బాలీవుడ్లో ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాలకు డిమాండ్ పెంచిన నటి విద్యాబాలన్. కహానీ, డర్టీ పిక్చర్, తుమ్హారీ సులు లాంచి చిత్రాలతో సత్తా చాటింది. హీరోతో పని లేదని, హీరోయిన్ కోసం కూడా ప్రేక్షకులు సినిమాలు చూస్తారని ప్రూవ్ చేసింది. బలమైన కథలు, అంతకంటే బలమైన పాత్రలు, అద్భుతమైన పర్ఫార్మెన్స్కి విద్య సినిమాలు కేరాఫ్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఇప్పుడు మరోసారి అలాంటి స్ట్రాంగ్ కాన్సెప్ట్తో వస్తోంది విద్య. తనతో ‘తుమ్హారీ సులు’ చిత్రాన్ని తీసిన టీమ్తో ‘జల్సా’ అనే సినిమా చేసింది. ఈ చిత్రాన్ని మార్చ్ 18న అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ చేయనున్నట్టు టీమ్ ఇవాళ ప్రకటించింది. సురేష్ త్రివేణి డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, విక్రమ్ మల్హోత్రా, శిఖా శర్మ, సురేష్ త్రివేణి నిర్మించారు. షెఫాలీ షా, మానవ్ కౌల్, రోహిణి హట్టంగడి లాంటి వెర్సటైల్ యాక్టర్స్ నటించారు.
ఇటీవలి కాలంలో విద్య నటించిన సినిమాలన్నీ డిజిటల్ బాటే పడుతున్నాయి. గత రెండు చిత్రాలూ ఓటీటీలోనే విడుదలయ్యాయి. ప్రపంచమే మెచ్చిన మ్యాథమెటీషియన్ శకుంతలా దేవి జీవితం ఆధారంగా తీసిన సినిమా డిజిటల్గానే రిలీజయ్యింది. అలాగే విద్య ఫారెస్ట్ ఆఫీసర్గా నటించిన ‘షేర్నీ’ కూడా ఓటీటీలోనే విడుదలయ్యింది. ఇప్పుడు ఈ చిత్రం కూడా అమెజాన్ ప్రైమ్లోనే వస్తోంది.
విద్యకి, ఆమె సినిమాలకి డిమాండ్ ఉండటంతో ఓటీటీలు మంచి రేటు చెల్లించి తన సినిమాలు కొంటున్నాయి. థియేటర్లు, రిలీజుల విషయంలో కన్ఫ్యూజన్ పూర్తిగా తొలగకపోవడంతో ఆమెతో సినిమాలు తీసినవాళ్లు కూడా ఓటీటీవైపే అడుగులేస్తున్నారు. ఓటీటీల సంగతి, నిర్మాతల సంగతి ఏమోగానీ.. రిలీజైన వెంటనే ఇంట్లోనే కూర్చుని విద్య సినిమాని చూసే చాన్స్ దొరుకుతున్నందుకు ప్రేక్షకులైతే హ్యాపీ.
This post was last modified on February 28, 2022 5:19 pm
బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్ సినిమా ఫిక్సయిపోయింది. వచ్చే వారమే పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ జరగనుందని సమాచారం. అయితే…
వైసీపీ అధినేత జగన్ శుక్రవారం నుంచి యూరప్ పర్యటనకు వెళ్తున్నారు. దాదాపు 20 రోజులకు పైగానే ఆయన రాష్ట్రానికి దూరంగా…
తెలంగాణలో రెండు రోజుల క్రితం మొదలైన ఆర్టీసీ కార్మికుల సమ్మె అప్పుడే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన…
బాలకృష్ణ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమా నిప్పురవ్వ. దానికైన ఖర్చు గురించి…
70, 80, 90 దశకాల్లో ప్రపంచ వ్యాప్తంగా సంగీత ప్రియులను ఒక ఊపు ఊపిన లెజెండరీ మ్యుజీషియన్ మైకేల్ జాక్సన్…
కొత్త సినిమాల సంగతేమో కానీ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు డార్లింగ్ వర్షంలో తడిసిపోతున్నారు. ఇవాళ ఏపీ తెలంగాణ వ్యాప్తంగా దీనికొచ్చిన…