మొన్నటి వరకు క్రికెటర్ల మీద బయోపిక్స్ వచ్చాయి. ఫేమస్ హీరోలు క్రికెటర్ల పాత్రలు పోషించారు. కానీ ఇప్పుడు క్రికెటర్లే మేకప్ వేసి రకరకాల పాత్రలు వేసేస్తున్నారు. ఆల్రెడీ శ్రీశాంత్ కొన్ని సినిమాల్లో నటించాడు. మరికొన్నింటిలో నటిస్తున్నాడు. హర్భజన్ సింగ్ కూడా ఓ మూవీతో హీరోగా మారాడు. ఇప్పుడు ధోని వంతు వచ్చింది.
ఆల్రెడీ ధోని ప్రధాన పాత్రలో ‘అధర్వ’ అనే గ్రాఫిక్ నవల మొదలైన సంగతి తెలిసిందే. దీని ఫస్ట్ లుక్ను ఆమధ్య రజనీకాంత్ విడుదల చేశారు. అది కాస్తా వైరల్ అయ్యింది. ఇప్పుడేమో ఏకంగా రజినీకాంత్ లుక్లోకే మారిపోయి సర్ప్రైజ్ ఇచ్చాడు ధోని. నిన్న సోషల్ మీడియాలో ధోనికి సంబంధించిన కొన్ని ప్రమోషనల్ వీడియోస్ ప్రత్యక్షమయ్యాయి. వీటిలో ధోనీని చూసి వారేవా అంటున్నారంతా.
ఖాకీ ప్యాంటు, షర్టు వేసి, మీసాలు దువ్వి బస్ కండక్టర్ గెటప్లో కనిపిస్తున్నాడు ధోని. అచ్చం రజినీకాంత్లా కనిపిస్తున్నాడు. అలాగే చూస్తున్నాడు, నడుస్తున్నాడు, నవ్వుతున్నాడు. కళ్లజోడు కూడా రజినీ స్టైల్లోనే పెట్టి ఇంప్రెస్ చేశాడు. నటుడు కాకముందు రజినీ బస్ కండక్టర్గా పని చేసి సంగతి తెలిసిందే. అందుకే అలా తయారయ్యాడు ధోని. అయితే ఇదంతా ఎందుకు అనేది మాత్రం రివీల్ చేయకుండా దాచారు. ఇతను ఎవరు, ఎందుకిదంతా, త్వరలో తెలుస్తుంది అంటూ కాసేపు ఊరించారు.
దాంతో ధోని ఏదో సినిమా చేస్తున్నాడని, ఇదంతా దానికి సంబంధించినదేనని అనుకున్నారు చాలామంది. కానీ కాదు. ఇది ఐపీఎల్ ప్రమోషన్ కోసం చేసినదని తర్వాత తెలిసింది. ఏదేమైనా రజినీ లుక్లో ధోని కనిపించడం మాత్రం తలైవా ఫ్యాన్స్ని చాలా సర్ప్రైజ్ చేసింది. దాంతో ధోని వీడియో ఊహించినదానికంటే ఎక్కువే వైరల్ అయ్యింది. చాలామంది యాక్టర్ల కంటే ధోని బెటర్ అనే కితాబు దక్కింది.
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ 'మై వాపస్ ఆవుంగా'కు తొలి రోజు రివ్యూలు ఏమంత ఆశాజనకంగా లేవు. పబ్లిక్ టాక్…
సాయిధరమ్ తేజ్ హీరోగా రెండేళ్ల ముందు మొదలైన సినిమా.. సంబరాల యేటిగట్టు. తన మార్కెట్ స్థాయికి మించి పెద్ద బడ్జెట్లో…
పెద్ది మొదటి రెండు వారాలు బాగా సందడి చేసి కలెక్షన్ల వర్షం కురిపించాక మళ్ళీ దాన్ని కొనసాగించే సినిమా ఏది…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’యే చివరి చిత్రం అవుతుందనే అంచనాలు కలిగాయి ఒక దశలో.…
తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…
వైసీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఆదివారం నిర్వహించిన కాపుల సభలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన బొత్స…