రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలను పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. సినిమా టికెట్ల రేట్లు గరిష్ఠం రూ.250, కనిష్ఠం రూ.20 గా నిర్ధారించింది. ప్రభుత్వం అనుమతించిన టికెట్ల రేట్లపై జీఎస్టీ అదనంగా ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. హీరో, డైరెక్టర్ రెమ్యునరేషన్ కాకుండా బడ్జెట్ ఆధారంగా చిత్రాలకు రేట్లను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. రూ.100 కోట్ల బడ్జెట్ దాటిన చిత్రాలకు రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించింది.
సినిమా విడుదలయ్యాక కనీసం 10 రోజులు రేట్లు పెంచుకునేలా అవకాశం కల్పించింది. చిన్న సినిమాలకు 5 షోలు వేసుకునే అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కనీసం 20శాతం షూటింగ్ ఏపీలో చేసిన చిత్రాలకు మాత్రమే రేట్లు పెంపు వర్తిస్తుంద ని జీవోలో పేర్కొంది. మరోవైపు.. రాష్ట్రంలో సినిమాలు చిత్రీకరిస్తే.. మరో 10 శాతం రాయితీ కూడా ఇవ్వనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాదు.. ప్రతి సినిమా హాల్లోనూ 25 శాతం సీట్లను నాన్ప్రీమియం కు కేటాయించాలని ఆదేశించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం తాజాగా జీవొ జారీ చేసింది. దీని ప్రకారం.. మూడు రకాలుగా టికెట్ల రేటును నిర్ణయించింది.
రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలు
నగర పంచాయతీల్లో
నాన్ ఏసీ- కనిష్ఠం ధర రూ.20
ఏసీ థియేటర్లు కనిష్ఠ ధర రూ.50
స్పెషల్ థియేటర్లు కనిష్ఠం రూ.70
మల్టీప్లెక్స్ల్లో ధర రూ.100, రూ.250
—————————-
మున్సిపాలిటీల్లో
నాన్ ఏసీ- కనిష్ఠ ధర రూ.30
ఏసీ థియేటర్లు- కనిష్ఠ ధర రూ.60
స్పెషల్ థియేటర్లు కనిష్ఠ ధర రూ. 80
మల్టీప్లెక్స్ల్లో టికెట్ ధర రూ.125, రూ.250
——————————
మున్సిపల్ కార్పొరేషన్లలో
నాన్ ఏసీ- కనిష్ఠ ధర రూ.40
ఏసీ థియేటర్లు కనిష్ఠ రూ.70
స్పెషల్ థియేటర్లు కనిష్ఠం రూ.100
మల్టీప్లెక్స్ల్లో టికెట్ ధర రూ.150, రూ. 250
This post was last modified on March 7, 2022 9:36 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…