కిరణ్ అబ్బవరం.. రెండేళ్ల కిందటే టాలీవుడ్లోకి అడుగు పెట్టిన యువ కథానాయకుడు. ఎలాంటి ఫిలిం బ్యాగ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టినా.. తొలి సినిమాతోనే తన టాలెంట్ చూపి యువతలో మంచి ఫాలోయింగే సంపాదించాడు. అతడి తొలి సినిమా రాజావారు రాణివారు థియేటర్లలో అంతగా ఆడకపోయినా.. ఓటీటీలో మంచి ఆదరణ తెచ్చుకుని కిరణ్కు గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ గుర్తింపుతోనే తర్వాత ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమా చేశాడు.
ఈ చిత్రానికి అతను కథా రచయిత కూడా కావడం విశేషం. ఈ సినిమాకు రిలీజ్ ముంగిట మంచి బజ్ వచ్చింది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత కాస్త పేరున్న సినిమాలను మించి ఈ చిత్రం ఓపెనింగ్స్ సాధించడం విశేషం. ఈ చిత్రంలోనూ కిరణ్ నటన అందరినీ ఆకట్టుకుంది. టిపికల్ రాయలసీమ యాసలో అతను చెప్పిన డైలాగ్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. హీరోగా కిరణ్ స్టైల్, మేనరిజమ్స్ కూడా ప్రేక్షకులను మెప్పించాయి.
ఆ సినిమా చూసిన అందరూ.. ఈ కుర్రాడిలో టాలెంట్ ఉంది.. సరైన సబ్జెక్టులు ఎంచుకుంటే హీరోగా ఎదుగుతాడు అని అభిప్రాయపడ్డారు. ఎస్ఆర్ కళ్యాణమండపం లాంటి వీక్ సబ్జెక్టుతో సినిమా చేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. కనీసం తర్వాతి సినిమాతో అయినా తప్పు దిద్దుకుంటాడేమో అనుకుంటే.. సెబాస్టియన్ మూవీ మరీ పేలవంగా ఉండి ఈ చిత్రంపై అంచనాలు పెట్టుకున్న వారిని తీవ్ర నిరాశకు గురి చేసింది.
దీంతో పోలిస్తే ఎస్ఆర్ కళ్యాణమండపం చిత్రమే నయం అంటున్నారంతా. కిరణ్కు టాలెంట్ ఉన్నప్పటికీ కథల ఎంపికలో, అలాగే మంచి టీంను ఎంచుకోవడంలో అభిరుచి లేదని అభిప్రాయపడుతున్నారంతా. సరైన కథ, మంచి దర్శకుడు పడితే కిరణ్ బాగా రాణించగలడని ఇప్పటిదాకా అతను చేసిన చిత్రాలను చూసి చెప్పేయొచ్చు. మరి ఇక ముందైనా అతను జాగ్రత్త పడతాడా.. మంచి కథలు, దర్శకులు అతణ్ని వెతుక్కుంటూ వచ్చి కెరీర్ గాడిన పడుతుందా అన్నది చూడాలి.
This post was last modified on March 5, 2022 11:51 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…