రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలను పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. సినిమా టికెట్ల రేట్లు గరిష్ఠం రూ.250, కనిష్ఠం రూ.20 గా నిర్ధారించింది. ప్రభుత్వం అనుమతించిన టికెట్ల రేట్లపై జీఎస్టీ అదనంగా ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. హీరో, డైరెక్టర్ రెమ్యునరేషన్ కాకుండా బడ్జెట్ ఆధారంగా చిత్రాలకు రేట్లను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. రూ.100 కోట్ల బడ్జెట్ దాటిన చిత్రాలకు రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించింది.
సినిమా విడుదలయ్యాక కనీసం 10 రోజులు రేట్లు పెంచుకునేలా అవకాశం కల్పించింది. చిన్న సినిమాలకు 5 షోలు వేసుకునే అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కనీసం 20శాతం షూటింగ్ ఏపీలో చేసిన చిత్రాలకు మాత్రమే రేట్లు పెంపు వర్తిస్తుంద ని జీవోలో పేర్కొంది. మరోవైపు.. రాష్ట్రంలో సినిమాలు చిత్రీకరిస్తే.. మరో 10 శాతం రాయితీ కూడా ఇవ్వనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాదు.. ప్రతి సినిమా హాల్లోనూ 25 శాతం సీట్లను నాన్ప్రీమియం కు కేటాయించాలని ఆదేశించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం తాజాగా జీవొ జారీ చేసింది. దీని ప్రకారం.. మూడు రకాలుగా టికెట్ల రేటును నిర్ణయించింది.
రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలు
నగర పంచాయతీల్లో
నాన్ ఏసీ- కనిష్ఠం ధర రూ.20
ఏసీ థియేటర్లు కనిష్ఠ ధర రూ.50
స్పెషల్ థియేటర్లు కనిష్ఠం రూ.70
మల్టీప్లెక్స్ల్లో ధర రూ.100, రూ.250
—————————-
మున్సిపాలిటీల్లో
నాన్ ఏసీ- కనిష్ఠ ధర రూ.30
ఏసీ థియేటర్లు- కనిష్ఠ ధర రూ.60
స్పెషల్ థియేటర్లు కనిష్ఠ ధర రూ. 80
మల్టీప్లెక్స్ల్లో టికెట్ ధర రూ.125, రూ.250
——————————
మున్సిపల్ కార్పొరేషన్లలో
నాన్ ఏసీ- కనిష్ఠ ధర రూ.40
ఏసీ థియేటర్లు కనిష్ఠ రూ.70
స్పెషల్ థియేటర్లు కనిష్ఠం రూ.100
మల్టీప్లెక్స్ల్లో టికెట్ ధర రూ.150, రూ. 250
This post was last modified on March 7, 2022 9:36 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…