యువ కథానాయకుడు శర్వానంద్ను బాగా ఇష్టపడేవాళ్లు కూడా అతను చివరగా ఎప్పుడు హిట్టు కొట్టాడో మరిచిపోయారు. ఎప్పుడో 2017లో మహానుభావుడుతో అతను సక్సెస్ రుచి చూశాడు. అంతకుముందు కూడా వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడ్డ అతడికి.. ఆ సినిమా ఊరటనిచ్చింది. కానీ ఆ విజయాన్ని అతను నిలబెట్టుకోలేకపోయాడు. ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్ ఇస్తూ.. మార్కెట్ బాగా దెబ్బ తీసుకున్నాడు.
పడి పడి లేచె మనసు, రణరంగం, జాను, శ్రీకారం, మహాసముద్రం.. ఇలా గత మూడేళ్లలో వచ్చిన అతడి సినిమాలన్నీ నిరాశ పరిచాయి. ఇందులో జాను, శ్రీకారం చిత్రాలకు టాక్ బాగున్నా కూడా ఆడలేదు. గత ఏడాది వచ్చిన మహాసముద్రం అయితే దారుణాతి దారుణమైన ఫలితాన్నందుకుని శర్వా మార్కెట్ మీద తీవ్ర ప్రభావం చూపింది. ఈ పరిస్థితుల్లో తన ఆశలన్నీ ఆడవాళ్ళు మీకు జోహార్లు మీదే పెట్టుకున్నాడు శర్వా.
మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా కనిపించిన ఈ చిత్రమైనా తనను గట్టెక్కుస్తుందని శర్వా పెట్టుకున్న నమ్మకం నిలబడలేదు. యావరేజ్ టాక్తో మొదలై.. వీకెండ్ వరకు పర్వాలేదనిపించిన ఈ సినిమా.. తర్వాత బాక్సాఫీస్ దగ్గర పడకేసేసింది. వీకెండ్లో వసూళ్లు పర్వాలేదన్న మాటే కానీ.. సినిమాకు జరిగిన బిజినెస్ స్థాయికి తగ్గట్లు లేవు. ఫస్ట్ వీకెండ్లో అటు ఇటుగా ఈ చిత్రం రూ.5 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది.
సోమవారం నుంచి వచ్చే వసూళ్లు నామమాత్రంగానే కనిపిస్తున్నాయి. వీకెండ్ అవ్వగానే జనాలు ఈ సినిమాను లైట్ తీసుకున్నారు. అందరి దృష్టీ రాధేశ్యామ్ మీదికి మళ్లింది. ఇక శర్వా సినిమా పుంజుకునే అవకాశాలు ఎంతమాత్రం కనిపించడం లేదు. అతడి ఖాతాలో మరో ఫ్లాప్ పడినట్లే అనడంలో సందేహం లేదు. అన్ని జానర్లూ ట్రై చేసి చివరికి ఫ్యామిలీ ఎంటర్టైనర్తోనూ చేదు అనుభవాన్ని ఎదుర్కొన్న శర్వాను ఇక పైకి లేపే సినిమా ఏదో?
This post was last modified on March 8, 2022 12:59 pm
శర్వానంద్ సినిమాలు విచిత్రమైన పరిస్థితిని ఎదురుకుంటున్నాయి. కారణం ఒకేసారి రెండు రిలీజులు రెడీ కావడం. అంతా సవ్యంగా జరిగి ఉంటే…
హనుమాన్, మిరాయ్ చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో ఘనవిజయం సాధించడంతో పెద్ద రేంజికి వెళ్లిపోయాడు తేజ సజ్జా. ఐతే ఈ…
ఔను! నిజం. మీరు చదివింది అక్షరాలా కరెక్టే!. సెకను అంటే రెప్పపాటు కాలం. ఈ రెప్పపాటు కాలంలోనే అఖిలాండ కోటి…
భద్రాద్రి కొత్తగూడెంలో డా.మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన…
ఏపీలో ఒక చిన్న పురుగు ప్రజల్లో టెన్షన్ రేకెత్తిస్తోంది. దాని కారణంగా స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి వస్తుంది. అసలు…
కొన్ని రోజుల కిందట కోనసీమ పర్యటన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన…