కిరణ్ అబ్బవరం.. రెండేళ్ల కిందటే టాలీవుడ్లోకి అడుగు పెట్టిన యువ కథానాయకుడు. ఎలాంటి ఫిలిం బ్యాగ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టినా.. తొలి సినిమాతోనే తన టాలెంట్ చూపి యువతలో మంచి ఫాలోయింగే సంపాదించాడు. అతడి తొలి సినిమా రాజావారు రాణివారు థియేటర్లలో అంతగా ఆడకపోయినా.. ఓటీటీలో మంచి ఆదరణ తెచ్చుకుని కిరణ్కు గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ గుర్తింపుతోనే తర్వాత ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమా చేశాడు.
ఈ చిత్రానికి అతను కథా రచయిత కూడా కావడం విశేషం. ఈ సినిమాకు రిలీజ్ ముంగిట మంచి బజ్ వచ్చింది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత కాస్త పేరున్న సినిమాలను మించి ఈ చిత్రం ఓపెనింగ్స్ సాధించడం విశేషం. ఈ చిత్రంలోనూ కిరణ్ నటన అందరినీ ఆకట్టుకుంది. టిపికల్ రాయలసీమ యాసలో అతను చెప్పిన డైలాగ్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. హీరోగా కిరణ్ స్టైల్, మేనరిజమ్స్ కూడా ప్రేక్షకులను మెప్పించాయి.
ఆ సినిమా చూసిన అందరూ.. ఈ కుర్రాడిలో టాలెంట్ ఉంది.. సరైన సబ్జెక్టులు ఎంచుకుంటే హీరోగా ఎదుగుతాడు అని అభిప్రాయపడ్డారు. ఎస్ఆర్ కళ్యాణమండపం లాంటి వీక్ సబ్జెక్టుతో సినిమా చేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. కనీసం తర్వాతి సినిమాతో అయినా తప్పు దిద్దుకుంటాడేమో అనుకుంటే.. సెబాస్టియన్ మూవీ మరీ పేలవంగా ఉండి ఈ చిత్రంపై అంచనాలు పెట్టుకున్న వారిని తీవ్ర నిరాశకు గురి చేసింది.
దీంతో పోలిస్తే ఎస్ఆర్ కళ్యాణమండపం చిత్రమే నయం అంటున్నారంతా. కిరణ్కు టాలెంట్ ఉన్నప్పటికీ కథల ఎంపికలో, అలాగే మంచి టీంను ఎంచుకోవడంలో అభిరుచి లేదని అభిప్రాయపడుతున్నారంతా. సరైన కథ, మంచి దర్శకుడు పడితే కిరణ్ బాగా రాణించగలడని ఇప్పటిదాకా అతను చేసిన చిత్రాలను చూసి చెప్పేయొచ్చు. మరి ఇక ముందైనా అతను జాగ్రత్త పడతాడా.. మంచి కథలు, దర్శకులు అతణ్ని వెతుక్కుంటూ వచ్చి కెరీర్ గాడిన పడుతుందా అన్నది చూడాలి.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…