బాలీవుడ్ బాద్షా షారుఖ్ని వెండితెరపై చూసి నాలుగేళ్లు అయ్యింది. ‘జీరో’ సినిమా కొట్టిన దెబ్బ నుంచి కోలుకోడానికి పాపం ఇన్నేళ్లు పట్టింది కింగ్ ఖాన్కి. కొన్నాళ్లు అసలు సినిమాల జోలికి పోలేదు. ఆ తర్వాత కూడా ఎంతో ఆలోచించి, ఆచితూచి అడుగులేయాలని డిసైడయ్యాడు. సక్సెస్ ఫార్ములా బాగా తెలిసిన సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ‘పఠాన్’ మూవీ చేయడానికి ఎస్ చెప్పాడు. ఇప్పుడు రిలీజ్ డేట్ని ప్రకటించి ఫ్యాన్స్ని సంతోషంలో ముంచేశాడు.
వచ్చే యేడు జనవరి 25న హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ‘పఠాన్’ విడుదల కానుందని అనౌన్స్ చేశాడు షారుఖ్. ఈ సందర్భంగా ఓ టీజర్ని కూడా వదిలాడు. ఇందులో షారుఖ్ లుక్ చాలా డిఫరెంట్గా ఉంది. లాంగ్ హెయిర్తో కనిపిస్తున్నాడు. స్టైలిష్గా, మ్యాన్లీగా ఉన్నాడు. అలాగే టీజర్ని బట్టి ఇదో దేశభక్తి సినిమా అని అర్థమవుతోంది. దేశం కోసం పోరాడేవాడిగా షారుఖ్ కనిపించబోతున్నాడని క్లారిటీ వచ్చింది. అందుకే ఈ మూవీ కోసం రిపబ్లిక్ డే స్లాట్ని సెలెక్ట్ చేసుకున్నారు.
అలా అని తనని స్క్రీన్ మీద చూడటానికి వచ్చే సంవత్సరం వరకు వెయిట్ చేయాలా అని అభిమానులు నిరాశపడాల్సిన పని లేదు. ఎందుకంటే మాధవన్ నటిస్తూ డైరెక్ట్ చేసిన ‘రాకెట్రీ, ఆమిర్ ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’, రణ్బీర్ కపూర్ ‘బ్రహ్మాస్త్ర’ చిత్రాల్లో గెస్ట్ రోల్స్ చేశాడు షారుఖ్. ఈ మూడు సినిమాలూ ఈ యేడే విడుదలవుతాయి. అంటే ఓ మూడుసార్లు తెరపై మెరిసి మురిపిస్తాడు షారుఖ్. ఒకవేళ సల్మాన్ ‘టైగర్ 3’ కూడా ఈ సంవత్సరమే విడుదలైతే నాలుగోసారి కూడా కనిపిస్తాడు. అందులోనూ అతిథిగా నటిస్తున్నాడు మరి.
అయితే తనని హీరోగా చూడాలంటే మాత్రం వచ్చే జనవరి వరకు వెయిట్ చేయాల్సిందే. దీపికా పదుకొనె హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో జాన్ అబ్రహామ్ విలన్గా నటిస్తున్నాడు. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీంతో పాటు అట్లీ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నాడు షారుఖ్. నయనతార హీరోయిన్. ప్రియమణి, సాన్యా మల్హోత్రా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
This post was last modified on March 2, 2022 4:44 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…