టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న పాన్ ఇండియా చిత్రాల్లో `ఆదిపురుష్` ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని టి. సిరీస్ బ్యానర్పై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రశాంత్ సుతార్ కలిసి రూ. 400 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నారు. సాచేత్ తాండన్, పరంపరా ఠాకూర్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు.
రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీలో ప్రభాస్ రాఘవుడుగా, కృతి సనన్ జానకిగా మరియు సైఫ్ అలీ ఖాన్ లంకేషుడిగా కనిపించబోతున్నారు. ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఈ భారీ బడ్జెట్ సినిమాను 2022 ఆగస్టు 11న విడుదల చేస్తామని మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు.
కానీ, ఆమిర్ ఖాన్ నటించిన `లాల్ సింగ్ చద్దా` సినిమా కోసం ఆదిపురుష్ను వాయిదా వేశారు. అయితే దీపావళి కానుకగా అక్టోబర్లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారని ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. ఈ నేపథ్యంలోనే తాజాగా చిత్ర నిర్మాత భూషన్ కుమార్ ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ఆదిపురుష్ విడుదల్పై ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
భూజన్ కుమార్ మాట్లాడుతూ.. `ఆదిపురుష్` దీపావళికి విడుదల అవుతుంది అన్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదు. అసలు సినిమా రిలీజ్పై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదంటూ స్పష్టం చేశారు. దీంతో ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలంటూ ప్రభాస్ అభిమానులు కాస్త అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మరి ఆదిపురుష్ ఏ ఏడాది చివర్లో అయినా వస్తుందా..? లేక వచ్చే ఏడాదికి షిఫ్ట్ అవుతుందా..? అన్నది చూడాలి.
This post was last modified on February 28, 2022 1:38 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…