టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న పాన్ ఇండియా చిత్రాల్లో `ఆదిపురుష్` ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని టి. సిరీస్ బ్యానర్పై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రశాంత్ సుతార్ కలిసి రూ. 400 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నారు. సాచేత్ తాండన్, పరంపరా ఠాకూర్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు.
రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీలో ప్రభాస్ రాఘవుడుగా, కృతి సనన్ జానకిగా మరియు సైఫ్ అలీ ఖాన్ లంకేషుడిగా కనిపించబోతున్నారు. ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఈ భారీ బడ్జెట్ సినిమాను 2022 ఆగస్టు 11న విడుదల చేస్తామని మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు.
కానీ, ఆమిర్ ఖాన్ నటించిన `లాల్ సింగ్ చద్దా` సినిమా కోసం ఆదిపురుష్ను వాయిదా వేశారు. అయితే దీపావళి కానుకగా అక్టోబర్లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారని ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. ఈ నేపథ్యంలోనే తాజాగా చిత్ర నిర్మాత భూషన్ కుమార్ ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ఆదిపురుష్ విడుదల్పై ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
భూజన్ కుమార్ మాట్లాడుతూ.. `ఆదిపురుష్` దీపావళికి విడుదల అవుతుంది అన్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదు. అసలు సినిమా రిలీజ్పై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదంటూ స్పష్టం చేశారు. దీంతో ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలంటూ ప్రభాస్ అభిమానులు కాస్త అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మరి ఆదిపురుష్ ఏ ఏడాది చివర్లో అయినా వస్తుందా..? లేక వచ్చే ఏడాదికి షిఫ్ట్ అవుతుందా..? అన్నది చూడాలి.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…