మంచు విష్ణు వార్తల్లోకి వచ్చారు. అదేం కొత్త విషయం కాదు కదా? అనొచ్చు. కానీ.. ఆయన ఈసారి వార్తల్లోకి వచ్చింది రోటీన్ కు భిన్నమైన అంశంలో. ఆయన హెయిర్ స్టైలిస్ట్ నాగశ్రీను అనే వ్యక్తి తన ఆఫీసులో చోరీ చేసినట్లుగా పేర్కొంటూ కంప్లైంట్ ఇచ్చారు. కాస్త ఆలస్యంగా బయటకువచ్చిన ఈ ఉదంతంలోకి వెళితే..
బోరబండకు చెందిన నాగశ్రీను అనే హెయిర్ స్టైలిస్ట్ మంచు విష్ణు దగ్గర పని చేస్తున్నారు. ఫిబ్రవరి 17న జూబ్లీహిల్స్ లోని సీబీఐ కాలనీలో మంచు విష్ణుకు ఒక ఆఫీసు ఉంది. అందులో నుంచి మేకప్ సామాగ్రి.. హెయిర్ డ్రెస్సింగ్ కు సంబంధించి దాదాపు రూ.5లక్షలు విలువైన సామాగ్రిని ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తనతో తీసుకెళ్లిపోయాడు.
అనంతరం అతన్ని కాంటాక్టు చేసేందుకు ఫోన్ లో ప్రయత్నం చేయగా.. అతని ఫోన్ స్విచ్ఛాప్ లో ఉన్నట్లుగా గుర్తించారు. దీంతో.. విష్ణు లీగల్ మేనేజర్ సంజయ్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఈ నెల 19న కంప్లైంట్ చేశారు. ఈ విషయం చాలా ఆలస్యంగా బయటకు వచ్చింది. కంప్లైంట్ ఫైల్ చేసిన పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.
చోరీ అంటే డబ్బు.. విలువైన ఆభరణాలను చోరీ చేయటం మామూలే. అందుకు భిన్నంగా హెయిర్ డ్రెస్సింగ్ కు సంబంధించిన సామాను.. మేప్ సామాగ్రిని చోరీ చేయటమా? అన్న ఆశ్చర్యం కలుగక మానదు. ఏమైనా.. ఈ కేసుకు సంబంధించిన కీలకమైన హెయిర్ స్టైలిస్ట్ ను పోలీసులు అదుపులోకి తీసుకుంటే.. విషయాలన్ని వాటంతట అవే బయటకు రావటం ఖాయం.
This post was last modified on February 28, 2022 10:21 am
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…