మలయాళ బ్లాక్బస్టర్ ‘అయ్యప్పనుం కోషీయుం’కు రీమేక్గా తెరకెక్కిన చిత్రం ‘భీమ్లా నాయక్’. ఒరిజినల్ టైటిల్లో ప్రధాన పాత్రధారుల ఇద్దరి పేర్లూ ఉన్నాయి. సినిమాలో కూడా ఇద్దరికీ సమ ప్రాధాన్యం కనిపిస్తుంది. ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అన్నట్లుగా ఏమీ ఉండదు. ఐతే బిజు మీనన్ చేసిన అయ్యప్ప పాత్ర వేసే ఇంపాక్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఐతే తెలుగులోకి వచ్చేసరికి రీమేక్కు ‘భీమ్లా నాయక్’ అంటూ ఒక పాత్రను సూచించే టైటిల్ పెట్టి.. పవన్ చేసిన ఆ పాత్రకు విపరీతమైన ఎలివేషన్ ఇచ్చినట్లుగా కనిపించింది ప్రోమోలు చూస్తే.
ముందు ఈ టైటిల్ పెట్టి పవన్ లుక్సే వదలడం.. వరుసబెట్టి ఆ పాత్ర టీజర్, టైటిల్ సాంగ్ ఇలా ఒక్కొక్కటి రిలీజ్ చేసుకుంటూ వెళ్లడంతో రానా ఫ్యాన్స్ హర్టయిపోయారు. రానాకు బాగా ప్రాధాన్యం తగ్గించేస్తున్నారని.. అతను ఈ సినిమా ఒప్పుకుని తప్పు చేశాడని ఒక అభిప్రాయానికి వచ్చేశారు. రిలీజ్ ముంగిట కూడా రానా అభిమానులు నిరసన వ్యక్తం చేయడం కనిపించింది సోషల్ మీడియాలో. ఐతే ఇప్పుడు సినిమా చూసిన అందరికీ రానాకు సినిమాలో దక్కిన ప్రాధాన్యం ఏంటో అర్థమైంది. ఆ పాత్ర.. పవన్ క్యారెక్టర్కు ఎక్కడా తగ్గలేదు. రానా కెరీర్లోనే మైలురాయిలా నిలిచిపోయే పాత్ర ఇదని ముక్తకంఠంతో వ్యాఖ్యానిస్తున్నారు.
ఇక రానా పెర్ఫామెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తెరమీదికి అతను వస్తే చుట్టూ ఉన్న ఎవ్వరూ కనిపించని పరిస్థితి. ఆ స్థాయిలో అతను డామినేట్ చేశాడు. కొన్ని చోట్ల పవన్ను సైతం డామినేట్ చేసే స్థాయిలో అతను పెర్ఫామ్ చేశాడు. మహా పొడగరి అయిన రానా మామూలుగానే వేరే వాళ్లను స్క్రీన్ మీద కనిపించనివ్వడు.
ఇక బాగా పొగరున్న పాత్ర కావడం, అందుకు తగ్గ బాడీ లాంగ్వేజ్ చూపిస్తూ.. ఇంటెన్స్గా ఆ పాత్రను పెర్ఫామ్ చేయడంతో అతడి డామినేషన్ ఇంకా ఎక్కువ అయింది. ఆ మధ్య బాగా సన్నబడటం వల్ల రానా లుక్ దెబ్బ తిన్నట్లు కనిపించింది. కానీ ఇప్పుడు ఒకప్పటి బెస్ట్ లుక్ లోకి వచ్చేశాడు. దీంతో రానా ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షించాడు. ఇన్నాళ్లూ రానా సైడైపోతాడని ఫీలైన అభిమానులు.. సినిమా చూశాక కచ్చితంగా అభిప్రాయం మార్చుకుంటారనడంలో సందేహం లేదు.
This post was last modified on February 26, 2022 5:15 pm
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…
రాజమౌళి సినిమాలంటే చెప్పిన డేటుకి రావు అని ప్రేక్షకులు ముందే బలంగా ఫిక్సయిపోయి ఉంటారు. ఆయన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’…