సినిమాల ప్రభావం జనాల మీద ఉండదనుకుంటే పొరబాటే. సినిమాలు చూసి పూర్తిగా చెడిపోవడం లేదా ఒక్కసారిగా మంచివారైపోవడం జరగకపోవచ్చు కానీ.. ఎంతో కొంత ప్రభావితం కావడం మాత్రం జరుగుతుంటుంది. అందుకే సినిమాలు తీసేవాళ్లకు సామాజిక బాధ్యత ఉండాలని.. ఎంతో కొంత మంచి చెప్పే ప్రయత్నం చేయాలని.. మంచి కథలు ఎంచుకోవాలని అంటుంటారు. ఐతే దీన్ని అందరు హీరోలూ పాటించరు.
తమిళ కథానాయకుడు సూర్య మాత్రం ఎప్పుడూ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే అడుగులు వేస్తుంటాడు. కమర్షియల్ సినిమాలు చేస్తూనే.. సొంత బేనర్లో గొప్ప కథలతో ప్రయాణం చేస్తుంటాడు. మేము, ఆకాశం నీ హద్దురా, జై భీమ్ లాంటి చిత్రాలు ఈ కోవలోకే వస్తాయి. ఈ చిత్రాలన్నింట్లో గొప్ప సందేశం ఉంది. ఆలోచింపజేసే, కదిలించే విషయాలున్నాయి. ఇప్పుడతను ఈటి అనే పక్కా కమర్షియల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
ఐతే తరచుగా తాను సందేశాత్మక చిత్రాలు చేయడం గురించి సూర్య మాట్లాడుతూ.. నేను నటించిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమా చూసి దర్శకుడు వెట్రిమారన్ సిగరెట్ తాగడం ఆపేశాడట. కేవలం వినోదం కోసమే కాకుండా ఇలాంటి మార్పు కోసం కూడా సినిమాలు చేయాలి. నేను ప్రేక్షకులను ఆలోచింపజేసేలా సినిమాలు చేయడం నా బాధ్యతగా భావిస్తా. ఆకాశం నీ హద్దురా, జై భీమ్ సినిమాలు ఎంచుకున్నపుడు నా స్టైల్ కథలు ఇవి కావని చాలామంది అన్నారు. ఆకాశం నీ హద్దురా చిత్రంలో పెళ్లాంతో చెంపదెబ్బ తింటాను. ఆమెని డబ్బు అడుగుతాను. జై భీమ్లో తొలి అరగంట నా పాత్ర ఉండదు. హీరోయిజం గురించి ఆలోచిస్తే ఇలాంటి సినిమాలు చేయలేం. దాని గురించి ఆలోచించకుండా, మంచి చెప్పాలన్న ఉద్దేశంతో ఆ రెండు చిత్రాలు చేశాను. అందుకే అవి నాకు అంత గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. సామాజిక మార్పును తీసుకొచ్చిన చిత్రాలివి. అవి నాకెంతో ఆత్మసంతృప్తినిచ్చాయి అని వివరించాడు సూర్య.
ఈ సినిమాలు, సూర్య ఆలోచనలు గమనిస్తే ఈ రోజుల్లో తనలా ఆలోచించే హీరోలు చాలా అరుదనడంలో సందేహం లేదు.
This post was last modified on March 6, 2022 8:52 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…