రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలను పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. సినిమా టికెట్ల రేట్లు గరిష్ఠం రూ.250, కనిష్ఠం రూ.20 గా నిర్ధారించింది. ప్రభుత్వం అనుమతించిన టికెట్ల రేట్లపై జీఎస్టీ అదనంగా ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. హీరో, డైరెక్టర్ రెమ్యునరేషన్ కాకుండా బడ్జెట్ ఆధారంగా చిత్రాలకు రేట్లను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. రూ.100 కోట్ల బడ్జెట్ దాటిన చిత్రాలకు రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించింది.
సినిమా విడుదలయ్యాక కనీసం 10 రోజులు రేట్లు పెంచుకునేలా అవకాశం కల్పించింది. చిన్న సినిమాలకు 5 షోలు వేసుకునే అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కనీసం 20శాతం షూటింగ్ ఏపీలో చేసిన చిత్రాలకు మాత్రమే రేట్లు పెంపు వర్తిస్తుంద ని జీవోలో పేర్కొంది. మరోవైపు.. రాష్ట్రంలో సినిమాలు చిత్రీకరిస్తే.. మరో 10 శాతం రాయితీ కూడా ఇవ్వనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాదు.. ప్రతి సినిమా హాల్లోనూ 25 శాతం సీట్లను నాన్ప్రీమియం కు కేటాయించాలని ఆదేశించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం తాజాగా జీవొ జారీ చేసింది. దీని ప్రకారం.. మూడు రకాలుగా టికెట్ల రేటును నిర్ణయించింది.
రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలు
నగర పంచాయతీల్లో
నాన్ ఏసీ- కనిష్ఠం ధర రూ.20
ఏసీ థియేటర్లు కనిష్ఠ ధర రూ.50
స్పెషల్ థియేటర్లు కనిష్ఠం రూ.70
మల్టీప్లెక్స్ల్లో ధర రూ.100, రూ.250
—————————-
మున్సిపాలిటీల్లో
నాన్ ఏసీ- కనిష్ఠ ధర రూ.30
ఏసీ థియేటర్లు- కనిష్ఠ ధర రూ.60
స్పెషల్ థియేటర్లు కనిష్ఠ ధర రూ. 80
మల్టీప్లెక్స్ల్లో టికెట్ ధర రూ.125, రూ.250
——————————
మున్సిపల్ కార్పొరేషన్లలో
నాన్ ఏసీ- కనిష్ఠ ధర రూ.40
ఏసీ థియేటర్లు కనిష్ఠ రూ.70
స్పెషల్ థియేటర్లు కనిష్ఠం రూ.100
మల్టీప్లెక్స్ల్లో టికెట్ ధర రూ.150, రూ. 250
This post was last modified on March 7, 2022 9:36 pm
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…