాలయ్య నెక్స్ట్ సినిమా విషయంలోనూ విలన్ పాత్రపై ప్రత్యేక దృష్టి ఉంది. అందుకే ఆయనతో పోరాడటానికి కన్నడ సీమ నుంచి దునియా విజయ్ని దింపుతున్నాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. నిన్ననే సెట్లో కూడా జాయినయ్యాడు తను. ముద్దుగా ఇతన్ని విజి అని పిలుస్తుంటారంతా. మనవాళ్లకి తన గురించి అంతగా తెలియదు కానీ కన్నడిగులకి మాత్రం బాగా తెలుసు. ఇప్పటికే తన పర్ఫార్మెన్స్తో శాండిల్వుడ్ ప్రేక్షకుల మనసులు దోచేశాడు విజయ్. జూనియర్ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ యాక్టర్ అయిపోయాడు.
తన సినిమాలు చూసినవాళ్లు ఎవరైనా చెప్పగలరు.. బాలకృష్ణకి పర్ఫెక్ట్ విలన్ అవుతాడని. గోపీచంద్ కూడా విలన్లకు డిఫరెంట్ క్యారెక్టరయిజేషన్ ప్లాన్ చేస్తుంటాడు. మరి విజయ్ని ఎలా తయారు చేస్తాడో చూడాలి. పైగా ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్కుమార్ కూడా కీలక పాత్ర చేస్తోందని ప్రకటించారు. తనది కూడా నెగిటివ్ రోల్ అని టాక్. అదే నిజమైతే పోరు మామూలుగా ఉండదు. ఎందుకంటే విలనీని ప్రదర్శించడంలో వరలక్ష్మి ముందు మేల్ యాక్టర్స్ కూడా తేలిపోతారు. కాబట్టి ఆమె విలన్ అయితే మామూలుగా ఉండదు. అయినా బాలయ్యకి విలన్గా నటించాలంటే ఈ రేంజ్ యాక్టర్స్ ఉండాలి మరి!
This post was last modified on March 8, 2022 4:34 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…