టాలీవుడ్ స్టార్లలో అత్యంత సరదాగా ఉండే వ్యక్తిగా ప్రభాస్ను చెబుతుంటారు. అతను ‘బాహుబలి’కి ముందు ఎలా ఉన్నాడో ఇప్పటికీ అలాగే కనిపిస్తున్నాడు. కొందరు స్టార్ల లాగా తెచ్చిపెట్టుకున్న అహం అతడిలో కనిపించదు. సినిమా ఈవెంట్లలో.. అలాగే మీడియాను కలిసినపుడు కూడా ప్రభాస్ చాలా సింపుల్గా కనిపిస్తాడు. సరదాగా మాట్లాడతాడు. ఇటీవల ముంబయిలో ‘రాధేశ్యామ్’ ప్రమోషన్లకు వెళ్లినపుడు మీడియా వాళ్లు ఎదురుగా ఉండగానే దర్శకుడు రాధాకృష్ణకుమార్తో సాగించిన సరదా సంభాషణ అందరినీ ఆకట్టుకుంది.
‘‘నీకు హిందీ వచ్చా.. ఐతే మాట్లాడేసేయ్.. నేను బాగా ప్రాక్టీస్ చేసి ‘ఆదిపురుష్’ టైంలో మాట్లాడతా’’ అని రాధాకృష్ణను ఉద్దేశించి అనడం రికార్డయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పుడు చెన్నైలో జరిగిన ఈ సినిమా ప్రెస్ మీట్లోనూ ప్రభాస్ తన చమత్కారాన్ని చూపించాడు. ‘రాధేశ్యామ్’లో ప్రేమకు, విధికి మధ్య జరిగే యుద్ధాన్ని చూపించబోతున్నట్లు ప్రోమోల్లో చూపిస్తున్న సంగతి తెలిసిందే. పోస్టర్ల మీదా ఇదే మాట కనిపిస్తోంది.
ఐతే చెన్నై రిపోర్టర్ ఒకరు దీని గురించి ప్రస్తావిస్తూ.. ఇంతకీ సినిమాలో ప్రేమ గెలిచిందా, విధి గెలిచిందా అని ప్రభాస్ను ప్రశ్నించాడు. దానికి ప్రభాస్ నవ్వుతూ.. ‘‘ఆ ప్రశ్నకు ఇప్పుడే జవాబు చెప్పేయమంటారేంటి? కనీసం ఒక 50 రూపాయలైనా పెట్టి సినిమా చూసి ఆ సంగతి తెలుసుకోండి.
మా ప్రొడ్యూసర్లు ఏకంగా 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మరి థియేటరుకెళ్లి సినిమా చూడకుండా ఆ విషయం తెలుసుకోవాలంటే ఎలా’’ అని ప్రభాస్ అనడంతో అందరిలోనూ నవ్వులు పూశాయి. మొత్తానికి ఈ ప్రశ్నకు జవాబిచ్చే క్రమంలో ‘రాధేశ్యామ్’ బడ్జెట్ ఎంత అన్నది కూడా ప్రభాస్ చెప్పేశాడు. ఇప్పటిదాకా ‘రాధేశ్యామ్’ బడ్జెట్ రూ.200 కోట్ల లోపే అనుకుంటున్నారంతా. ఈ ప్రేమకథా చిత్రానికి కూడా రూ.300 కోట్లు పెట్టారంటే ప్రభాస్ రేంజేంటన్నది అర్థం చేసుకోవచ్చు.
This post was last modified on March 5, 2022 1:53 pm
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…