మొన్నటి వరకు క్రికెటర్ల మీద బయోపిక్స్ వచ్చాయి. ఫేమస్ హీరోలు క్రికెటర్ల పాత్రలు పోషించారు. కానీ ఇప్పుడు క్రికెటర్లే మేకప్ వేసి రకరకాల పాత్రలు వేసేస్తున్నారు. ఆల్రెడీ శ్రీశాంత్ కొన్ని సినిమాల్లో నటించాడు. మరికొన్నింటిలో నటిస్తున్నాడు. హర్భజన్ సింగ్ కూడా ఓ మూవీతో హీరోగా మారాడు. ఇప్పుడు ధోని వంతు వచ్చింది.
ఆల్రెడీ ధోని ప్రధాన పాత్రలో ‘అధర్వ’ అనే గ్రాఫిక్ నవల మొదలైన సంగతి తెలిసిందే. దీని ఫస్ట్ లుక్ను ఆమధ్య రజనీకాంత్ విడుదల చేశారు. అది కాస్తా వైరల్ అయ్యింది. ఇప్పుడేమో ఏకంగా రజినీకాంత్ లుక్లోకే మారిపోయి సర్ప్రైజ్ ఇచ్చాడు ధోని. నిన్న సోషల్ మీడియాలో ధోనికి సంబంధించిన కొన్ని ప్రమోషనల్ వీడియోస్ ప్రత్యక్షమయ్యాయి. వీటిలో ధోనీని చూసి వారేవా అంటున్నారంతా.
ఖాకీ ప్యాంటు, షర్టు వేసి, మీసాలు దువ్వి బస్ కండక్టర్ గెటప్లో కనిపిస్తున్నాడు ధోని. అచ్చం రజినీకాంత్లా కనిపిస్తున్నాడు. అలాగే చూస్తున్నాడు, నడుస్తున్నాడు, నవ్వుతున్నాడు. కళ్లజోడు కూడా రజినీ స్టైల్లోనే పెట్టి ఇంప్రెస్ చేశాడు. నటుడు కాకముందు రజినీ బస్ కండక్టర్గా పని చేసి సంగతి తెలిసిందే. అందుకే అలా తయారయ్యాడు ధోని. అయితే ఇదంతా ఎందుకు అనేది మాత్రం రివీల్ చేయకుండా దాచారు. ఇతను ఎవరు, ఎందుకిదంతా, త్వరలో తెలుస్తుంది అంటూ కాసేపు ఊరించారు.
దాంతో ధోని ఏదో సినిమా చేస్తున్నాడని, ఇదంతా దానికి సంబంధించినదేనని అనుకున్నారు చాలామంది. కానీ కాదు. ఇది ఐపీఎల్ ప్రమోషన్ కోసం చేసినదని తర్వాత తెలిసింది. ఏదేమైనా రజినీ లుక్లో ధోని కనిపించడం మాత్రం తలైవా ఫ్యాన్స్ని చాలా సర్ప్రైజ్ చేసింది. దాంతో ధోని వీడియో ఊహించినదానికంటే ఎక్కువే వైరల్ అయ్యింది. చాలామంది యాక్టర్ల కంటే ధోని బెటర్ అనే కితాబు దక్కింది.
This post was last modified on February 28, 2022 3:26 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…