టాలీవుడ్ స్టార్లలో అత్యంత సరదాగా ఉండే వ్యక్తిగా ప్రభాస్ను చెబుతుంటారు. అతను ‘బాహుబలి’కి ముందు ఎలా ఉన్నాడో ఇప్పటికీ అలాగే కనిపిస్తున్నాడు. కొందరు స్టార్ల లాగా తెచ్చిపెట్టుకున్న అహం అతడిలో కనిపించదు. సినిమా ఈవెంట్లలో.. అలాగే మీడియాను కలిసినపుడు కూడా ప్రభాస్ చాలా సింపుల్గా కనిపిస్తాడు. సరదాగా మాట్లాడతాడు. ఇటీవల ముంబయిలో ‘రాధేశ్యామ్’ ప్రమోషన్లకు వెళ్లినపుడు మీడియా వాళ్లు ఎదురుగా ఉండగానే దర్శకుడు రాధాకృష్ణకుమార్తో సాగించిన సరదా సంభాషణ అందరినీ ఆకట్టుకుంది.
‘‘నీకు హిందీ వచ్చా.. ఐతే మాట్లాడేసేయ్.. నేను బాగా ప్రాక్టీస్ చేసి ‘ఆదిపురుష్’ టైంలో మాట్లాడతా’’ అని రాధాకృష్ణను ఉద్దేశించి అనడం రికార్డయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పుడు చెన్నైలో జరిగిన ఈ సినిమా ప్రెస్ మీట్లోనూ ప్రభాస్ తన చమత్కారాన్ని చూపించాడు. ‘రాధేశ్యామ్’లో ప్రేమకు, విధికి మధ్య జరిగే యుద్ధాన్ని చూపించబోతున్నట్లు ప్రోమోల్లో చూపిస్తున్న సంగతి తెలిసిందే. పోస్టర్ల మీదా ఇదే మాట కనిపిస్తోంది.
ఐతే చెన్నై రిపోర్టర్ ఒకరు దీని గురించి ప్రస్తావిస్తూ.. ఇంతకీ సినిమాలో ప్రేమ గెలిచిందా, విధి గెలిచిందా అని ప్రభాస్ను ప్రశ్నించాడు. దానికి ప్రభాస్ నవ్వుతూ.. ‘‘ఆ ప్రశ్నకు ఇప్పుడే జవాబు చెప్పేయమంటారేంటి? కనీసం ఒక 50 రూపాయలైనా పెట్టి సినిమా చూసి ఆ సంగతి తెలుసుకోండి.
మా ప్రొడ్యూసర్లు ఏకంగా 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మరి థియేటరుకెళ్లి సినిమా చూడకుండా ఆ విషయం తెలుసుకోవాలంటే ఎలా’’ అని ప్రభాస్ అనడంతో అందరిలోనూ నవ్వులు పూశాయి. మొత్తానికి ఈ ప్రశ్నకు జవాబిచ్చే క్రమంలో ‘రాధేశ్యామ్’ బడ్జెట్ ఎంత అన్నది కూడా ప్రభాస్ చెప్పేశాడు. ఇప్పటిదాకా ‘రాధేశ్యామ్’ బడ్జెట్ రూ.200 కోట్ల లోపే అనుకుంటున్నారంతా. ఈ ప్రేమకథా చిత్రానికి కూడా రూ.300 కోట్లు పెట్టారంటే ప్రభాస్ రేంజేంటన్నది అర్థం చేసుకోవచ్చు.
This post was last modified on March 5, 2022 1:53 pm
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కలయికలో తెరకెక్కబోతున్న సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. విశ్వసనీయ సమాచారం మేరకు…
పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరింది. ఉదయం 11 గంటలకు బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో బెంగాల్ సీఎంగా సువేందు…
ఇప్పటికే పలు వాయిదాల్లో నలిగిపోయిన సూర్య వీరభద్రుడు మే 14 విడుదల కానుంది. మొన్నటిదాకా వాయిదా పడుతుందనే ప్రచారం చెన్నై…
జనసేనాని పవన్ కళ్యాణ్ మీద గత రెండు మూడు రోజులుగా వైసీపీ మద్దతుదారులు. అనుకూల మీడియా పెడుతున్న సోషల్ మీడియా…
మేం ఫేమస్ చిత్రంతో టాలీవుడ్లోకి దూసుకొచ్చాడు యువ నటుడు సుమంత్ ప్రభాస్. షార్ట్ ఫిలిమ్స్ నేపథ్యం నుంచి వచ్చిన ఈ…
సూర్యకుమార్ యాదవ్ ఎందుకు ఉన్నాడు? శ్రేయస్ అయ్యర్ ఎందుకు లేడు? భారత టీ20 జట్టు విషయంలో చాలా రోజులుగా అభిమానులను…