యువ కథానాయకుడు శర్వానంద్ను బాగా ఇష్టపడేవాళ్లు కూడా అతను చివరగా ఎప్పుడు హిట్టు కొట్టాడో మరిచిపోయారు. ఎప్పుడో 2017లో మహానుభావుడుతో అతను సక్సెస్ రుచి చూశాడు. అంతకుముందు కూడా వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడ్డ అతడికి.. ఆ సినిమా ఊరటనిచ్చింది. కానీ ఆ విజయాన్ని అతను నిలబెట్టుకోలేకపోయాడు. ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్ ఇస్తూ.. మార్కెట్ బాగా దెబ్బ తీసుకున్నాడు.
పడి పడి లేచె మనసు, రణరంగం, జాను, శ్రీకారం, మహాసముద్రం.. ఇలా గత మూడేళ్లలో వచ్చిన అతడి సినిమాలన్నీ నిరాశ పరిచాయి. ఇందులో జాను, శ్రీకారం చిత్రాలకు టాక్ బాగున్నా కూడా ఆడలేదు. గత ఏడాది వచ్చిన మహాసముద్రం అయితే దారుణాతి దారుణమైన ఫలితాన్నందుకుని శర్వా మార్కెట్ మీద తీవ్ర ప్రభావం చూపింది. ఈ పరిస్థితుల్లో తన ఆశలన్నీ ఆడవాళ్ళు మీకు జోహార్లు మీదే పెట్టుకున్నాడు శర్వా.
మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా కనిపించిన ఈ చిత్రమైనా తనను గట్టెక్కుస్తుందని శర్వా పెట్టుకున్న నమ్మకం నిలబడలేదు. యావరేజ్ టాక్తో మొదలై.. వీకెండ్ వరకు పర్వాలేదనిపించిన ఈ సినిమా.. తర్వాత బాక్సాఫీస్ దగ్గర పడకేసేసింది. వీకెండ్లో వసూళ్లు పర్వాలేదన్న మాటే కానీ.. సినిమాకు జరిగిన బిజినెస్ స్థాయికి తగ్గట్లు లేవు. ఫస్ట్ వీకెండ్లో అటు ఇటుగా ఈ చిత్రం రూ.5 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది.
సోమవారం నుంచి వచ్చే వసూళ్లు నామమాత్రంగానే కనిపిస్తున్నాయి. వీకెండ్ అవ్వగానే జనాలు ఈ సినిమాను లైట్ తీసుకున్నారు. అందరి దృష్టీ రాధేశ్యామ్ మీదికి మళ్లింది. ఇక శర్వా సినిమా పుంజుకునే అవకాశాలు ఎంతమాత్రం కనిపించడం లేదు. అతడి ఖాతాలో మరో ఫ్లాప్ పడినట్లే అనడంలో సందేహం లేదు. అన్ని జానర్లూ ట్రై చేసి చివరికి ఫ్యామిలీ ఎంటర్టైనర్తోనూ చేదు అనుభవాన్ని ఎదుర్కొన్న శర్వాను ఇక పైకి లేపే సినిమా ఏదో?
This post was last modified on March 8, 2022 12:59 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…