న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకున్నా.. తనదైన టాలెంట్తో స్టార్ హీరోగా ఎదిగి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ను సంపాదించుకున్నాడీయన. అయితే నాని తన ఇన్నేళ్ల కెరీర్లో ఒక వ్యక్తిని మాత్రం వేరే లెవల్లో వాడేసుకున్నాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో కాదు నటసింహం నందమూరి బాలకృష్ణ. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
నాని తన రెండో చిత్రమైన `రైడ్`లో బాలయ్య హిట్ సాంగ్ `దంచవే మేనత్త కూతురా`ను రీమిక్స్ చేశాడు. అప్పట్లో ఈ సాంగ్ తెగ వైరల్ అవ్వడమే కాదు.. రైడ్ చిత్రంపై మంచి హైప్ క్రియేట్ అయ్యేలా చేసింది. అలాగే `కృష్ణగాడి వీర ప్రేమగాథ` సినిమాలో నాని ఏకంగా బాలయ్యకు వీరాభిమానిగా నటించి నందమూరి ఫ్యాన్స్ను ఓ రేంజ్లో ఆకట్టుకున్నాడు.
ఇక ఇప్పుడు కూడా బాలయ్యను వదిలేదే లే అని అంటున్నాడు నాని. `శ్యామ్ సింగ రాయ్`తో హిట్ ట్రాక్ ఎక్కిన నాని.. ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో `అంటే సుందరానికీ` అనే సినిమా చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో మలయాళ భామ నజ్రియా ఫహద్ హీరోయిన్గా నటిస్తోంది. నదియా, హర్షవర్ధన్, సుహాస్, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు.
అలాగే ఇందులో నాని బ్రాహ్మణ యువకుడు పాత్రలో కనిపించబోతున్నాడు. ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని బాలయ్య పుట్టినరోజైన జూన్ 10న విడుదల చేస్తున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. బాలయ్య బర్త్డే నాడు నాని సినిమాను రిలీజ్ చేస్తుండటంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. అంతేకాదు, నాని సినిమా హిట్ అంటూ విడుదలకు ముందే సోషల్ మీడియా వేదికగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
This post was last modified on February 27, 2022 1:55 pm
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…